బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#గాంధీ

55 articles

మదనపల్లెలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా
జిల్లా వార్తలు

మదనపల్లెలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా

మదనపల్లె దొంతివీధిలోని కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని సద్భావనా దివస్‌గా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎస్. రెడ్డీ సాహెబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ సేవలను స్మరించడంతో పాటు కాంగ్రెస్ పాలనలో దేశ అభివృద్ధి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలను ప్రస్తావించారు. ఇదే వేడుకలో పలువురు యువకులు బి. శరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, యువత ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

20, ఆగ 2026

దువ్వూరు KGBVలో విద్యార్థినులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన
జిల్లా వార్తలు

దువ్వూరు KGBVలో విద్యార్థినులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన

మైదుకూరు మండలం దువ్వూరులోని KGBVలో విద్యార్థినులకు మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ ఎన్. కవితా ప్రసన్న చదువు ఒత్తిడి, సామాజిక మాధ్యమాల ప్రభావం, నిద్ర, క్రీడలు, యోగా, కౌన్సిలింగ్ ప్రాముఖ్యతపై వివరించి, లక్షణాలు కనిపించినప్పుడు నిపుణులను సంప్రదించాలని సూచించారు. దువ్వూరు, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మానసిక ఆరోగ్య సేవలు, కౌన్సిలింగ్, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

20, ఆగ 2026

చౌడేపల్లిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా
జిల్లా వార్తలు

చౌడేపల్లిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా

పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లిలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం భాగంగా వంద అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించగా, విద్యార్థులు, బీజేపీ నాయకులు, అధికారులు పాల్గొని దేశభక్తి నినాదాలతో ప్రాంతాన్ని సందడిమయం చేశారు. ర్యాలీ ముగింపులో బస్టాండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి దేశ సేవకు సంకల్పం వ్యక్తం చేయగా, మధ్యలో వెళ్లిపోయిన మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి తీరుపై కొంతమంది బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

13, ఆగ 2026

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగిస్తున్న బీజేపీ: సీపీఐ విమర్శ
జిల్లా వార్తలు

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగిస్తున్న బీజేపీ: సీపీఐ విమర్శ

ప్రొద్దుటూరులో CPI నేత గాలి చంద్ర, BJP ప్రభుత్వం ప్రజల ఆస్తైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తోందని విమర్శించారు. RSS అనుబంధ వ్యక్తులను కీలక రంగాల్లో నియమిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టామని, సెప్టెంబర్ 1న "చలో Delhi" కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

11, ఆగ 2026

ప్రొద్దుటూరులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతోంది. మల్లెల లింగారెడ్డి గాంధీ పార్కులో వాకర్స్‌ను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు పథకాల ప్రయోజనాలు, అమలు పరిస్థితులను బూత్ స్థాయిలో ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇతర ప్రాంతాలు, గ్రామాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

9, ఆగ 2026

‘కొరియన్ కనకరాజు’ రివ్యూ: హారర్ కామెడీతో వరుణ్‌తేజ్ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్?
సినిమా రివ్యూలు

‘కొరియన్ కనకరాజు’ రివ్యూ: హారర్ కామెడీతో వరుణ్‌తేజ్ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్?

‘కొరియన్ కనకరాజు’ హారర్ కామెడీగా వరుణ్‌తేజ్‌కు రెండు కోణాల్లో నటించే అవకాశం ఇచ్చిన చిత్రం. కథ, లాజిక్, క్లైమాక్స్‌లో బలహీనతలు ఉన్నా, సత్య–మురళీధర్ గౌడ్ కామెడీ, వరుణ్‌తేజ్ టైమింగ్, కొరియా నేపథ్యం, తమన్ సంగీతం ప్రధాన బలాలు. హారర్ కామెడీ జానర్, థియేటర్‌లో గుంపుగా కూర్చొని నవ్వుకోవడం ఇష్టపడే వారికి ఇది సరదా ఎంటర్‌టైనర్‌గా అనిపించే అవకాశం ఉంది.

7, ఆగ 2026

తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు
జిల్లా వార్తలు

తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు

రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాల నేపథ్యంలో తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి ప్రాంతంలో జరగాల్సిన రిలే నిరాహార దీక్షకు వెళ్లేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ఆయన నివాసం వద్దే అడ్డుకున్నారు. దీని వల్ల అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొగా, కార్యక్రమం నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది. నిరసనల నేపథ్యంలో చట్టవ్యవస్థ, శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారని భావిస్తున్నారు.

6, ఆగ 2026

విధి నిర్వహణకు ఆటంకం: ప్రొద్దుటూరు కేసులో ముగ్గురికి జరిమానా, శిక్ష
జిల్లా వార్తలు

విధి నిర్వహణకు ఆటంకం: ప్రొద్దుటూరు కేసులో ముగ్గురికి జరిమానా, శిక్ష

వై.ఎస్.ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ను అడ్డగించి దుర్భాషలాడుతూ, ప్రాణహానీ బెదిరింపులు చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను కోర్టు దోషులుగా తేల్చింది. Proddatur 1 Town Police Stationలో 2021లో నమోదైన Cr.No.224/2021 కేసులో ముగ్గురికీ ఒక్కొక్కరికి రూ.5,500 జరిమానా, చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష విధించింది.

5, ఆగ 2026

‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ విడుదల..
సినిమా

‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ విడుదల..

వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. థ్రిల్‌, హాస్యం, హారర్‌ మేళవింపుతో, కొరియన్ నేపథ్యంపై సాగే ఈ చిత్రం ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కానుండగా, తమన్ సంగీతం, సాంకేతిక నిపుణుల పనితనం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

2, ఆగ 2026

ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్‌పై ఫిర్యాదు..   రాహుల్‌గాంధీతో పాటు పలువురిపై ఎఫ్‌ఐఆర్
జాతీయం

ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్‌పై ఫిర్యాదు.. రాహుల్‌గాంధీతో పాటు పలువురిపై ఎఫ్‌ఐఆర్

ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్‌ వివాదానికి దారి తీసింది. అయోధ్య విరాళాల చోరీపై పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు ప్రత్యేక స్కిట్ వేశారు.

1, ఆగ 2026

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌
జాతీయం

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌

హోం మంత్రి అమిత్‌షానుద్దేశిస్తూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలుచేశారంటూ ఆయనపై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్‌ ఇచ్చారు.

31, జులై 2026

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌
జాతీయం

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ‘చలో పార్లమెంట్’ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడి ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాదే బాధ్యతని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు.

29, జులై 2026

విద్యార్థినులతో వ్యక్తిగత సేవలు.. టీచర్ రూపా నిర్వాకంపై తీవ్ర విమర్శలు
జిల్లా వార్తలు

విద్యార్థినులతో వ్యక్తిగత సేవలు.. టీచర్ రూపా నిర్వాకంపై తీవ్ర విమర్శలు

శ్రీసత్యసాయి జిల్లాలోని నంబుళపూలకుంట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో టీచర్ రూపా విద్యార్థినులతో వ్యక్తిగత సేవలు చేయించుకున్న వీడియోలు వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యాశాఖ అధికారులు ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసి, నివేదికల ఆధారంగా రూపాపై కఠిన శాఖాపర చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

29, జులై 2026

గాంధీధామ్‌లో నేపాల్ మహిళ హత్య కలకలం
జాతీయం

గాంధీధామ్‌లో నేపాల్ మహిళ హత్య కలకలం

గుజరాత్‌లోని కచ్ జిల్లా గాంధీధామ్‌లో నేపాల్‌కు చెందిన హిందూ మహిళ సోనమ్ సునార్ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నేపాల్ నుంచి వచ్చిన సోనమ్, గాంధీధామ్‌లో నివసిస్తున్న సుల్తాన్ జుసాబ్ సుమ్రాను ప్రేమించి 2011లో వివాహం చేసుకుంది. వివాహం అనంతరం కొంతకాలం దంపతుల జీవితం సజావుగా సాగినప్పటికీ, తరువాత పరిస్థితులు మారాయి.

29, జులై 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు
జాతీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రహ్లాద్ జోషి అత్యంత నీచమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి అంటూ రాహుల్ మండిపడ్డారు.

28, జులై 2026

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?..   అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ
జాతీయం

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?.. అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ

నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు సమాధానం చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారని ఆమె సూటిగా ప్రశ్నించారు.

28, జులై 2026

నేషనల్ హెరాల్డ్ కేసు..  : సోనియా, రాహుల్‌కు మూడు వారాల గడువు
జాతీయం

నేషనల్ హెరాల్డ్ కేసు.. : సోనియా, రాహుల్‌కు మూడు వారాల గడువు

నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది.

28, జులై 2026

ప్రొద్దుటూరు ఇండియన్ బ్యాంక్‌లో నగదు కొరత.. ఖాతాదారుల ఆందోళన
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు ఇండియన్ బ్యాంక్‌లో నగదు కొరత.. ఖాతాదారుల ఆందోళన

ప్రొద్దుటూరు గాంధీరోడ్డు ఇండియన్ బ్యాంక్ శాఖలో సోమవారం నగదు కొరత, సర్వర్ లోపం కారణంగా లావాదేవీలు తీవ్రంగా మందగించాయి. నగదు డ్రా, గోల్డ్ లోన్స్ కోసం ఉదయం నుంచే వచ్చిన ఖాతాదారులు గంటల తరబడి వేచి చూడాల్సి రావడంతో అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశారు. నగదు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బ్యాంక్ అధికారులు చెప్పగా, ఖాతాదారుల ఇబ్బందులను త్వరగా తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.

27, జులై 2026

విద్యార్థులకు  ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ
జాతీయం

విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ

విద్యార్థులపై కాల్పులు, లాఠీఛార్జీలు, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై అణచివేత ధోరణి సరికాదని హితవుపలికారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

27, జులై 2026

హోం మంత్రి అమిత్ షాకి రాహుల్ గాంధీ ఘాటు లేఖ
జాతీయం

హోం మంత్రి అమిత్ షాకి రాహుల్ గాంధీ ఘాటు లేఖ

ఢిల్లీలో విద్యార్థులపై దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటు లేఖ రాశార ు.

26, జులై 2026

నంద్యాలలో మహిళ గొలుసు లాక్కునే ప్రయత్నం
జిల్లా వార్తలు

నంద్యాలలో మహిళ గొలుసు లాక్కునే ప్రయత్నం

నంద్యాల గాంధీచౌక్ సమీపంలోని కాళికాంబ ఆలయం వద్ద మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కునేందుకు గుర్తు తెలియని వ్యక్తి ప్రయత్నించగా, ఆమె కేకలు వేయడంతో ప్రజలు స్పందించగా ఆగంతకుడు జనసందోహాన్ని ఆసరాగా చేసుకుని పరారయ్యాడు. కేసును దొంగతన యత్నంగా నమోదు చేసిన నంద్యాల టౌన్ పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుడి గుర్తింపుకు ప్రత్యేక బృందంతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

26, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్

నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ అవకతవకలతో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించి, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

25, జులై 2026

విద్యా వ్యవస్థ సంక్షోభానికి ప్రధానే కారణం..: రాహుల్ గాంధీ ధ్వజం
జాతీయం

విద్యా వ్యవస్థ సంక్షోభానికి ప్రధానే కారణం..: రాహుల్ గాంధీ ధ్వజం

ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యా వ్యవస్థ సంక్షోభానికి ఆయనే బాధ్యుడని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు..

24, జులై 2026

నీట్‌ నిరసనకారులను శత్రువుల్లా చూస్తోంది మోదీ ప్రభుత్వం: సోనియా గాంధీ విమర్శ
జాతీయం

నీట్‌ నిరసనకారులను శత్రువుల్లా చూస్తోంది మోదీ ప్రభుత్వం: సోనియా గాంధీ విమర్శ

నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటనల నేపథ్యంలో విద్యార్థుల నిరసనలను మోదీ ప్రభుత్వం శత్రువుల్లా చూస్తోందని సోనియా గాంధీ ది హిందూ పత్రికలో వ్యాసం ద్వారా తీవ్రంగా విమర్శించారు. జవాబుదారీతనంతో స్పందించాల్సిన సమయంలో లాఠీచార్జీలు, టియర్‌గ్యాస్‌ ప్రయోగాలు చేసి విద్యార్థుల ఉద్యమాలను అణచివేయడం దురదృష్టకరమని ఆమె పేర్కొంటూ, విద్యా రంగాన్ని దిగజార్చే విధంగా నిధులు కోతపెట్టి, ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి, ఎన్‌టీఏ బలోపేతంపై సిఫార్సులను పట్టించుకోకుండా, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచిందని వ్యాఖ్యానించారు.

24, జులై 2026

విద్యార్థుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు :  ఇండియా కూటమి కొవ్వొత్తుల ర్యాలీ
జాతీయం

విద్యార్థుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు : ఇండియా కూటమి కొవ్వొత్తుల ర్యాలీ

నీట్‌ పేపర్‌ లీకేజీలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా నిలవాలని జాతీయస్థాయిలో విపక్ష కూటమి నిర్ణయించింది.

23, జులై 2026

చర్చకు మేము సిద్ధం.. రాహుల్ పారిపోతున్నారు.. :  బీజేపీ నేత నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!
జాతీయం

చర్చకు మేము సిద్ధం.. రాహుల్ పారిపోతున్నారు.. : బీజేపీ నేత నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!

NEET పరీక్ష వ్యవహారం, పేపర్ లీక్‌ల అంశంపై పార్లమెంట్ వేదికగా ఓపెన్ డిబేట్‌కు సిద్ధమా? అని BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విపక్షాలకు సవాల్ విసిరారు. సభ ముందుకు వస్తే వారి 'ద్వంద్వ నీతి' బయటపడుతుందనే వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు.

23, జులై 2026

యువత భవిష్యత్తును నాశనం చేశారు..: ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ తీవ్ర విమర్శలు
జాతీయం

యువత భవిష్యత్తును నాశనం చేశారు..: ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ తీవ్ర విమర్శలు

'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు'.. అంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.

23, జులై 2026

నీట్ పేపర్ లీకేజీలపై రాహుల్ గాంధీ ఆగ్రహం: విద్యార్థుల మూడు డిమాండ్లు చట్టబద్ధమే
జాతీయం

నీట్ పేపర్ లీకేజీలపై రాహుల్ గాంధీ ఆగ్రహం: విద్యార్థుల మూడు డిమాండ్లు చట్టబద్ధమే

దేశంలో నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గత 10 ఏళ్లలో 152 లీకేజీలు జరిగినా ఎవరికీ శిక్ష పడలేదని విమర్శించారు. ఈ లీకేజీల ప్రభావం 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలపై పడిందని పేర్కొంటూ, విద్యార్థుల మూడు డిమాండ్లు – Union Education Minister ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థులపై దాడుల్లో పాల్గొన్న వారిని శిక్షించడం, Prime Minister అధికారిక క్షమాపణ – పూర్తిగా చట్టబద్ధమైనవేనని ఆయన స్పష్టం చేశారు.

22, జులై 2026

కదిరి రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడిపై దాడి
జిల్లా వార్తలు

కదిరి రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడిపై దాడి

కదిరి టౌన్‌కు చెందిన కడప పటాన్ ఇంతియాజ్‌పై ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన కదిరి రైల్వే స్టేషన్ సమీపంలోని దేవళం ఉట్టి వద్ద చోటుచేసుకుంది.పోలీసుల సమాచారం ప్రకారం, ఇంతియాజ్ (29), తండ్రి కడప రహంతుల్లా, స్థానిక ఎంఆర్వో కార్యాలయం సమీపంలో జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు

22, జులై 2026

గాంధీ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్
రాజకీయాలు

గాంధీ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్

హైదరాబాద్ నాంపల్లిలో గాంధీ భవన్ ముట్టడి ప్రయత్నం సందర్భంగా బీజేపీ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు వార్తతో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

22, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters