బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#జైలు

25 articles

విధి నిర్వహణకు ఆటంకం: ప్రొద్దుటూరు కేసులో ముగ్గురికి జరిమానా, శిక్ష
జిల్లా వార్తలు

విధి నిర్వహణకు ఆటంకం: ప్రొద్దుటూరు కేసులో ముగ్గురికి జరిమానా, శిక్ష

వై.ఎస్.ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ను అడ్డగించి దుర్భాషలాడుతూ, ప్రాణహానీ బెదిరింపులు చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను కోర్టు దోషులుగా తేల్చింది. Proddatur 1 Town Police Stationలో 2021లో నమోదైన Cr.No.224/2021 కేసులో ముగ్గురికీ ఒక్కొక్కరికి రూ.5,500 జరిమానా, చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష విధించింది.

5, ఆగ 2026

తల్లిదండ్రుల‌పై వేధింపులు – నంద్యాల కోర్టు యువ‌కుడికి జైలు శిక్ష
జిల్లా వార్తలు

తల్లిదండ్రుల‌పై వేధింపులు – నంద్యాల కోర్టు యువ‌కుడికి జైలు శిక్ష

నంద్యాల కోర్టు తల్లిదండ్రుల‌పై నిరంతరం వేధింపులకు పాల్పడిన బండి ఆత్మకూరు మండలం పార్నపల్లెకు చెందిన విజయవర్ధన్‌కు జైలు శిక్ష విధించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, ఆధారాలతో కోర్టులో హాజరుపరచగా, నిందితుడి దోషం నిర్ధారించబడింది. తల్లిదండ్రుల‌పై వేధింపుల కేసుల్లో జైలు శిక్షలు అరుదుగా ఉండే నేపథ్యంలో ఈ తీర్పు న్యాయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

31, జులై 2026

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ
రాజకీయాలు

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. నిర్ణయించిన సమయం ముగిసిన తర్వాత జైలు వద్దకు చేరుకోవడంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.

30, జులై 2026

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ..   పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌
రాజకీయాలు

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

29, జులై 2026

డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లనున్న షేక్ హసీనా
అంతర్జాతీయం

డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లనున్న షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ ఏడాది డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుని, అరెస్టు, జైలు, ప్రాణహాని ప్రమాదాలు ఉన్నప్పటికీ ప్రజల పిలుపు కారణంగా తన నిర్ణయాన్ని మార్చుకోబోనని స్పష్టం చేశారు. భారత్‌కు అప్పగింతపై జరుగుతున్న చర్చలకు, తాను స్వయంగా తిరిగి వెళ్లాలన్న నిర్ణయానికి సంబంధం లేదని ఆమె పేర్కొంటూ, తనపై ఉన్న మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను రాజకీయ ఉద్దేశాలతో చేసినవేనని ఖండించారు.

29, జులై 2026

లోక్‌సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లు  ప్రవేశపెట్టిన కేంద్రం..
జాతీయం

లోక్‌సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..

దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం-2024లో కీలక సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

27, జులై 2026

పేపర్‌ లీక్‌కు సుదీర్ఘ జైలు.. భారీ జరిమానా..  : కీలక సవరణలకు  సిద్ధమైన కేంద్రం
జాతీయం

పేపర్‌ లీక్‌కు సుదీర్ఘ జైలు.. భారీ జరిమానా.. : కీలక సవరణలకు సిద్ధమైన కేంద్రం

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతమైన నేపథ్యంలో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. లీక్‌లకు (Paper Leak) చెక్‌ పెట్టే అంశంపై శుక్రవారం జరిగే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని స్వయంగా ప్రధాని మోదీ వీడియో ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

24, జులై 2026

చట్టం ఇచ్చిన చివరి అవకాశం, ఉల్లంఘనకు కఠిన చర్యలు
జిల్లా వార్తలు

చట్టం ఇచ్చిన చివరి అవకాశం, ఉల్లంఘనకు కఠిన చర్యలు

శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై పోలీసులు బైండోవర్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. బైండోవర్‌ విధించిన తర్వాత కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే ఫోర్ఫీచర్‌, భారీ జరిమానా, డిటెన్షన్‌, జుడీషియల్‌ రిమాండ్‌ తో పాటు జైలుశిక్ష కూడా తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, సురక్షిత సమాజ నిర్మాణంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని జిల్లా పోలీసు శాఖ కోరుతోంది.

24, జులై 2026

మాజీ మంత్రి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్
రాజకీయాలు

మాజీ మంత్రి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్

వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

23, జులై 2026

అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు  : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
జాతీయం

అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదో తరగతి పేపర్ లీక్ అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మరి ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయలేదని ఆ పార్టీ నేతలను ఆయన నిలదీశారు.

23, జులై 2026

విశాఖ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుదల
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుదల

విశాఖ జిల్లాలో గత ఐదు రోజుల్లో సెంట్రల్ జైలు ఖైదీ, ప్రైవేటు ఆసుపత్రిలో గర్భిణి, గోపాలపట్నం యువకుడు సహా ఐదుగురిలో కోవిడ్ లక్షణాలు గుర్తించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జైలు, ఆసుపత్రి వంటి గుంపుగా ఉండే ప్రదేశాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలు మాస్కులు, చేతుల పరిశుభ్రత, గుంపులు నివారించడం వంటి నియమాలను కొనసాగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

23, జులై 2026

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ముత్యం వెంకటరమణకు 14 రోజుల రిమాండ్
తెలంగాణ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ముత్యం వెంకటరమణకు 14 రోజుల రిమాండ్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో TGREDCO డీజీఎం, మాజీ Transco డీఈ ముత్యం వెంకటరమణను ACB అరెస్టు చేసి, జడ్జి 14 రోజుల న్యాయ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు. 14 గంటల సోదాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.28 కోట్ల, బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.200 కోట్ల ఆస్తులు, నగదు, బంగారం, రియల్ ఎస్టేట్ సంస్థల వివరాలు బయటపడ్డాయి.

23, జులై 2026

అనంతపురం జిల్లా గుత్తి ప్రత్యేక ఉపకారాగారంలో అవినీతి ఆరోపణలు
జిల్లా వార్తలు

అనంతపురం జిల్లా గుత్తి ప్రత్యేక ఉపకారాగారంలో అవినీతి ఆరోపణలు

అనంతపురం జిల్లా గుత్తి ప్రత్యేక ఉపకారాగారంలో ముద్దాయిలను కలవడానికి వచ్చే బంధువుల నుంచి "మామూలు" పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. డబ్బు ఇవ్వకపోతే లోపలికి అనుమతించకపోవడం, పేద కుటుంబాలు తమ బంధువులను కలవలేకపోవడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ, జైలు యాజమాన్యం, ఉన్నతాధికారులు తక్షణ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

22, జులై 2026

‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. :  కేంద్రం కీలక బిల్లు సిద్ధం
జాతీయం

‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. : కేంద్రం కీలక బిల్లు సిద్ధం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కీలక బిల్లు తీసుకురానుంది. దీనికి సంబంధించిన జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026 బిల్లు ద్వారా జాతీయ గీతం ‘‘వందేమాతరం’’ ఆలాపనను అవమానించడం లేదా అడ్డుకోవడాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది.

17, జులై 2026

ఏపీ లిక్కర్ స్కాం.. నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ
నేరాలు

ఏపీ లిక్కర్ స్కాం.. నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్‌కు మూడు రోజుల ఈడీ కస్టడీని నాంపల్లి కోర్టు మంజూరు చేసింది.

16, జులై 2026

సాయి కృష్ణ కేసులో సుప్రీంకోర్టుకు సిట్‌..
ఆంధ్రప్రదేశ్

సాయి కృష్ణ కేసులో సుప్రీంకోర్టుకు సిట్‌..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

9, జులై 2026

శ్రీలంక జైలులో ఘర్షణలు.. 25 మంది మృతి
అంతర్జాతీయం

శ్రీలంక జైలులో ఘర్షణలు.. 25 మంది మృతి

శ్రీలంక నెగోంబో జైలులో మాదక ద్రవ్యాల వ్యవహారంపై రెండు ఖైదీ గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగి భారీ అల్లర్లకు దారితీసి, మృతుల సంఖ్య 25కి చేరగా మరో 100 మంది గాయపడ్డారు. అధిక జనసాంద్రత, భద్రతా లోపాలు, అంతర్గత విభేదాలు ఈ ఘటనకు కారణమని అధికారులు, విశ్లేషకులు భావిస్తున్నారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలను పెంచి, డ్రోన్‌లు, హెలికాప్టర్‌ను మోహరించి, సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

6, జులై 2026

వైకాపా నేతలపై ఎమ్మెల్యే ఆది ఘాటు వ్యాఖ్యలు
జిల్లా వార్తలు

వైకాపా నేతలపై ఎమ్మెల్యే ఆది ఘాటు వ్యాఖ్యలు

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైకాపా నేతలపై, ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా పాలనలో తనపై పెట్టిన కేసులు, ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల కుటుంబం ఎదుర్కొన్న నష్టాలను గుర్తుచేస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరో మూడు సంవత్సరాలు కొనసాగుతుందని, ఆ సమయంలో వైకాపా నేతలకు తగిన రాజకీయ పాఠం చెబుతానని హెచ్చరించారు.

2, జులై 2026

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్
తెలంగాణ

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు మల్కాజ్‌గిరి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచార యత్నం ఆరోపణలతో మే 8న కేసు, మే 16న అరెస్ట్ కాగా, దాదాపు నెల తర్వాత లభించిన ఈ బెయిల్ రాష్ట్ర రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

20, జూన్ 2026

మైనర్ బాలికపై అఘాయిత్యం – నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష
నేరాలు

మైనర్ బాలికపై అఘాయిత్యం – నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష

కడపలో మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించి, ఆ దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేసిన టీచర్ వడిషా వెంకటేశ్వర్లుకు ఫోక్సో కోర్టు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించగా, సాక్ష్యాధారాల ఆధారంగా నేరం రుజువైందని న్యాయమూర్తి M.A. సోమశేఖర్ తీర్పులో పేర్కొన్నారు.

19, జూన్ 2026

రూ. 954 కోట్ల కుంభకోణం: భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజాని అరెస్ట్‌
అంతర్జాతీయం

రూ. 954 కోట్ల కుంభకోణం: భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజాని అరెస్ట్‌

సుమారు 100 మిలియన్ డాలర్లు (రూ. 954 కోట్లు) విలువైన ఆర్థిక కుంభకోణం కేసులో భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజానిని అమెరికా అధికారులు కాలిఫోర్నియాలో అరెస్ట్ చేశారు. Cantor Group V LLC ద్వారా రియల్ ఎస్టేట్ లోన్లకు తాకట్టు ఆస్తుల విలువలను కృత్రిమంగా పెంచి చూపడం, నకిలీ టైటిల్ ఇన్సూరెన్స్ పత్రాలు సృష్టించడం, షెల్ కంపెనీలతో బ్యాంకును మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

11, జూన్ 2026

సుబ్రమణ్యం హత్య కేసు విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్

సుబ్రమణ్యం హత్య కేసు విచారణ వాయిదా

సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడైన MLC అనంతబాబును రాజమండ్రి కోర్టులో పోలీసులు హాజరుపర్చగా, జైలులో ప్రత్యేక సదుపాయాల కోసం ఆయన తరఫు పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు వినిపించుకున్న కోర్టు విచారణను ఈ నెల 18కు వాయిదా వేసింది. ఆరోగ్య, భద్రతా కారణాలతో ప్రత్యేక సదుపాయాలు ఇవ్వాలన్న రక్షణ వాదనకు, నేర తీవ్రత దృష్ట్యా సాధారణ ఖైదీలా చూడాలన్న ప్రభుత్వ వాదనకు సంబంధించి కోర్టు ఇంకా సమగ్రంగా పరిశీలించి తరువాత నిర్ణయం తీసుకోనుంది.

9, జూన్ 2026

ప్రొద్దుటూరులో ఆర్ఎంపీ డాక్టర్లు, మెడికల్ స్టోర్లపై బెదిరింపులు:  కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో ఆర్ఎంపీ డాక్టర్లు, మెడికల్ స్టోర్లపై బెదిరింపులు: కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్

ప్రొద్దుటూరులో కొందరు గ్రూపులుగా ఏర్పడి ఆర్ఎంపీ డాక్టర్లు, మెడికల్ స్టోర్ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆరోపించారు. ఈ దందాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ప్రైవేట్ పాఠశాలలపై కూడా ఇలాంటి బ్లాక్ మెయిల్ ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

6, జూన్ 2026

దమ్ముంటే జైలుకు పంపు..  మంత్రి కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్‌
రాజకీయాలు

దమ్ముంటే జైలుకు పంపు.. మంత్రి కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్‌

మంత్రి కొల్లు రవీంద్ర తాను బియ్యం దొంగతనం చేశానని ఆరోపణలు చేస్తున్నారని, నిజంగా దమ్ముంటే అధికారాలు వినియోగించి తనపై విచారణ జరిపి జైలుకు పంపాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత పేర్ని నాని సవాల్‌ విసిరారు. 2029 నాటికి చంద్రబాబు సర్కార్‌ పతనం ఖాయమని వ్యాఖ్యానిస్తూ, ఆ లోపు తనను లోపల పెట్టే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్‌ కోటా పెంపు, ఆటల ఎంపిక, పేకాట నుంచి టీచర్ల నియామకాల వివాదంపై చంద్రబాబు, హోంమంత్రి అనిత, విద్యాశాఖ మంత్రి లోకేష్‌లను ఆయన తీవ్రంగా విమర్శించారు.

4, జూన్ 2026

లంచం కేసులో వల్లూరు వీఆర్వోకు 7 ఏళ్ల జైలు, రూ.20 వేల జరిమానా
జిల్లా వార్తలు

లంచం కేసులో వల్లూరు వీఆర్వోకు 7 ఏళ్ల జైలు, రూ.20 వేల జరిమానా

వైఎస్సార్‌ కడప జిల్లా వల్లూరు గ్రామ వీఆర్వో చిత్రాల గంగమ్మకు లంచం కేసులో దోషిగా తేల్చిన కర్నూలు అనిశా ప్రత్యేక కోర్టు ఏడేళ్ల సాదారణ జైలుశిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. రైతు పోలు మల్లికార్జునరెడ్డి నుంచి రూ.5 వేల లంచం తీసుకుంటూ 2018లో ఉచ్చులో చిక్కుకున్న ఈ కేసులో, సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా తీర్పు వెలువరించడంతో పాటు రైతుకు రూ.20 వేల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters