బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నీట్‌

28 articles

కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష
జిల్లా వార్తలు

కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష

కర్నూలు జిల్లాలో నీట్ పీజీ-2026 పరీక్ష ఆదివారం ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 2,144 మంది అభ్యర్థులు హాజరయ్యగా, కలెక్టర్ ఏ.సిరి పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించగా, పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలు, వైద్య సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ వంటి అన్ని ఏర్పాట్లు సజావుగా అమలయ్యాయి.

30, ఆగ 2026

నీట్‌ పరీక్షలో తక్కువ మార్కులు..  విద్యార్థిని ఆత్మహత్య
జిల్లా వార్తలు

నీట్‌ పరీక్షలో తక్కువ మార్కులు.. విద్యార్థిని ఆత్మహత్య

మాల పుష్పావతి (18) నీట్‌ పరీక్షలో 347 మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్‌లో 965 మార్కులు సాధించిన ఆమెను చిన్ననాటి నుంచే వైద్యురాలిని చేయాలనే లక్ష్యంతో కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, గ్రామంలో విషాదం నెలకొంది.

2, ఆగ 2026

రిజర్వేషన్ హటావో..  దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!
జాతీయం

రిజర్వేషన్ హటావో.. దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!

దేశాన్ని కదిలించే ఉద్యమాలు ఎప్పుడూ ఒక్కరోజులో పుట్టవు. అవి నెమ్మదిగా రూపం దిద్దుకుంటాయి. ఒక సంఘటనతో మొదలవుతాయి. మరో ఘటనతో వేగం అందుకుంటాయి. చివరికి దేశమంతా మాట్లాడుకునే చర్చగా మారిపోతాయి.

1, ఆగ 2026

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్

నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ అవకతవకలతో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించి, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

25, జులై 2026

ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది ఉద్యోగులపై వేటు
జాతీయం

ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది ఉద్యోగులపై వేటు

నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీపై విద్యార్థులు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన తెలుపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్‌, జేఈఈ సహా పలు జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించే స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) 47 మంది ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

25, జులై 2026

పేపర్‌ లీక్‌కు సుదీర్ఘ జైలు.. భారీ జరిమానా..  : కీలక సవరణలకు  సిద్ధమైన కేంద్రం
జాతీయం

పేపర్‌ లీక్‌కు సుదీర్ఘ జైలు.. భారీ జరిమానా.. : కీలక సవరణలకు సిద్ధమైన కేంద్రం

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతమైన నేపథ్యంలో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. లీక్‌లకు (Paper Leak) చెక్‌ పెట్టే అంశంపై శుక్రవారం జరిగే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని స్వయంగా ప్రధాని మోదీ వీడియో ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

24, జులై 2026

నీట్‌ నిరసనకారులను శత్రువుల్లా చూస్తోంది మోదీ ప్రభుత్వం: సోనియా గాంధీ విమర్శ
జాతీయం

నీట్‌ నిరసనకారులను శత్రువుల్లా చూస్తోంది మోదీ ప్రభుత్వం: సోనియా గాంధీ విమర్శ

నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటనల నేపథ్యంలో విద్యార్థుల నిరసనలను మోదీ ప్రభుత్వం శత్రువుల్లా చూస్తోందని సోనియా గాంధీ ది హిందూ పత్రికలో వ్యాసం ద్వారా తీవ్రంగా విమర్శించారు. జవాబుదారీతనంతో స్పందించాల్సిన సమయంలో లాఠీచార్జీలు, టియర్‌గ్యాస్‌ ప్రయోగాలు చేసి విద్యార్థుల ఉద్యమాలను అణచివేయడం దురదృష్టకరమని ఆమె పేర్కొంటూ, విద్యా రంగాన్ని దిగజార్చే విధంగా నిధులు కోతపెట్టి, ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి, ఎన్‌టీఏ బలోపేతంపై సిఫార్సులను పట్టించుకోకుండా, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచిందని వ్యాఖ్యానించారు.

24, జులై 2026

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషి బదిలీ
జాతీయం

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషి బదిలీ

నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదం, విద్యార్థుల ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో కీలక మార్పు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్‌ జోషిని బదిలీ చేసి.. ఆయన స్థానంలో నరేశ్‌ పాల్‌ గంగ్వార్‌ను నియమించింది.

24, జులై 2026

విద్యార్థుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు :  ఇండియా కూటమి కొవ్వొత్తుల ర్యాలీ
జాతీయం

విద్యార్థుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు : ఇండియా కూటమి కొవ్వొత్తుల ర్యాలీ

నీట్‌ పేపర్‌ లీకేజీలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా నిలవాలని జాతీయస్థాయిలో విపక్ష కూటమి నిర్ణయించింది.

23, జులై 2026

జులై 24న దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపు.. హింసలో పాల్గొంటే పాస్‌పోర్ట్‌లు రద్దు? : పోలీస్
జాతీయం

జులై 24న దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపు.. హింసలో పాల్గొంటే పాస్‌పోర్ట్‌లు రద్దు? : పోలీస్

నీట్‌ పేపర్ లీక్‌కు కేంద్రం బాధ్యత వహించాలంటూ ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ జులై 24న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అయితే సీజేపీ నిరసనల హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. హింసలో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

23, జులై 2026

నీట్‌ వివాదంపై కమల్‌ హాసన్‌ స్పందన
సినిమా

నీట్‌ వివాదంపై కమల్‌ హాసన్‌ స్పందన

NEET పరీక్ష వివాదంపై కమల్‌ హాసన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రశ్నాపత్రాల లీకేజీ, అవినీతి, నిర్లక్ష్యంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి దురదృష్టకరమని పేర్కొన్నారు. ఒక చిన్నారి ప్రాణం కోల్పోయిన తర్వాతే వ్యవస్థ స్పందించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని, ఇప్పుడు అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పరీక్షా విధానంపై సమగ్ర పునర్విమర్శ చేసి, లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం, అధికారులు తక్షణ బాధ్యతాయుత చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

23, జులై 2026

సభల్లో తీవ్ర గందరగోళం..  పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా!
జాతీయం

సభల్లో తీవ్ర గందరగోళం.. పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా!

సభ్యుల నినాదాలు, ఆందోళనల నడుమ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నాల్గవ రోజు కూడా తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమయ్యాయి. నీట్‌ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం, అన్ని రాజకీయ పక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూ వెల్లడించారు.

23, జులై 2026

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌
జాతీయం

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌

నీట్‌ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దిల్లీలోని జంతరమంతర్‌ వద్ద మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.

23, జులై 2026

ప్రధాని నివాసం వద్ద రాహుల్‌ ధర్నా, నీట్‌ లీకేజీపై నిరసన
జాతీయం

ప్రధాని నివాసం వద్ద రాహుల్‌ ధర్నా, నీట్‌ లీకేజీపై నిరసన

ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసం సమీపంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ, ఢిల్లీలో పోలీసుల లాఠీఛార్జ్‌, అణిచివేత చర్యలకు నిరసనగా ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్‌ ఎంపీలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నీట్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు, బాధ్యులపై కఠిన చర్యలు, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

21, జులై 2026

నీట్‌ పేపర్‌ లీకేజీపై నిరసనలు తీవ్రం
జిల్లా వార్తలు

నీట్‌ పేపర్‌ లీకేజీపై నిరసనలు తీవ్రం

నీట్‌ పేపర్‌ లీకేజీపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయి. కడపలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ, ధర్నాలో నాయకులు విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, పరీక్షలపై నమ్మకం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, పరీక్షా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, బాధ్యులపై కఠిన చర్యలు, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

21, జులై 2026

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా
జాతీయం

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సోమవారం సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి.

20, జులై 2026

నీట్‌ యూజీ పునఃపరీక్ష ఫలితాలు విడుదల
విద్య

నీట్‌ యూజీ పునఃపరీక్ష ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా నిర్వహించిన NEET UG పునఃపరీక్ష ఫలితాలు విడుదల కాగా, 20 లక్షల మందికిపైగా హాజరైన వారిలో 11.21 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణులలో 58 శాతానికి పైగా బాలికలే ఉండగా, 715 మార్కులతో ఆర్యన్ గుప్త , పెన్షుల్ బన్సల్ అగ్రస్థానంలో నిలిచారు. 700కు పైగా మార్కులు సాధించిన 19 మంది 17 రాష్ట్రాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు.

17, జులై 2026

నీట్ రీ-ఎగ్జామ్‌లో నకిలీలు :  ఒకరి స్థానంలో ఇంకొకరు..
జాతీయం

నీట్ రీ-ఎగ్జామ్‌లో నకిలీలు : ఒకరి స్థానంలో ఇంకొకరు..

అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించిన నీట్‌-యూజీ రీ-ఎగ్జామ్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అభ్యర్థులకు బదులుగా వేరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడిన వ్యవహారాలు సంచలనంగా మారాయి. ఘటనపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టగా, ఒక్క బీహార్‌లోనే ఇప్పటివరకు 30 మందిని అరెస్ట్ చేశారు. ఈ మోసం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, నెట్‌వర్క్‌ను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి.

22, జూన్ 2026

ధైర్యంగా పరీక్షకు వెళ్లండి: నీట్‌ విద్యార్థులకు ధర్మేంద్ర ప్రధాన్‌ సూచన
విద్య

ధైర్యంగా పరీక్షకు వెళ్లండి: నీట్‌ విద్యార్థులకు ధర్మేంద్ర ప్రధాన్‌ సూచన

దేశవ్యాప్తంగా జరుగుతున్న NEET-UG re-exam సందర్భంగా దాదాపు 22 లక్షల మంది హాజరుకానుండగా, విద్యార్థులు ఆందోళన చెందకుండా ధైర్యంగా పరీక్ష రాయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సూచించారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవాలని, admit card, గుర్తింపు కార్డు, ఫోటోలు తప్పనిసరిగా తీసుకురావాలని NTA సూచించింది. ప్రశ్నపత్ర లీకేజీ వివాదాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సామాజిక మాధ్యమాలపై నిఘా, పోలీసు బందోబస్తు కల్పించారు.

21, జూన్ 2026

దిల్లీ జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ నిరసన
జాతీయం

దిల్లీ జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ నిరసన

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్‌ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ధర్నాకి దిగింది. విద్యా వ్యవస్థలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.

20, జూన్ 2026

నీట్‌ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌ : నిలిపివేత పిటీషన్లు కొట్టేసిన సుప్రీం
జాతీయం

నీట్‌ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌ : నిలిపివేత పిటీషన్లు కొట్టేసిన సుప్రీం

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ పరీక్షను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో జూన్‌ 21న పరీక్ష యథాతథంగా కొనసాగనుంది.

19, జూన్ 2026

టెలిగ్రామ్‌పై నిషేధం సరైందే.. పిటిషన్‌ కొట్టేసిన దిల్లీ హైకోర్టు
విద్య

టెలిగ్రామ్‌పై నిషేధం సరైందే.. పిటిషన్‌ కొట్టేసిన దిల్లీ హైకోర్టు

నీట్‌-యూజీ (2026) రీఎగ్జామ్‌ నేపథ్యంలో మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించడాన్ని దిల్లీ హైకోర్టు సమర్థించింది. కేంద్రం ఆంక్షలను సవాల్‌ చేస్తూ టెలిగ్రామ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది.

19, జూన్ 2026

టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు
నేరాలు

టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఈ యాప్‌ను ‘కొత్త డార్క్‌ వెబ్‌’గా పేర్కొన్న కేంద్రం.. ఇది నేరగాళ్లకు అడ్డగా మారిందని ఆరోపించింది. సైబర్‌ నేరగాళ్లు, అతివాదులు, డ్రగ్‌ ముఠా సభ్యులు చట్టం నుంచి తప్పించుకునేందుకు ఈ యాప్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారని దుయ్యబట్టింది.

18, జూన్ 2026

నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
జాతీయం

నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

నీట్‌ యూజీ–2026 పరీక్షను రద్దు చేసి దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష (రీ–ఎగ్జామ్‌) నిర్వహించాలన్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జూలై నెలకు వాయిదా వేసింది. జూన్‌ 21న జరగాల్సిన రీ–ఎగ్జామ్‌ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వు లు ఇచ్చేందుకు నిరాకరించింది.

18, జూన్ 2026

నెక్స్ట్.. వాట్సప్‌నూ బ్యాన్‌ చేస్తారా? : కేంద్రం తీరుపై రాహుల్‌ ఫైర్‌
జాతీయం

నెక్స్ట్.. వాట్సప్‌నూ బ్యాన్‌ చేస్తారా? : కేంద్రం తీరుపై రాహుల్‌ ఫైర్‌

నీట్‌ పునఃపరీక్ష (NEET retest) నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (MP Rahul Gandhi) తప్పుబట్టారు. కేంద్రం చర్య దొంగను పట్టుకోవడానికి బదులుగా.. బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడంలా ఉందంటూ ఎద్దేవా చేశారు.

17, జూన్ 2026

నీట్‌ రీటెస్ట్‌ నేపథ్యంలో టెలిగ్రామ్‌ యాప్‌పై బ్రేక్
విద్య

నీట్‌ రీటెస్ట్‌ నేపథ్యంలో టెలిగ్రామ్‌ యాప్‌పై బ్రేక్

NEET UG ప్రశ్నాపత్ర లీకేజీ నేపథ్యంలో జూన్‌ 21 రీటెస్ట్‌ దృష్ట్యా, జూన్‌ 22 వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్‌ వినియోగాన్ని కేంద్రం తాత్కాలికంగా పరిమితం చేసింది. NTA సిఫార్సుతో జూన్‌ 30 వరకు టెలిగ్రామ్‌ మెసేజ్‌ ఎడిటింగ్‌ సౌకర్యాన్ని కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసి, లీకేజీకి సంబంధించిన ఆధారాలు తారుమారు కాకుండా, NEET పరీక్ష సమగ్రతను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

16, జూన్ 2026

కాక్రోచ్‌ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కేపై దాడి
నేరాలు

కాక్రోచ్‌ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కేపై దాడి

కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కేపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అభిజిత్‌ను చెంపదెబ్బకొట్టారు. అపై తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అభిజిత్‌పై దాడి చేసిన వారిని పట్టుకుని.. కాక్రోచ్‌ కార్యకర్తలు చితక బాదారు.

15, జూన్ 2026

లాక్‌డౌన్‌లో నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ ప్రశ్నపత్ర తయారీదారులు
జాతీయం

లాక్‌డౌన్‌లో నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ ప్రశ్నపత్ర తయారీదారులు

నీట్‌ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌ ప్రశ్నపత్రాల రూపకల్పనలో పాల్గొన్న నిపుణులను ఎన్‌టీఏ అత్యంత భద్రత కలిగిన రహస్య ప్రాంగణంలో లాక్‌డౌన్‌లో ఉంచి, మొబైల్‌ వంటి కమ్యూనికేషన్‌ పరికరాలన్నింటినీ నిరోధించింది. పేపర్‌ లీక్‌ ఆరోపణల నేపథ్యంలో ప్రశ్నపత్రాల తయారీ నుంచి రవాణా వరకు మల్టీ లేయర్‌ భద్రతా వ్యవస్థ అమలు చేస్తూ, జూన్‌ 21న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో రీ-ఎగ్జామ్‌ నిర్వహించనుంది.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters