బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ప్రభుత్వానికి

30 articles

మెగా డీఎస్సీ–2025 తప్పుడు ప్రచారాన్ని చెక్: ఆత్మగౌరవ ర్యాలీ సిద్ధం
జిల్లా వార్తలు

మెగా డీఎస్సీ–2025 తప్పుడు ప్రచారాన్ని చెక్: ఆత్మగౌరవ ర్యాలీ సిద్ధం

మెగా డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయ నియామకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలను ఖండిస్తూ అభ్యర్థులు ‘ఛలో కర్నూల్ మెగా డీఎస్సీ–2025 ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి 42 మంది అభ్యర్థులు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జరిగే ర్యాలీలో పాల్గొంటున్నారు. ఉపాధ్యాయుల ఐక్యత, న్యాయమైన నియామకాలకు మద్దతు ప్రకటిస్తూ, నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వడం ఈ ర్యాలీ లక్ష్యంగా ఉంది.

8, ఆగ 2026

ప్రొద్దుటూరులో బీ.సి హాస్టల్ పరంబోకు భూమి ఆక్రమణ యత్నం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో బీ.సి హాస్టల్ పరంబోకు భూమి ఆక్రమణ యత్నం

ప్రొద్దుటూరులో బీ.సి హాస్టల్ సమీపంలోని ప్రభుత్వ పరంబోకు భూమిని జేసీబీలతో చదును చేసి ఆక్రమించేందుకు ప్రయత్నం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ యత్నం వెనుక ప్రొద్దుటూరు Telugu Desam Party కి చెందిన ఓ అగ్ర నాయకుడు ఉన్నట్టు వాదిస్తున్నారు. ఘటనపై అధికారులు ప్రత్యక్షంగా గమనిస్తున్నప్పటికీ, స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల భూమి రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

6, ఆగ 2026

ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌లో 10,743 ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోంశాఖ ఆమోదం
ఉద్యోగాలు

ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌లో 10,743 ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోంశాఖ ఆమోదం

ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌లో 10,743 కొత్త పోస్టుల భర్తీకి కేంద్ర హోంశాఖ ఆమోదం లభించింది. ఫైర్ ఆపరేటర్, ఎమర్జెన్సీ రెస్క్యూ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌తో పాటు ఇతర సాంకేతిక, సహాయక విభాగాల్లో ఖాళీలు నింపనున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఆర్థిక అనుమతి ఇచ్చిన తర్వాత DSSSB ద్వారా నియామక నోటిఫికేషన్ విడుదలై, దేశవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

5, ఆగ 2026

కావేరీ జలాల వివాదం..సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్
తమిళనాడు

కావేరీ జలాల వివాదం..సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్

కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ నీటిలో తమ వాటాను విడుదల చేయడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసింది.

3, ఆగ 2026

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ వినూత్న నిరసన
జాతీయం

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ వినూత్న నిరసన

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర కానుకల దొంగతనాలపై పార్లమెంటు ఎదుట  శుక్రవారం కాంగ్రెస్‌ వినూత్న రీతిలో నిరసన తెలిపింది.

31, జులై 2026

పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ బిల్లు 2026కు సోనమ్ వాంగ్‌చుక్ స్వాగతం
జాతీయం

పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ బిల్లు 2026కు సోనమ్ వాంగ్‌చుక్ స్వాగతం

పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ సవరణ బిల్లు 2026కు సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు తెలుపుతూ, యువత–ప్రభుత్వాల మధ్య విశ్వాసం బలపడితేనే దేశ నిర్మాణం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టే ఈ బిల్లు విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులకు దారితీస్తుందని ఆశిస్తూ, నీట్‌ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే కొట్టివేయాలని కేంద్రాన్ని కోరారు.

30, జులై 2026

పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జాతీయం

పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

సుప్రీంకోర్టు ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్‌లు ప్రారంభించి తర్వాత పోస్ట్-ఫాక్టో అనుమతులు ఇచ్చే విధానాన్ని నిలువరించింది. 2021లో కేంద్రం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండమ్‌ను చట్టవిరుద్ధమని కొట్టి, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 3 ప్రకారం గెజెట్ నోటిఫికేషన్ ద్వారానే ఇలాంటి మార్పులు చేయాలని స్పష్టం చేసింది. అయితే 2017 నోటిఫికేషన్, 2021 OM కింద ఇప్పటికే ఇచ్చిన అనుమతులను కొనసాగనిచ్చి, కొత్త దరఖాస్తులు స్వీకరించరాదని తీర్పు ఇచ్చింది.

29, జులై 2026

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ :  వెంటనే తొలగించాలని ఆదేశం.!
తెలంగాణ

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ : వెంటనే తొలగించాలని ఆదేశం.!

హైదరాబాద్‌ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ‘హైడ్రా’ కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏ.వి. రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. వరుస కోర్టు ధిక్కరణ కేసులపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

27, జులై 2026

బీమా బకాయిల విడుదలకు  కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ :  మంత్రి  అచ్చెన్నాయుడు
రాజకీయాలు

బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ : మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో బీమా బకాయిలు విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న సుమారు 1,900 కోట్ల పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడతలవారీగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

27, జులై 2026

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం
జాతీయం

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం

దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా మరో వీడియో రిలీజ్ చేశారు.

26, జులై 2026

కేవలం గంటలోనే శ్రీశైలం?:  బుల్లెట్ ట్రైన్ కు ప్రభుత్వం ప్రతిపాదన..
బిజినెస్

కేవలం గంటలోనే శ్రీశైలం?: బుల్లెట్ ట్రైన్ కు ప్రభుత్వం ప్రతిపాదన..

శ్రీశైలంకు బుల్లెట్ ట్రైన్ రానుందా.. హైదరాబాద్ నుంచి గంటలోనే శ్రీశైలంకు చేరుకోవచ్చా.. బుల్లెట్ రైలు వస్తే ఇది సాధ్యమే. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ రైల్ కారిడార్‌ను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది శ్రీశైలం మీదుగా వెళ్లేలా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సూచన చేసింది.

17, జులై 2026

9వ తరగతిలో మూడో భాష పెట్టొద్దు: సుప్రీంకోర్టు
జాతీయం

9వ తరగతిలో మూడో భాష పెట్టొద్దు: సుప్రీంకోర్టు

సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై విచారణలో సుప్రీంకోర్టు తొమ్మిదో తరగతిలో మూడో భాష ప్రవేశపెట్టడం విద్యార్థులకు అదనపు భారమని సూచించింది. కొత్త భాషను నేర్పాలనుకుంటే ఐదో లేదా ఆరో తరగతి నుంచే ప్రారంభించాలని, విద్యార్థుల మానసిక ఒత్తిడి, విద్యా భారం అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

16, జులై 2026

డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. వ్యూహాత్మకంగా ఎన్డీఏ?
జాతీయం

డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. వ్యూహాత్మకంగా ఎన్డీఏ?

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు మళ్లీ చర్చకు రావచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

16, జులై 2026

పాత పెన్షన్ పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్

పాత పెన్షన్ పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,715 మంది అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం (OPS) ఎంచుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2004 సెప్టెంబర్ 1కు ముందు నోటిఫికేషన్ ద్వారా ఎంపికై సేవలో చేరిన, ప్రస్తుతం Contributory Pension Scheme (CPS)లో ఉన్న ఉద్యోగులు మూడు నెలల్లోపు OPS ఆప్షన్ ఇవ్వాలి, ఒకసారి OPS ఎంచుకున్న తర్వాత తిరిగి CPSకు మారే అవకాశం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

14, జులై 2026

సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్‌ : పోలీస్ శాఖకు సీఎం ఆదేశాలు
రాజకీయాలు

సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్‌ : పోలీస్ శాఖకు సీఎం ఆదేశాలు

సోషల్ మీడియా అంశంపై ఏపీ కేబినెట్‌లో సీరియస్‌గా చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నేతలను కించపరుస్తూ వస్తున్న వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

10, జులై 2026

విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట!
తమిళనాడు

విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట!

తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ పత్రాల పంపిణీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

10, జులై 2026

ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనలపై కేంద్ర నోటీసులకు మెటా వివరణ
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనలపై కేంద్ర నోటీసులకు మెటా వివరణ

ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనలపై కేంద్రం జారీ చేసిన నోటీసులకు స్పందిస్తూ మెటా నిబంధనల ఉల్లంఘన, అనుచిత కంటెంట్, అనుమానాస్పద అకౌంట్లపై తీసుకుంటున్న చర్యలను వివరించింది. గత ఆరు నెలల్లో భారత్‌లో 1.6 లక్షల, ప్రపంచవ్యాప్తంగా గతేడాది 40 లక్షలకు పైగా అకౌంట్లను తొలగించినట్లు తెలిపి, ముఖ్యంగా చిన్నారుల భద్రత, లైంగిక దుర్వినియోగ కంటెంట్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొంది.

8, జులై 2026

అయోధ్య కేసు.. సిట్‌ చేతిలో కీలక అధరాలు
జాతీయం

అయోధ్య కేసు.. సిట్‌ చేతిలో కీలక అధరాలు

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో సిట్‌ సీసీటీవీ ఆధారాలతో కీలక వివరాలు బయటపెట్టింది. ఏప్రిల్‌ 27 నుంచి జూన్‌ 5 వరకు లెక్కింపు బాధ్యతలు చూసిన కొంతమంది సిబ్బంది దాదాపు 70 సార్లు నగదు, నగలను అపహరించినట్టు, భద్రతా వ్యవస్థల్లో తీవ్ర లోపాలు ఉన్నట్టు నివేదికలో పేర్కొంది. అవినాష్‌ శుక్లా, మనీష్‌ కుమార్‌ యాదవ్‌ సహా ఆరుగురికి ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించడంతో, గత ఐదేళ్ల ఖాతాలను రీఆడిట్‌ చేస్తూ ప్రభుత్వం తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది.

7, జులై 2026

మావోయిస్టుల ప్రస్థానం ముగిసిన నేపథ్యంలో.. నేతలకు భద్రత కుదింపు
నేరాలు

మావోయిస్టుల ప్రస్థానం ముగిసిన నేపథ్యంలో.. నేతలకు భద్రత కుదింపు

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌... తన ఎస్కార్టును వదిలివేశారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. డీజీపీ ఒక్కరే కాదు..సర్వీసులో ఉన్న మరో ఆరుగురు..

3, జులై 2026

పూర్తి కాలం అధికారంలో ఉంటాం!  డీఎంకే ప్రచారాన్ని కొట్టిపారేసిన తమిళనాడు సీఎం విజయ్
తమిళనాడు

పూర్తి కాలం అధికారంలో ఉంటాం! డీఎంకే ప్రచారాన్ని కొట్టిపారేసిన తమిళనాడు సీఎం విజయ్

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వంపై వస్తున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి విజయ్ గట్టి సమాధానమిచ్చారు. చెన్నైలో నిర్వహించిన మిత్రపక్షాల ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని, కూటమి నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

2, జులై 2026

పదవీ విరమణ రోజే సీబీఐ షాక్ : ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు..
జాతీయం

పదవీ విరమణ రోజే సీబీఐ షాక్ : ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు..

పదవీ విరమణ చేయాల్సిన రోజే హర్యానా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్ కు సీబీఐ భారీ షాక్ ఇచ్చింది. రూ.504 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో ఆయనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేసింది.

1, జులై 2026

త్వరలో సొంత భవనాల్లోకి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు
జిల్లా వార్తలు

త్వరలో సొంత భవనాల్లోకి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

చిత్తూరు జిల్లాలోని చిత్తూరు రూరల్‌, నగరి, బంగారుపాళ్యం, కార్వేటినగరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ప్రభుత్వం సొంత భవనాల నిర్మాణం కోసం భూములను కేటాయించి, స్టాంపులు–రిజిస్ట్రేషన్‌ శాఖకు అప్పగించింది. అనుమతులు లభించిన వెంటనే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించనుండగా, ఆధునిక సౌకర్యాలతో భవనాలు సిద్ధమైతే శాఖ పనితీరు మెరుగై ప్రజలకు మంచి సేవలు అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

26, జూన్ 2026

నష్టపరిహారం ఇవ్వాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట వైసీపీ ర్యాలీ
జిల్లా వార్తలు

నష్టపరిహారం ఇవ్వాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట వైసీపీ ర్యాలీ

అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని డా. సాకే శైలజానాథ్ విమర్శించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ర్యాలీ అనంతరం ఆయన, రైతులు అప్పుల బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పంటలకు గిట్టుబాటు ధర, పూర్తి నష్టపరిహారం, సాగునీటి సమస్యల పరిష్కారం, ఆత్మహత్యలు చేసిన రైతు కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం వంటి డిమాండ్లను ప్రభుత్వానికి వినతిపత్రం ద్వారా తెలియజేశారు.

22, జూన్ 2026

హెలికాప్టర్ సంచారం.. తిరుమలలో కలకలం!
భక్తి

హెలికాప్టర్ సంచారం.. తిరుమలలో కలకలం!

తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. స్వామివారి ఆలయంపై నుంచి హెలికాఫ్టర్‌ వెళ్లింది. దీంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ఆలయ పవిత్రత దెబ్బ తింటుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చోద్యం చూస్తుందా? అని మండిపడుతున్నారు.

17, జూన్ 2026

మూడేళ్లలో విద్యుత్‌ ఛార్జీలు పెంపు లేదు: మంత్రి గొట్టిపాటి రవి కుమార్
రాజకీయాలు

మూడేళ్లలో విద్యుత్‌ ఛార్జీలు పెంపు లేదు: మంత్రి గొట్టిపాటి రవి కుమార్

వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు పెంచే ఆలోచన లేదని, గత రెండేళ్లుగా కూడా ధరలు పెంచలేదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన ట్రూ అప్‌ను ట్రూ డౌన్‌గా మార్చి 13 పైసలు తగ్గించామని, పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 6 లక్షల ఉచిత సోలార్‌ కనెక్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

12, జూన్ 2026

కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు : ప్రజలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
రాజకీయాలు

కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు : ప్రజలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ప్రధాని నరేంద్ర మోదీకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం వదిలిన సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, కేంద్ర సహకారం, పవన్ కల్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలకు ప్రజల మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు.

12, జూన్ 2026

విశాఖ ఉక్కు ప్రమాదంపై ప్రభుత్వానికి NHRC నోటీసు
ఆంధ్రప్రదేశ్

విశాఖ ఉక్కు ప్రమాదంపై ప్రభుత్వానికి NHRC నోటీసు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన పేలుడు ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుయో మోటోగా కేసు తీసుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. ప్రమాదానికి కారణాలు, భద్రతా ప్రమాణాల అమలు, బాధితులకు వైద్యసాయం, పరిహారం, భవిష్యత్తులో జాగ్రత్తలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

11, జూన్ 2026

రూ.661 కోట్ల ప్రభుత్వ నిధుల మళ్లింపు కేసులో సీబీఐ సోదాలు
జాతీయం

రూ.661 కోట్ల ప్రభుత్వ నిధుల మళ్లింపు కేసులో సీబీఐ సోదాలు

రూ.661 కోట్ల ప్రభుత్వ నిధుల మళ్లింపు ఆరోపణలపై సీబీఐ చండీగఢ్‌, పంచకుల, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, నోయిడాలోని ఆరు చోట్ల సోదాలు నిర్వహించింది. హరియాణా, చండీగఢ్‌ అధికారులతో పాటు ఐడీఎఫ్‌సీ, ఏయూ ఫైనాన్స్‌ బ్యాంకుల సిబ్బంది కుమ్మక్కై, విపం కన్సల్టెన్సీ ఖాతాల ద్వారా నిధులను దుర్వినియోగం చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో, మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

8, జూన్ 2026

మోదీ ప్రభుత్వంలో ‘సంస్థాగత తిరుగుబాటు’ : రాహుల్ గాంధీ హెచ్చరిక
జాతీయం

మోదీ ప్రభుత్వంలో ‘సంస్థాగత తిరుగుబాటు’ : రాహుల్ గాంధీ హెచ్చరిక

రాహుల్ గాంధీ, మోదీ ప్రభుత్వం లోపల నుంచే సంస్థాగత తిరుగుబాటు మొదలైందని, ఒక సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండరని న్యూ ఢిల్లీ లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో వ్యాఖ్యానించారు. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, “ఎకనామిక్ సునామి ” తాకబోతోందని, ఎలక్షన్ కమిషన్ ,ఇంటలిజెన్స్ ,జ్యూడిషరీ వ్యవస్థల్లో అసంతృప్తి పెరుగుతోందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను BJP ఖండించగా, కాంగ్రెస్ మాత్రం ప్రజాస్వామ్యం, ఆర్థిక పరిస్థితులపై ఆయన ఆందోళనలను కేంద్రం సీరియస్‌గా పరిగణించాలని కోరుతోంది.

4, జూన్ 2026

జూన్ 19న ‘తల్లికి వందనం’ నిధుల జమకు ఏపీ ప్రభుత్వ సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్

జూన్ 19న ‘తల్లికి వందనం’ నిధుల జమకు ఏపీ ప్రభుత్వ సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఈ విద్యా సంవత్సరానికి నిధుల జమ తేదీ జూన్ 12 నుంచి వాయిదా పడింది. దాదాపు 60 లక్షల మందికి పైగా లబ్ధిదారుల అర్హతలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలిస్తున్నందున ఈ ఆలస్యం ఏర్పడింది. తాజా ప్రణాళిక ప్రకారం జూన్ 19న లేదా ఆ తేదీకి సమీపంలో నిధులు జమ చేసే అవకాశముండగా, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యాకే ప్రభుత్వం తేదీని అధికారికంగా ప్రకటించనుంది.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters