బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#తమిళనాడు

90 articles

ఏపీ–తమిళనాడు సరిహద్దులో అక్రమ ఇసుక రవాణాపై పుత్తూరు పోలీసుల దాడి
జిల్లా వార్తలు

ఏపీ–తమిళనాడు సరిహద్దులో అక్రమ ఇసుక రవాణాపై పుత్తూరు పోలీసుల దాడి

చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం కేబీఆర్‌పురం గ్రామ సరిహద్దు వద్ద ఏపీ–తమిళనాడు సరిహద్దులో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు దాడి చేసి, అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్ ఎన్. నాగరాజ్, క్లీనర్ టి. చంద్రను అదుపులోకి తీసుకున్నారు. స్వర్ణముఖి నది నుంచి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్న సమాచారం ఆధారంగా ప్రత్యేక దళంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ, అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు సమాచారం అందించి సహకరించాలని కోరుతున్నారు.

6, ఆగ 2026

త్రిష వ్యాఖ్యలతో ఉదయనిధి అరెస్ట్‌: తమిళనాడులో రాజకీయ కలకలం
తమిళనాడు

త్రిష వ్యాఖ్యలతో ఉదయనిధి అరెస్ట్‌: తమిళనాడులో రాజకీయ కలకలం

తంజావూరులో నిరసన సందర్భంగా నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో భారీ రాజకీయ కలకలానికి దారితీశాయి. ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా, భాజపా సహా పలు పార్టీలు దీనిని స్వాగతించగా డీఎంకే అణచివేత చర్యగా విమర్శించింది. ఉదయనిధి వ్యాఖ్యలను భాజపా, ఎండీఎంకే, పీఎంకే నేతలు తీవ్రంగా ఖండించగా, డీఎంకే మాత్రం ఆయన ప్రసంగంలో అవమానకర అంశాలు లేవని వాదిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించింది.

5, ఆగ 2026

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయాల్లో కలకలం
సినిమా

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయాల్లో కలకలం

కావేరీ నీటి సమస్యపై జరిగిన నిరసన సభలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్, సభలో త్రిష పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. మహిళల పట్ల అవమానకరంగా, అశ్లీలంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తగా, BJP ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనతో తమిళనాడు రాజకీయాల్లో భాష, మహిళల గౌరవం, నాయకుల బాధ్యతపై చర్చ మళ్లీ మొదలైంది.

4, ఆగ 2026

కావేరీ జలాల వివాదం..సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్
తమిళనాడు

కావేరీ జలాల వివాదం..సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్

కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ నీటిలో తమ వాటాను విడుదల చేయడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసింది.

3, ఆగ 2026

లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురి మృతి
తమిళనాడు

లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురి మృతి

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం విషాదాన్ని నింపింది.

2, ఆగ 2026

కావేరీ జలాల వివాదంలో కర్ణాటకకు ఎదురుదెబ్బ: తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల
తమిళనాడు

కావేరీ జలాల వివాదంలో కర్ణాటకకు ఎదురుదెబ్బ: తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల

కావేరీ జలాల వివాదంలో కర్ణాటకకు ఎదురుదెబ్బ తగిలింది. కావేరీ జల నిర్వహణ అథారిటీ, కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ జూలై 29 నుంచి 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటకకు ఆదేశించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కర్ణాటకలో, ముఖ్యంగా మాండ్యలో ఆందోళనలు ఉద్ధృతమవగా, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం కోసం చర్చించాలని నిర్ణయించారు.

31, జులై 2026

తమిళనాడు పరిశ్రమల అభివృద్ధికి కొత్త ఒప్పందాలు
తమిళనాడు

తమిళనాడు పరిశ్రమల అభివృద్ధికి కొత్త ఒప్పందాలు

తమిళనాడు పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహానికి తమిళ్ నాడు గైడెన్స్ సంస్థ స్విట్జర్లాండ్ కు చెందిన ఛుబ్ సంస్థ, జర్మనీ కు చెందిన Nordex, వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ, సౌత్ కొరియా కు చెందిన మోటివేలింక్ సంస్థలతో చెన్నైలో కొత్త MoUలు కుదుర్చుకుంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, R&D కేంద్రాలు, ఉత్పత్తి, ఉన్నత విద్య రంగాల్లో పెట్టుబడులు రావడంతో పరిశ్రమల మౌలిక వసతులు బలోపేతం అవడంతో పాటు సుమారు 2,920 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.

30, జులై 2026

చెన్నై మెట్రోని ముఖ్యమంత్రి విజయ్ పరిశీలించారు
తమిళనాడు

చెన్నై మెట్రోని ముఖ్యమంత్రి విజయ్ పరిశీలించారు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం చెన్నై మెట్రోలో ఒమందూరార్ నుంచి నందనం వరకు సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొనుగోలు చేసి ప్రయాణిస్తూ సేవల పనితీరును పరిశీలించారు. ఆయనను చూసేందుకు మెట్రో స్టేషన్‌లు, రైల్లో అభిమానులు భారీగా గుమిగూడగా, విజయ్ వారిని అభివాదం చేస్తూ ప్రయాణికులతో ఆత్మీయంగా మాట్లాడి, అనంతరం మెట్రో కంట్రోల్ రూమ్‌లో నిర్వహణ వ్యవస్థను పరిశీలించారు.

30, జులై 2026

తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ ప్రతిపాదన
తమిళనాడు

తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ ప్రతిపాదన

తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల మిడ్‌డే మీల్‌లో వారానికి ఒక రోజు చికెన్ బిర్యానీ చేర్చే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. విద్యార్థుల హాజరు, చేరికలు పెరగడంతో పాటు ప్రోటీన్, పోషకాహారం అందించడమే లక్ష్యంగా ఈ ఆలోచనను అధ్యయనం చేస్తుండగా, వ్యయభారం, అమలు విధానం, సరఫరా వ్యవస్థలపై సమగ్ర పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

29, జులై 2026

డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు :  విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్..
తమిళనాడు

డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు : విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్..

డబ్బులు వస్తాయంటే చాలు ఏ మాత్రం ఆలోచించకుండా నమ్మేసే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు మహిళలను దారుణంగా మోసం చేశాడు. ‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజ స్వామీజీ వేషంలో వచ్చి మహిళలకు గుండు గీయించే సన్నివేశాన్ని తలపించేలా ఈ ఘటన జరిగింది.

29, జులై 2026

ఇంటి నిర్మాణ సామాగ్రి సరఫరా బంద్‌! : విజయ్ సర్కార్ ఆంక్షలు.. ఏపీ సహా మూడు రాష్ట్రాలకు..
బిజినెస్

ఇంటి నిర్మాణ సామాగ్రి సరఫరా బంద్‌! : విజయ్ సర్కార్ ఆంక్షలు.. ఏపీ సహా మూడు రాష్ట్రాలకు..

తమిళనాడులో టీవీకే విజయ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగానికి కీలకమైన రఫ్ స్టోన్, ఎం-శాండ్, మెటల్ జెల్లీ వంటి నిర్మాణ సామగ్రిని పొరుగు రాష్ట్రాలకు తరలించడంపై తమిళనాడు ప్రభుత్వం మూడు నెలలు తాత్కాలిక నిషేధం విధించింది.

29, జులై 2026

చెన్నై కొయంబేడు మూడో దశ శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్
తమిళనాడు

చెన్నై కొయంబేడు మూడో దశ శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి తీరు . S. జోసెఫ్ విజయ్ చెన్నై కొయంబేడు మూడో దశ నీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించి, నెగటివ్ ప్రెషర్ మెంబ్రేన్ ఫిల్టరేషన్ మెథడ్ ద్వారా నీటి శుద్ధి విధానాలు, యంత్రాంగం పనితీరు, నీటి నాణ్యత ప్రమాణాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. రోజుకు 45 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో పనిచేస్తున్న ఈ కేంద్రం ద్వారా చెన్నై నగరానికి నాణ్యమైన తాగునీటి సరఫరా, శుద్ధి సామర్థ్య విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

28, జులై 2026

తమిళనాడులో సంచలనం.. : ఉద్యోగాల దందా.. టివికె  నేతల ఆడియో లీక్‌!
తమిళనాడు

తమిళనాడులో సంచలనం.. : ఉద్యోగాల దందా.. టివికె నేతల ఆడియో లీక్‌!

తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. పార్టీ నేతల ఆడియో లీక్ అవ్వడం ఇప్పుడు సీఎం విజయ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

28, జులై 2026

అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్లిన యువకుడి మోక్ష మార్గంలో మృతి
తమిళనాడు

అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్లిన యువకుడి మోక్ష మార్గంలో మృతి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మణికుమార్ (36) అరుణాచలేశ్వర దర్శనం అనంతరం తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేస్తూ మోక్ష మార్గంలో ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెందాడు. భక్తులు ప్రయత్నించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించినా, వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు, భక్తుల్లో తీవ్ర విషాదం, దిగ్భ్రాంతి నెలకొంది.

26, జులై 2026

విజయ్ చివరి చిత్రం ‘జన నాయకుడు’రివ్యూ
సినిమా రివ్యూలు

విజయ్ చివరి చిత్రం ‘జన నాయకుడు’రివ్యూ

దళపతి విజయ్ చివరి చిత్రంగా వచ్చిన ‘జన నాయకుడు’ తెలుగు ప్రేక్షకులకు మిశ్రమ అనుభూతి ఇచ్చినట్లు సమీక్షల్లో కనిపిస్తోంది. ‘భగవంత్ కేసరి’ రీమేక్‌గా వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ వన్ మాన్ షోగా మెప్పించినా, బలవంతపు భావోద్వేగాలు, అధిక యాక్షన్, బలహీనమైన సంగీతం, మూడు గంటలకు పైగా రన్‌టైమ్ వల్ల సినిమా మొత్తం ప్రభావం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

23, జులై 2026

దేశవ్యాప్తంగా NEET రద్దు చేయాలి: వైద్య విద్యపై రాష్ట్రాలకే పూర్తి అధికారం కోరుతున్న TVK
తమిళనాడు

దేశవ్యాప్తంగా NEET రద్దు చేయాలి: వైద్య విద్యపై రాష్ట్రాలకే పూర్తి అధికారం కోరుతున్న TVK

తమిళనాడు ముఖ్యమంత్రి ‘దళపతి’ విజయ్ నాయకత్వంలోని TVK పార్టీ, NEETలో జరుగుతున్న అక్రమాలు, పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరీక్షను దేశవ్యాప్తంగా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసింది. వైద్య విద్యతో సహా మొత్తం విద్యా రంగంపై రాష్ట్రాలకే పూర్తి అధికారాలు ఉండాలని, ఇందుకోసం విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు మార్చాలని లేదా ప్రత్యేక ఉమ్మడి జాబితా ద్వారా రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని TVK కోరుతోంది.

22, జులై 2026

జాతీయ చలన చిత్ర పురస్కారాలపై తమిళనాడులో చర్చ.. ‘రాయన్‌’ ఎంపికపై కోలీవుడ్‌లో అసంతృప్తి
సినిమా

జాతీయ చలన చిత్ర పురస్కారాలపై తమిళనాడులో చర్చ.. ‘రాయన్‌’ ఎంపికపై కోలీవుడ్‌లో అసంతృప్తి

జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రం (తమిళం) విభాగానికి ‘రాయన్‌’ ఎంపిక కోలీవుడ్ లో తీవ్ర చర్చకు దారితీసింది. ‘తంగళాం’ వంటి ప్రశంసలు పొందిన చిత్రాలను విస్మరించి సగటు యాక్షన్‌ సినిమాకు అవార్డు ఎలా ఇస్తారు అంటూ సినీ వర్గాలు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల అవార్డుల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

21, జులై 2026

డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్‌ అరెస్ట్..
తమిళనాడు

డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్‌ అరెస్ట్..

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ద్రవిడ మున్నేట్ర కళగం (DMK) ఎమ్మెల్యే మార్కండేయన్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

20, జులై 2026

తమిళనాడు దినోత్సవం: నంబర్‌ వన్‌గా నిలబెట్టేందుకు సీఎం విజయ్‌ సంకల్పం
తమిళనాడు

తమిళనాడు దినోత్సవం: నంబర్‌ వన్‌గా నిలబెట్టేందుకు సీఎం విజయ్‌ సంకల్పం

తమిళనాడు దినోత్సవం సందర్భంగా సీఎం విజయ్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, తమిళనాడును భారతదేశంలో అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మద్రాసు రాష్ట్రం ఏర్పడిన నవంబర్‌ 1, రాష్ట్రానికి తమిళనాడు అనే పేరు పెట్టిన జూలై 18 తేదీలను అధికారికంగా జరుపుకుంటామని తెలిపారు. మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ కూడా లండన్‌ నుంచి శుభాకాంక్షలు పంపించారు.

19, జులై 2026

తమిళనాడులో రంగురంగుల పాపడాల విక్రయాలపై నిషేధం
తమిళనాడు

తమిళనాడులో రంగురంగుల పాపడాల విక్రయాలపై నిషేధం

తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో విక్రయమవుతున్న రంగురంగుల పాపడాలపై నిషేధం విధించింది. ఆహార భద్రత విభాగం నిర్వహించిన తనిఖీల్లో పాపడాలలో పారిశ్రామిక రంగుల్లో వాడే రోడమైన్-బి వంటి ప్రమాదకర కృత్రిమ రసాయన రంగులు ఉన్నట్లు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కృత్రిమ రంగులు కలిపిన తినుబండారాల వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

18, జులై 2026

పునర్విభజనపై ఒంటరిగా ముందుకు! : పార్టీ ఎంపీలతో డీఎంకే అధినేత అత్యవసర సమావేశం
తమిళనాడు

పునర్విభజనపై ఒంటరిగా ముందుకు! : పార్టీ ఎంపీలతో డీఎంకే అధినేత అత్యవసర సమావేశం

దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై డీఎంకే పార్టీ కీలకమైన, స్వతంత్ర నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్‌తో ఎలాంటి ముందస్తు సంప్రదింపులు జరపకుండానే, సొంతంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది.

17, జులై 2026

ఆ మాటలు నన్ను చాలా బాధించాయి-కిరణ్ అబ్బవరం
సినిమా

ఆ మాటలు నన్ను చాలా బాధించాయి-కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తమిళనాడులో తెలుగు సినిమాల ప్రదర్శన, అక్కడి మార్కెట్ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. చెన్నై సహా తమిళనాడులో తెలుగు చిత్రాలకు ప్రత్యేక షోలు, డబ్బింగ్ వెర్షన్లు, సబ్‌టైటిల్స్ పెరుగుతుండగా, మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అక్కడి యువత కూడా స్వాగతిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో తమిళనాడును కీలక మార్కెట్‌గా భావించే తెలుగు చిత్ర నిర్మాతలు, హీరోల సంఖ్య పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

17, జులై 2026

9వ తరగతిలో మూడో భాష పెట్టొద్దు: సుప్రీంకోర్టు
జాతీయం

9వ తరగతిలో మూడో భాష పెట్టొద్దు: సుప్రీంకోర్టు

సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై విచారణలో సుప్రీంకోర్టు తొమ్మిదో తరగతిలో మూడో భాష ప్రవేశపెట్టడం విద్యార్థులకు అదనపు భారమని సూచించింది. కొత్త భాషను నేర్పాలనుకుంటే ఐదో లేదా ఆరో తరగతి నుంచే ప్రారంభించాలని, విద్యార్థుల మానసిక ఒత్తిడి, విద్యా భారం అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

16, జులై 2026

అవినీతి, అక్రమాలకు తావులేదు: కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్‌ కఠిన హెచ్చరిక
తమిళనాడు

అవినీతి, అక్రమాలకు తావులేదు: కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్‌ కఠిన హెచ్చరిక

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కేబినెట్‌ సమావేశంలో అవినీతి, అక్రమాలకు రాష్ట్ర పరిపాలనలో ఎలాంటి చోటు ఉండదని స్పష్టం చేస్తూ, ఆరోపణలు రుజువైతే మంత్రి పదవి వెంటనే రద్దు చేస్తామని హెచ్చరించారు. మంత్రులు కార్యాలయాలు, విద్యాసంస్థలకు నేరుగా తనిఖీలకు వెళ్లొద్దని ఆదేశిస్తూ, పారదర్శక పాలన, ప్రజల విశ్వాస పరిరక్షణ, బాధ్యతాయుత సేవలే ప్రభుత్వ లక్ష్యమని ఆయన దిశానిర్దేశం చేశారు.

16, జులై 2026

కూడంకుళం అణు ప్లాంట్‌కు ఢోకా లేదు! :   ప్రకటించిన న్యూక్లియర్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌
జాతీయం

కూడంకుళం అణు ప్లాంట్‌కు ఢోకా లేదు! : ప్రకటించిన న్యూక్లియర్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌

దేశంలోని అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్ర ప్రాజెక్ట్‌ అయిన తమిళనాడులోని కూడంకుళం ప్లాంట్‌ లో డేటా లీకేజీ జరిగినట్లు వచ్చిన వార్తలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (NPCIL) స్పందించింది.

16, జులై 2026

ప్రేమ మోజులో భర్త హత్య.. సీసీటీవీతో బయటపడిన భార్య కుట్ర!
జిల్లా వార్తలు

ప్రేమ మోజులో భర్త హత్య.. సీసీటీవీతో బయటపడిన భార్య కుట్ర!

చిత్తూరు జిల్లా మల్లప్పకొండ సమీపంలో ఆలయ దర్శనానికి వెళ్లిన రమేష్ హత్యకు గురైన కేసు స్థానికులను కలవరపెడుతోంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా భార్య హాసిని, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి కలిసి వివాహేతర సంబంధం నేపథ్యంగా హత్య ప్రణాళిక చేసి అమలు చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకుని, ఆయుధం, ఘటన సమయం, స్థలంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

16, జులై 2026

కుడంకుళం అణు కేంద్రం డేటా లీక్?..   డార్క్ వెబ్‌లో బ్లూప్రింట్
జాతీయం

కుడంకుళం అణు కేంద్రం డేటా లీక్?.. డార్క్ వెబ్‌లో బ్లూప్రింట్

భారతదేశంలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన తమిళనాడులోని కుడంకుళం ప్లాంట్ బ్లూఫ్రింట్స్ డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది. రాన్సమ్‌వేర్ గ్రూప్ ‘ వరల్డ్ లీక్స్’ ఈ ఫైళ్లను డార్క్ వెబ్‌లో పోస్ట్ చేసినట్లు రాయిటర్స్ నివేదించింది.

15, జులై 2026

గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు స్టే
తమిళనాడు

గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు స్టే

తమిళనాడులో బక్రీద్ సందర్భంగా గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్ర చట్టాలు అనుమతించిన వధను పూర్తిగా నిషేధించడం చట్టబద్ధం కాదని తమిళనాడు ప్రభుత్వం వాదించగా, హైకోర్టు ఆదేశాలు ప్రస్తుత చట్టాలకు విరుద్ధమా అనే అంశంపై సుప్రీంకోర్టు ప్రాథమికంగా పరిశీలించి, ఆ ఉత్తర్వులను సవరించాల్సిన అవసరం ఉందని సూచించింది.

13, జులై 2026

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
తమిళనాడు

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మధురై - తిరుచ్చి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఓమ్ని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

13, జులై 2026

అక్రమ చేపల వేటపై ఏపీ–తమిళనాడు అంతర్‌రాష్ట్ర సమావేశం
ఆంధ్రప్రదేశ్

అక్రమ చేపల వేటపై ఏపీ–తమిళనాడు అంతర్‌రాష్ట్ర సమావేశం

ఆంధ్రప్రదేశ్–తమిళనాడు అంతర్‌రాష్ట్ర కమిటీ సమావేశంలో అక్రమ చేపల వేట, ఇతర రాష్ట్రాల బోట్లు ఏపీ తీరానికి 23 కిలోమీటర్ల పరిధిలోకి ప్రవేశించడం వంటి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అక్రమంగా ప్రవేశించిన తమిళనాడు, పుదుచ్చేరి బోట్లను విడుదల చేసే ప్రసక్తే లేదని, సాంకేతిక ఆధారాలతో సమస్య తీవ్రతను తమిళనాడు ప్రతినిధులకు వివరించామని, మత్స్యకారుల జీవనోపాధి, సముద్ర జీవవైవిధ్య రక్షణకు కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

12, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters