బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నిర్మాణానికి

33 articles

అనంతపురం జిల్లాలో ట్రాన్సజెండర్ల కుటుంబాల కోసం ఇళ్ల స్థలాల పరిశీలన
జిల్లా వార్తలు

అనంతపురం జిల్లాలో ట్రాన్సజెండర్ల కుటుంబాల కోసం ఇళ్ల స్థలాల పరిశీలన

అనంతపురం జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో అమలవుతున్న ‘చేతన’ కార్యక్రమం భాగంగా ట్రాన్స్జెండర్లు, షికారీ కుటుంబాలకు స్థిర నివాసాల కల్పన కోసం ఉప్పరపల్లి శివార్లలో ప్రభుత్వ భూములను జిల్లా ఎస్పీ పి. జగదీష్ పరిశీలించారు. అనుకూలమైన భూములను గుర్తించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాల పట్టాలు, మౌలిక వసతులు త్వరితగతిన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

5, ఆగ 2026

చిన్నమండెంలో రూ.50 లక్షల వ్యయంతో పశువైద్య ఆసుపత్రి భవనానికి భూమిపూజ
జిల్లా వార్తలు

చిన్నమండెంలో రూ.50 లక్షల వ్యయంతో పశువైద్య ఆసుపత్రి భవనానికి భూమిపూజ

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండల కేంద్రంలో పశుపాలకులకు మెరుగైన సేవలు అందించేందుకు రూ.50 లక్షల వ్యయంతో నూతన పశువైద్య ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలను చేరువ చేయడంతో పాటు పశుపోషణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశముందని అధికారులు తెలిపారు.

3, ఆగ 2026

కర్నూలు కేసీ కెనాల్ వద్ద సుద్దవాగు రక్షణ గోడకు శంకుస్థాపన
జిల్లా వార్తలు

కర్నూలు కేసీ కెనాల్ వద్ద సుద్దవాగు రక్షణ గోడకు శంకుస్థాపన

కర్నూలు కేసీ కెనాల్ సమీపంలోని సుద్దవాగు వద్ద వరద సమస్యలకు శాశ్వత పరిష్కారంగా రూ.2.50 కోట్ల వ్యయంతో 250 మీటర్ల రక్షణ గోడ నిర్మాణానికి మంత్రి టీ.జీ. భరత్ శంకుస్థాపన చేశారు. దోమల లార్వా నిర్మూలన కోసం బీటీఐ జీవ లార్విసైడ్ పిచికారీని పరిశీలించిన మంత్రి, నగరంలోని పాత సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కర్నూలు అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, నారా లోకేష్ కీలకంగా కృషి చేస్తున్నారని తెలిపారు.

30, జులై 2026

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ :  కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జాతీయం

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

24, జులై 2026

అందెశ్రీ నాకు ఆత్మబంధువు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
తెలంగాణ

అందెశ్రీ నాకు ఆత్మబంధువు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘట్‌కేసర్‌లో తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ జయంతి సందర్భంగా స్మృతి వన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, భూమి పూజ నిర్వహించారు. అందెశ్రీ తనకు ఆత్మబంధువుగా మారారని, తన రాజకీయ ప్రయాణానికి ఆయన గానం, స్ఫూర్తి పెద్ద ఆధారమని ముఖ్యమంత్రి భావోద్వేగంగా గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు, గొంతులు అర్పించిన తొమ్మిది కుటుంబాలకు ఒక్కొక్కటికి కోటి రూపాయలు అందజేసిన విషయాన్ని, “జయ జయహే తెలంగాణ” గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన సందర్భాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

19, జులై 2026

16 నుంచి జగన్నాథ రథయాత్ర.. ఏర్పాట్లు పూర్తి
జాతీయం

16 నుంచి జగన్నాథ రథయాత్ర.. ఏర్పాట్లు పూర్తి

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో  అత్యంత వైభవంగా జరిగే జగన్నాథ రథయాత్రకు  సన్నాహాలు పూర్తయ్యాయి. జూలై 16, గురువారం నుంచి జూలై 24, శుక్రవారం వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

15, జులై 2026

హైదరాబాద్‌–అమరావతి–బందరు పోర్టు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌–అమరావతి–బందరు పోర్టు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రతిపాదన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీలో నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యి హైదరాబాద్‌–అమరావతి–బందరు పోర్టు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు అనుమతులు కోరారు, దీతో హైదరాబాద్‌–విజయవాడ దూరం సుమారు 100 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. అలాగే Regional Ring Road, మన్ననూరు–శ్రీశైలం Elevated Corridor, హైదరాబాద్‌–మంచిర్యాల ఆరు లేన్ల జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర సహాయం, అనుమతులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

15, జులై 2026

అభివృద్ధిలో రాజకీయం వద్దు.. కేంద్రంతో చర్చలతోనే సమస్యల పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

అభివృద్ధిలో రాజకీయం వద్దు.. కేంద్రంతో చర్చలతోనే సమస్యల పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని, ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయం, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. వరంగల్ మమూనూరు, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని, 2034 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడంలో ప్రాంతీయ ఎయిర్ పోర్టుల అభివృద్ధి కీలకమని ఆయన పేర్కొన్నారు.

14, జులై 2026

అమరావతిలో భూసేకరణకు రైతుల స్పందన పెరుగుతోంది
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో భూసేకరణకు రైతుల స్పందన పెరుగుతోంది

అమరావతి రాజధాని ప్రాంతంలో APCRDA మళ్లీ చురుకుగా భూసేకరణ ప్రారంభించడంతో ల్యాండ్ పూలింగ్ పథకం కింద భూములిచ్చే రైతుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మందడం, వెంకటపాలెం గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండగా, ఒకేరోజులో 32.25 ఎకరాలు సమీకరించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రాజధాని పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల ప్రణాళికలతో పాటు పథకం ప్రయోజనాలు, భవిష్యత్ అవకాశాలు రైతుల నిర్ణయంపై ప్రభావం చూపుతున్నాయని స్థానిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

14, జులై 2026

కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పర్యటన
జిల్లా వార్తలు

కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పర్యటన

వైఎస్ఆర్ కడప జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి వేగం పెరుగుతోందనిటీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి తెలిపారు. జూలై 14-15 తేదీల్లో మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పర్యటనలో భాగంగా దాల్మియా సిమెంట్ రెండవ ప్లాంట్ శంఖస్థాపన,టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. రూ. 3100 కోట్ల పెట్టుబడితో వచ్చే ఈ ప్లాంట్, అన్సెల్లరీ పరిశ్రమలతో కలిసి జిల్లాలో ఉపాధి అవకాశాలను ఆయన పేర్కొన్నారు.

14, జులై 2026

తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
జిల్లా వార్తలు

తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

తిరుమలలో మంగళవారం టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశంలో 62 అజెండా అంశాలపై చర్చించనున్నారు. ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం, కాంట్రాక్ట్ కార్మికుల జీతాల చెల్లింపు విధానంలో పారదర్శకత, ఆలయ పరిపాలన, భక్తుల సౌకర్యాలు, ఉద్యోగుల సంక్షేమంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

14, జులై 2026

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు..   రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
వ్యవసాయం

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!

గోదావరి డెల్టాకు జీవనాడిగా నిలిచిన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిరంతర వినియోగంలో ఉన్న ఈ కీలక జలవనరుల నిర్మాణానికి సమగ్ర మరమ్మత్తులు, ఆధునీకరణ పనులు చేపట్టేందుకు రూ.152.95 కోట్ల అనుమతులు మంజూరు చేశారు.

13, జులై 2026

అమరావతి–గన్నవరం అనుసంధానానికి ₹37.7 కోట్ల ప్రాజెక్టుకు ప్రభుత్వ హరితసిగ్నల్
ఆంధ్రప్రదేశ్

అమరావతి–గన్నవరం అనుసంధానానికి ₹37.7 కోట్ల ప్రాజెక్టుకు ప్రభుత్వ హరితసిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి–గన్నవరం అనుసంధానానికి ₹37.7 కోట్లతో కొత్త షార్ట్‌కట్ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. B.B.గూడెం నుంచి కోనయ్య చెరువు వైపు మార్గం మళ్లించి దూరాన్ని 8.8 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్లకు తగ్గించనున్నారు. శాశ్వత అమరావతి విమానాశ్రయం సిద్ధం అయ్యే వరకు గన్నవరం విమానాశ్రయాన్ని ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తూ, కొత్త టెర్మినల్‌ను దసరా నాటికి ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

11, జులై 2026

బీసీల సంక్షేమానికి రూ.51 వేల కోట్ల కేటాయింపులు  : మంత్రి సవిత
రాజకీయాలు

బీసీల సంక్షేమానికి రూ.51 వేల కోట్ల కేటాయింపులు : మంత్రి సవిత

బీసీ సంక్షేమానికి తొలి మూడు బడ్జెట్లలో వరుసగా రూ.39 వేల కోట్లు, రూ.47 వేల కోట్లు, రూ.51 వేల కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించిందని మంత్రి సవిత తెలిపారు. మూడో బడ్జెట్‌లో బీసీల సంక్షేమం కోసం రికార్డు స్థాయిలో రూ.51 వేల కోట్లు కేటాయించామన్నారు.

6, జులై 2026

కుప్పంలో ఆధునిక బస్ స్టేషన్–డిపోకు శంకుస్థాపన
జిల్లా వార్తలు

కుప్పంలో ఆధునిక బస్ స్టేషన్–డిపోకు శంకుస్థాపన

చిత్తూరు జిల్లా కుప్పంలో ఆధునిక బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని, కొత్త ప్రాజెక్టుతో కుప్పం పట్టణం, పరిసర గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, వ్యాపార అభివృద్ధి కలుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.

4, జులై 2026

క్రెడిట్‌ మొత్తం వైఎస్‌ జగన్‌ది.. క్రెడిట్‌చోరీ చంద్రబాబుది
రాజకీయాలు

క్రెడిట్‌ మొత్తం వైఎస్‌ జగన్‌ది.. క్రెడిట్‌చోరీ చంద్రబాబుది

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రాజెక్టు విషయంలో అన్నీ కూడా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి గుర్తు చేశారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్‌ చోరీకి ప్రయత్నిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

4, జులై 2026

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు! : రూ.14,115 కోట్లతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం
రాజకీయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు! : రూ.14,115 కోట్లతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం

ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయాలని సంకల్పించింది.

1, జులై 2026

ఖైరతాబాద్‌ మహా గణపతి ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభం
తెలంగాణ

ఖైరతాబాద్‌ మహా గణపతి ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభం

హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ మహా గణపతి ఉత్సవ ఏర్పాట్లు సంప్రదాయ కర్రపూజతో ప్రారంభమయ్యాయి. ఈసారి విగ్రహాన్ని పంచముఖ సంకటహర మహా గణపతి రూపంలో ఆవిష్కరించేందుకు కమిటీ సిద్ధమవుతోంది. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో రవాణా, భద్రత, శానిటేషన్‌తో పాటు రక్తదాన, ఆరోగ్య శిబిరాల వంటి సేవా కార్యక్రమాల ప్రణాళికలు కూడా కమిటీ రూపొందిస్తోంది.

26, జూన్ 2026

అమరావతిలో వేగంగా అభివృద్ధి అడుగులు : జోన్-11లో రూ.426 కోట్ల పనులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో వేగంగా అభివృద్ధి అడుగులు : జోన్-11లో రూ.426 కోట్ల పనులకు ఆమోదం

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఉండవల్లి జోన్-11 పరిధిలో ట్రంక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

25, జూన్ 2026

‘సీమలో’ ఉద్యాన హబ్‌ : రాయలసీమకు  కోట్ల పెట్టుబడి
జిల్లా వార్తలు

‘సీమలో’ ఉద్యాన హబ్‌ : రాయలసీమకు కోట్ల పెట్టుబడి

రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో భారీ ఉద్యాన హబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జొన్నగిరిలో బంగారం కర్మాగారాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, త్వరలో ఈ హబ్‌కు శంకుస్థాపన చేసి, ప్రాసెసింగ్‌ నుంచి ఎగుమతుల వరకు సమగ్ర సదుపాయాలు కల్పించి రైతుల ఆదాయం, ఉపాధి పెంపు లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.

25, జూన్ 2026

శ్రీశైలం ఘాట్‌ రోడ్డుకు ఎలివేటెడ్‌ కారిడార్‌
జిల్లా వార్తలు

శ్రీశైలం ఘాట్‌ రోడ్డుకు ఎలివేటెడ్‌ కారిడార్‌

శ్రీశైలం నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆత్మకూరు–దోర్నాల మధ్య 42 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. వన్యప్రాణుల సంరక్షణకు భంగం కలగకుండా, ముఖ్యంగా నాగార్జునసాగర్‌ శ్రీశైలం, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ల జీవవైవిధ్యాన్ని కాపాడేలా రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ కారిడార్‌ పూర్తైతే ట్రాఫిక్‌ అంతరాయం తగ్గి, రాత్రివేళల ప్రయాణ ఆంక్షలు సడలే అవకాశముందని భావిస్తున్నారు.

24, జూన్ 2026

జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం బాబు
జిల్లా వార్తలు

జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం బాబు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు.

24, జూన్ 2026

జులై 3న కడప ఉక్కు కర్మాగారానికి పునాది రాయి
జిల్లా వార్తలు

జులై 3న కడప ఉక్కు కర్మాగారానికి పునాది రాయి

కడప ఉక్కు కర్మాగారానికి జులై 3న జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్దదండలూరు పరిసరాల్లో పునాది రాయి వేయనున్నారు. రూ.16,350 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేసే ఈ మెగా స్టీల్ ప్లాంట్‌కు గండికోట జలాశయం నుంచి నీటి సరఫరా, 1,100 ఎకరాల భూబదిలీ పూర్తి కాగా, 3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో వేలాది మందికి ఉపాధి కలిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

24, జూన్ 2026

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకం : తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
తమిళనాడు

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకం : తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసిన మేకెదాటు ప్రాజెక్ట్‌పై తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం జరిగింది. మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

19, జూన్ 2026

రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్

రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్ద నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ శంకుస్థాపన చేశారు. రూ.142 కోట్ల వ్యయంతో, 767.50 మీటర్ల పొడవు, నాలుగు లైన్ల రహదారితో నిర్మించనున్న ఈ ఆర్వోబీ పూర్తయ్యాక మంగళగిరి, నిడమర్రు, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం అవడంతో పాటు ప్రయాణ సమయం, అత్యవసర సేవల చేరిక గణనీయంగా మెరుగుపడనుంది.

17, జూన్ 2026

ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
జాతీయం

ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా అమరావతి రాజధాని అభివృద్ధికి కట్టుబడి ఉంద కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అమరావతికి రూ.15 వేల కోట్లు, హడ్కో ద్వారా రూ.11 వేల కోట్ల సహాయం, ప్రత్యేక రైల్వే లైన్‌కు నిధులు కేటాయించామని, దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందని, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు.

16, జూన్ 2026

జాతీయ రహదారి పనుల్లో నాసిరకం .. సర్వీసు రోడ్లపై పగుళ్లు
జిల్లా వార్తలు

జాతీయ రహదారి పనుల్లో నాసిరకం .. సర్వీసు రోడ్లపై పగుళ్లు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.1178 కోట్ల వ్యయంతో నిర్మించిన 340సీ జాతీయ రహదారి, సర్వీసు రోడ్లలో నాసిరకం నాణ్యత బయటపడుతోంది. రుద్రవరం నుంచి ఆత్మకూరు వరకు పైవంతెనల వద్ద భూమి కుంగిపోవడం, సర్వీసు రోడ్లు, రైన్‌ గల్లీలు, కాల్వల్లో పగుళ్లు, గ్యాపులు ఏర్పడి వర్షం నీరు సరిగా పారక రహదారి అంచులు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, గుత్తేదారులపై చర్యలు, శాశ్వత మరమ్మతులు కోరుతున్నారు.

13, జూన్ 2026

కావేరి మేకెదాటు ప్రాజెక్ట్‌కు అనుమతులివ్వండి
కర్ణాటక

కావేరి మేకెదాటు ప్రాజెక్ట్‌కు అనుమతులివ్వండి

కావేరి నదిపై ప్రతిపాదిత మేకెదాటు ప్రాజెక్ట్‌కు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బెంగళూరు తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తికి ఈ ప్రాజెక్ట్ కీలకమని, తమిళనాడుకు కేటాయించిన నీటి వాటాకు భంగం కలగదని కర్ణాటక వాదిస్తుండగా, కావేరి జల వివాద ట్రైబ్యునల్ తీర్పుకు విరుద్ధమని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

12, జూన్ 2026

అమరావతి అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్

అమరావతి అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ రెండు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సుమారు 5.35 ఎకరాల్లో రూ.1,299 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్, 17 ఎకరాల్లో రూ.1,235 కోట్లతో కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయం నిర్మించనున్నారు. ఈ నిర్ణయాలు అమరావతి మౌలిక సదుపాయాల బలోపేతం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెరుగుదలకు దోహదం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

10, జూన్ 2026

గల్ఫ్‌ మిత్ర దేశాల పునర్నిర్మాణానికి ఇరాన్‌ ఆస్తులపై అమెరికా దృష్టి
అంతర్జాతీయం

గల్ఫ్‌ మిత్ర దేశాల పునర్నిర్మాణానికి ఇరాన్‌ ఆస్తులపై అమెరికా దృష్టి

గల్ఫ్‌ యుద్ధంలో నష్టపోయిన మిత్ర దేశాల పునర్నిర్మాణానికి ఇరాన్‌ ఆస్తులను వినియోగించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు సూచిస్తున్నాయి. ఇందుకోసం గల్ఫ్‌ దేశాల నష్టాన్ని అంచనా వేయాలని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ ప్రత్యేక బృందాన్ని నియమించగా, ఇరాన్‌ స్తంభింపజేసిన నిధుల విడుదలపై తన డిమాండ్‌ కొనసాగిస్తుండటంతో ఈ ఆస్తుల వినియోగంపై నిర్ణయం ప్రాంతీయ శాంతి ప్రక్రియ, అమెరికా–ఇరాన్‌ సంబంధాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters