బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పరిష్కార

61 articles

ప్రతి సోమవారం ‘ప్రొద్దుటూరు కమిషనర్‌తో ముఖాముఖి’ ఫోన్ ఇన్
జిల్లా వార్తలు

ప్రతి సోమవారం ‘ప్రొద్దుటూరు కమిషనర్‌తో ముఖాముఖి’ ఫోన్ ఇన్

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పట్టణ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు “ప్రజలతో కమిషనర్‌తో ముఖాముఖి” ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని 10.08.2026 నుంచి ప్రారంభిస్తోంది. 9247563385, 9849905863 నంబర్లకు కాల్ చేసి దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, దూరాభార ప్రాంతాల ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని, ఇవి అదే రోజు సంబంధిత శాఖలకు పంపి కమిషనర్ స్వయంగా పురోగతిని పర్యవేక్షించనున్నారని అధికారులు తెలిపారు.

9, ఆగ 2026

తాడిపత్రిలో జెసి అష్మిత్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం
జిల్లా వార్తలు

తాడిపత్రిలో జెసి అష్మిత్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం

తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి సంజీవ్ నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా దర్బార్‌ల ద్వారా ప్రజా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపుతో పాటు నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

9, ఆగ 2026

22వ వార్డు సమస్యలపై బేపారి ఆరిఫ్ ఉద్యమం
జిల్లా వార్తలు

22వ వార్డు సమస్యలపై బేపారి ఆరిఫ్ ఉద్యమం

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 22వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి బేపారి ఆరిఫ్ చేపట్టిన "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. రహదారులు, కాలువలు, దోమల బెడద, పిచ్చికుక్కల దాడులు, స్ట్రీట్ లైట్లు, తాగునీటి సరఫరా వంటి సమస్యలను గుర్తించి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చల్లా శ్రీనివాస విక్రమ్‌లకు వినతిపత్రాలు అందజేశారు. సమస్యల పరిష్కారం వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆరిఫ్ స్పష్టం చేశారు.

8, ఆగ 2026

సినిమా టికెట్‌ ధరలు, రెవెన్యూ పంపిణీపై కొత్త కమిటీ ఏర్పాటు చేసిన తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌
సినిమా

సినిమా టికెట్‌ ధరలు, రెవెన్యూ పంపిణీపై కొత్త కమిటీ ఏర్పాటు చేసిన తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సినిమా టికెట్ ధరలు, థియేటర్లలో రెవెన్యూ పంపిణీ శాతం విధానంపై సమగ్ర అధ్యయనం చేసి సిఫార్సులు ఇవ్వడానికి పాత కమిటీని రద్దు చేసి, నిర్మాత కె.ఎల్. నారాయణ అధ్యక్షత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను సేకరించి దీర్ఘకాలిక పరిష్కార మార్గదర్శకాలు రూపొందించే బాధ్యత ఈ కమిటీదే కాగా, నివేదిక సమర్పణకు గడువు విధించలేదని సమాచారం.

5, ఆగ 2026

ముద్దనూరు–కడప రహదారి నాలుగు లైన్ల అభివృద్ధికి ప్రయత్నాలు
జిల్లా వార్తలు

ముద్దనూరు–కడప రహదారి నాలుగు లైన్ల అభివృద్ధికి ప్రయత్నాలు

ముద్దనూరు–కడప రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడం, కడప నగరంలోని ఇర్కాన్‌ సర్కిల్‌–జేఎంజే సర్కిల్‌, ఇర్కాన్‌–ఐటీఐ సర్కిల్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ సమస్యలు, పాదచారుల భద్రత, పార్కింగ్‌ సౌకర్యాల మెరుగుదల కోసం వైయస్‌ అవినాష్‌ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ప్రతిపాదనలు సమర్పించారు. పై మూడు అంశాలపై గడ్కరీ సానుకూలంగా స్పందించి త్వరలో చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వర్గాలు తెలిపాయి.

5, ఆగ 2026

స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్
జిల్లా వార్తలు

స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్

అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని పడమటి కోన గ్రామం బోరెడ్డిగారి పల్లెలో తన స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి, రహదారులు, తాగునీరు, విద్యుత్, సంక్షేమ పథకాల అమలు వంటి సమస్యలపై ప్రజల వినతులు స్వీకరించారు. ప్రతి వినతిని ఓర్పుగా విని సంబంధిత అధికారులను అక్కడికక్కడే ఆదేశిస్తూ, ప్రజల సమస్యలకు త్వరిత పరిష్కారం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

2, ఆగ 2026

తనపై, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు..: ప్రధాని మోడీ
జాతీయం

తనపై, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు..: ప్రధాని మోడీ

తనపై, తన దివంగత తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. “తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు” అని అన్నారు.

1, ఆగ 2026

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మిగనూరులో APWJF నిరసన
జిల్లా వార్తలు

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మిగనూరులో APWJF నిరసన

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ APWJF ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన జరిగింది. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, పక్కా గృహాలు, 60 ఏళ్లు దాటిన వారికి పింఛన్, అసంఘటిత కార్మికుల హోదా, ప్రత్యేక చట్టం, మీడియా కమిషన్, హైపవర్ కమిటీ,మీడియా అకాడమిక్ గవర్నింగ్ కౌన్సిల్ చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

31, జులై 2026

శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీ వర్కర్ల భారీ ధర్నా పిలుపు
జిల్లా వార్తలు

శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీ వర్కర్ల భారీ ధర్నా పిలుపు

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో 'చలో కలెక్టరేట్ ’ధర్నాకు సంబంధించి పెనుకొండలో AP అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ , CITU ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు వేతనాలు, సేవా నిబంధనలు, ఇతర హక్కుల సమస్యల పరిష్కారానికి ఈ ధర్నా నిర్వహిస్తున్నట్టు యూనియన్ నాయకులు తెలిపారు.

31, జులై 2026

భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం..   తాడిపత్రిలో జేసీ మాస్టర్ ప్లాన్..
జిల్లా వార్తలు

భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ మాస్టర్ ప్లాన్..

అనంతపురం జిల్లా తాడిపత్రిని భిక్షగాళ్ల రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. వచ్చే నెల రోజుల్లో పట్టణంలో రోడ్లపై భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి వారికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.

30, జులై 2026

2034 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ధీమా – ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ సమావేశం
తెలంగాణ

2034 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ధీమా – ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2034 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ధీమా వ్యక్తం చేస్తూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పెంచాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు, బడుల సౌకర్యాల మెరుగుదలపై దృష్టి పెట్టాలని సూచిస్తూ, జీతాల సమయాన చెల్లింపు, హాస్టల్ డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపు వంటి చర్యలను వివరించారు.

30, జులై 2026

వన్యప్రాణుల సంరక్షణ మనందరి లక్ష్యం  : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాజకీయాలు

వన్యప్రాణుల సంరక్షణ మనందరి లక్ష్యం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించి పంటలు ధ్వంసం చేయడంతో ప్రజలు భయాందోళనల మధ్య జీవిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా కాలంగా ఈ ఇబ్బందులు ఉన్నాయని అన్నారు.

29, జులై 2026

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలోకే వెళ్లాలి: కమిషనర్ చల్లా ఓబులేసు
జిల్లా వార్తలు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలోకే వెళ్లాలి: కమిషనర్ చల్లా ఓబులేసు

కర్నూలు నగరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి అర్జీదారులతో ప్రత్యక్షంగా మాట్లాడాలని కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. ఎఫ్‌సీఐ కాలనీ, ఎన్జీవో కాలనీ, వెంకటాద్రి నగర్, గణేష్ నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో ఫిర్యాదుల ప్రదేశాలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించి గుంతల పూడ్చివేత, వీధి దీపాలు, డ్రైనేజీ కాలువల నిర్మాణం వంటి పనులను తక్షణం చేపట్టాలని ఆదేశించారు. ప్రతి అధికారి ప్రజా ఫిర్యాదులను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పరిష్కరించి, తీసుకుంటున్న చర్యలను ఫిర్యాదుదారులకు స్పష్టంగా వివరించాలని ఆయన సూచించారు.

29, జులై 2026

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత – నిర్ణీత గడువులో చట్టపరంగా పరిష్కారం: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
జిల్లా వార్తలు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత – నిర్ణీత గడువులో చట్టపరంగా పరిష్కారం: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్

వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక”లో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రజల నుంచి వచ్చిన 130 ఫిర్యాదులను స్వయంగా పరిశీలించారు. ప్రతి ఫిర్యాదును చట్టపరమైన పరిమితుల్లో, నిర్ణీత గడువులో తప్పనిసరిగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ, ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా పోలీస్ శాఖకు ఫిర్యాదులు ఇవ్వాలని సూచించారు.

28, జులై 2026

నంద్యాల జిల్లా పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 120 ఫిర్యాదుల స్వీకరణ
జిల్లా వార్తలు

నంద్యాల జిల్లా పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 120 ఫిర్యాదుల స్వీకరణ

నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక"లో మొత్తం 120 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. ప్రతి ఫిర్యాదుపై పూర్తిస్థాయి విచారణ జరిపి, చట్ట పరిధిలో తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి, ఫిర్యాదుల పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

28, జులై 2026

ప్రజాభిప్రాయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి: జిల్లా కలెక్టర్
జిల్లా వార్తలు

ప్రజాభిప్రాయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి: జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పీజీఆర్ఎస్ ద్వారా పొందుతున్న సేవలపై ప్రజలు తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాన్ని నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా, మండల పీజీఆర్ఎస్ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ల ద్వారా వచ్చిన స్పందనలు సేవల నాణ్యత మెరుగుదలకు ఉపయోగపడతాయని, ఫిర్యాదుల స్థితిగతులను టోల్ ఫ్రీ 1100 ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.

27, జులై 2026

ప్రొద్దుటూరులో RTC పాత బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో RTC పాత బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు

ప్రొద్దుటూరు RTC పాత బస్ స్టాండ్ వద్ద మసీదు లోనికి వెళ్లే దారిని ఆటోలు, తోపుడు బండ్లు అడ్డుకోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రజలకు ఇబ్బందులు పెరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ సమస్యపై AP స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. V.S. ముక్తియార్ స్థలాన్ని పరిశీలించి, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, ట్రాఫిక్ పోలీసులతో చర్చించి, మసీదు మార్గం నిర్బంధం లేకుండా, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

26, జులై 2026

అన్నమయ్య జిల్లాలో గంజాయి, సైబర్ నేరాలపై పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
జిల్లా వార్తలు

అన్నమయ్య జిల్లాలో గంజాయి, సైబర్ నేరాలపై పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు గంజాయి వినియోగం, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై గ్రామాల స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతలో మాదకద్రవ్యాల వ్యసనం, ఆన్‌లైన్ మోసాలు, రహదారి భద్రత, మహిళలు–పిల్లల రక్షణ చట్టాలపై ప్రజలకు సూచనలు ఇస్తూ, నేరరహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం కోరుతున్నారు.

25, జులై 2026

స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజలతో అనుబంధం పెంచుకోవాలి: నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజలతో అనుబంధం పెంచుకోవాలి: నాదెండ్ల మనోహర్

నాదెండ్ల మనోహర్ స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజలతో అనుబంధం, వ్యక్తిగత నమ్మకం కీలకమని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకే మద్దతు లభిస్తుందని అన్నారు. జనసేనలో గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ వ్యూహాత్మకంగా కృషి చేయాలని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు.

24, జులై 2026

ప్రజా దర్బార్‌లో సమస్యలు విన్న ఎమ్మెల్యే, పరిష్కారానికి చర్యలు
జిల్లా వార్తలు

ప్రజా దర్బార్‌లో సమస్యలు విన్న ఎమ్మెల్యే, పరిష్కారానికి చర్యలు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం 34వ వార్డు రామస్వామి గుడి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే ప్రజలను నేరుగా కలిసి హౌసింగ్, పెన్షన్లు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి సమస్యలను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం కల్పించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశిస్తూ, ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లడం, ప్రతి కుటుంబ సమస్యను విని పరిష్కరించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.

23, జులై 2026

జల్ జీవన్ మిషన్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్

జల్ జీవన్ మిషన్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం జల్ జీవం మిషన్ , అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షలో పనుల నాణ్యతపై రాజీ లేకుండా, వర్షాభావం, తాగునీటి ఎద్దడిని ముందుగానే ఎదుర్కొనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సుమారు రూ.2,500 కోట్ల వ్యయంతో పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.

22, జులై 2026

బ్రహ్మం సాగర్ ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్కుల సాగునీరు విడుదల
జిల్లా వార్తలు

బ్రహ్మం సాగర్ ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్కుల సాగునీరు విడుదల

మైదుకూరు నియోజకవర్గంలో బ్రహ్మం సాగర్ ఎడమ ప్రధాన కాలువ ద్వారా రోజుకు 200 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేయడంతో ఆయకట్టు పరిధిలోని రైతులకు ఊరట లభించింది. వరుస కరువులు, వర్షాభావం మధ్య ఈ నీటివిడుదలతో వరి, మిర్చి, పత్తి తదితర పంటల సాగు పనులు వేగం పొందే అవకాశం ఉందని, దిగుబడి పెరిగి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

21, జులై 2026

ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకోండి..   : కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
రాజకీయాలు

ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకోండి.. : కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కోరారు.

20, జులై 2026

500 కుటుంబాలకు ఇంటి పట్టాలకు  సుగమం
జిల్లా వార్తలు

500 కుటుంబాలకు ఇంటి పట్టాలకు సుగమం

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చింతల ముని నగర్‌లో దాదాపు శతాబ్ద కాలంగా కొనసాగుతున్న భూ సమస్యను రెవెన్యూ శాఖ అధికారులు పరిష్కరించి, Survey No. 448/ఏ3లోని 8.10 ఎకరాల ప్రభుత్వ భూమిని 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీంతో అక్కడ వందేళ్లుగా నివసిస్తున్న 500 కుటుంబాలకు ఇంటి పట్టాల జారీకి మార్గం సుగమమై, లబ్ధిదారులు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తదితర అధికారులను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

18, జులై 2026

గోదావరి జలాలతో రాయలసీమకు శాశ్వత పరిష్కారం: మంత్రి సత్య కుమార్
రాజకీయాలు

గోదావరి జలాలతో రాయలసీమకు శాశ్వత పరిష్కారం: మంత్రి సత్య కుమార్

రాయలసీమ కరవు నివారణకు గోదావరి జలాలు శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.

16, జులై 2026

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే అమినినేని
జిల్లా వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే అమినినేని

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం గ్రామీణ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సమగ్రంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అమినినేని సురేంద్రబాబు ప్రజాదర్బార్‌లో తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను సంబంధిత శాఖలతో సమన్వయం చేసి దశలవారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటూ, ప్రజాదర్బార్‌లను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని భావిస్తున్నారు.

16, జులై 2026

అభివృద్ధిలో రాజకీయం వద్దు.. కేంద్రంతో చర్చలతోనే సమస్యల పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

అభివృద్ధిలో రాజకీయం వద్దు.. కేంద్రంతో చర్చలతోనే సమస్యల పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని, ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంతో సమన్వయం, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. వరంగల్ మమూనూరు, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని, 2034 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడంలో ప్రాంతీయ ఎయిర్ పోర్టుల అభివృద్ధి కీలకమని ఆయన పేర్కొన్నారు.

14, జులై 2026

నంద్యాల జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం
జిల్లా వార్తలు

నంద్యాల జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం

నంద్యాల జిల్లా కోర్టు సముదాయంలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో సుమారు 300 కేసులు రాజీ మార్గంలో పరిష్కరించగా, అందులో 125 మోటార్ వాహన ప్రమాద పరిహార కేసులు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీల సహకారంతో బాధితులకు సుమారు రూ.3 కోట్ల 50 లక్షల పరిహారం సెటిల్ చేయడం ద్వారా ప్రమాద బాధితులు, మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలిగిందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి.

12, జులై 2026

జగన్‌ నైజం..‘హిట్‌..రన్‌ అండ్‌ ఎస్కేప్‌’ : సీఎం బాబు : సమస్యలు సృష్టించి.. బెంగళూరులో దాక్కుంటారు..
రాజకీయాలు

జగన్‌ నైజం..‘హిట్‌..రన్‌ అండ్‌ ఎస్కేప్‌’ : సీఎం బాబు : సమస్యలు సృష్టించి.. బెంగళూరులో దాక్కుంటారు..

‘హిట్‌, రన్‌ అండ్‌ ఎస్కేప్‌ అనేది గొడ్డలి పార్టీ అధినేత నైజం’ అని సీఎం చంద్రబాబు విమర్శించారు. నేరపూరిత మనస్తత్వం ఉండేవారు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుంటున్నారని, ప్రభుత్వాన్ని, నేతలను లక్ష్యంగా చేసుకొని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

11, జులై 2026

అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌
జిల్లా వార్తలు

అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

మదనపల్లె జిల్లా కేంద్రంలో ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ఉద్యోగులు చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించి ధర్నా చేశారు. వేతనాల పెంపు, పెండింగ్ ప్రమోషన్లు, పని పరిస్థితుల మెరుగుదల, సామాజిక భద్రతా పథకాలు, నవచేతన యాప్ రద్దు, పిల్లల అవసరాలకు అనుగుణంగా కొత్త అంగన్‌వాడీ కేంద్రాల మంజూరును డిమాండ్ చేస్తూ సమస్యలు పరిష్కారం వరకు పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగులు సంకల్పం వ్యక్తం చేశారు.

10, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters