బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#శాంతిభద్రతల

29 articles

ప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు

ప్రొద్దుటూరు పట్టణంలో DSC నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించరాదని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోసులాట చోటుచేసుకోగా, మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.

10, ఆగ 2026

వరుస నేరాలకు చెక్… రౌడీ షీటర్‌పై పి.డి. యాక్ట్ అమలు
జిల్లా వార్తలు

వరుస నేరాలకు చెక్… రౌడీ షీటర్‌పై పి.డి. యాక్ట్ అమలు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్‌కు చెందిన రౌడీ షీటర్ షేక్ ముజాహిద్ @ ముజ్జు (21)పై వరుస నేరాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం, 1986 ప్రకారం పి.డి. యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. గత రెండు సంవత్సరాల్లో, ముఖ్యంగా ఇటీవలి మూడు నెలల్లో అతనిపై ఏడు క్రిమినల్ కేసులు నమోదవడంతో, ప్రజాశాంతి పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

9, ఆగ 2026

ప్రొద్దుటూరు లో కాలువలపై అక్రమ కట్టడాలే కారణమా?
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు లో కాలువలపై అక్రమ కట్టడాలే కారణమా?

కడప జిల్లా ప్రొద్దుటూరులో చిన్నపాటి వర్షం పడినా ప్రధాన రహదారులు చెరువుల్లా నీటమునిగిపోవడం స్థానికులకు తలనొప్పిగా మారింది. వైఎంఆర్ కాలనీ సహా పలుచోట్ల మున్సిపల్ కాలువలపై శాశ్వత అక్రమ కట్టడాలు, పూడికలు తొలగించకపోవడం వల్ల పారిశుద్ధ పనులు సక్రమంగా సాగడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్త కమిషనర్ Thodika Srinivas Vishwanath ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి సమస్యను పరిష్కరిస్తారా అన్నది ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

8, ఆగ 2026

దళితులపై దాడులు, శాంతిభద్రతల వైఫల్యంపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం
జిల్లా వార్తలు

దళితులపై దాడులు, శాంతిభద్రతల వైఫల్యంపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం

రాష్ట్రంలో దళితులపై దాడులు, లాకప్ డెత్‌లు, శాంతిభద్రతల క్షీణతపై జాతీయ ఎస్సీ కమిషన్ తక్షణ జోక్యం కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ప్రతినిధి బృందం కమిషన్ ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ వైఫల్యం, బాధితులకు న్యాయం లేకపోవడం, మీడియా స్వేచ్ఛపై దాడులు ఆందోళనకరమని ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శిస్తూ, దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

7, ఆగ 2026

ఎర్రగుంట్ల పోలీసుల అవగాహన సమావేశం
జిల్లా వార్తలు

ఎర్రగుంట్ల పోలీసుల అవగాహన సమావేశం

వై.ఎస్.ఆర్. కడప జిల్లా ఎర్రగుంట్ల పరిధిలోని నిడుజువ్వి గ్రామంలో ఎర్రగుంట్ల సి.ఐ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన సమావేశం జరిగింది. గ్రామస్థులతో సమస్యలు, శాంతిభద్రతల అంశాలపై చర్చించి, అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలపై వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళల భద్రత కోసం Disha యాప్ వినియోగం, సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించగా, గ్రామస్థులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు.

7, ఆగ 2026

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, నియమ నిబంధనలతో నిర్వహించాలి:  పోలీసు శాఖ
జిల్లా వార్తలు

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, నియమ నిబంధనలతో నిర్వహించాలి: పోలీసు శాఖ

రానున్న వినాయక చవితి, నవరాత్రి సందర్భంగా హిందూపురం పట్టణంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖలు సూచించాయి. మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు, నిర్దేశిత సమయాల్లో ప్రతిష్ఠాపన, నిమజ్జనం, శబ్ద కాలుష్య నియంత్రణ, భద్రత, పారిశుధ్యం, సోషల్ మీడియా వినియోగంపై కఠిన నియమాలు అమలు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

6, ఆగ 2026

అనంతపురం జిల్లాలో “ఆపరేషన్ నైట్ సేఫ్టీ” ముమ్మరం
జిల్లా వార్తలు

అనంతపురం జిల్లాలో “ఆపరేషన్ నైట్ సేఫ్టీ” ముమ్మరం

అనంతపురం జిల్లాలో రాత్రి వేళల్లో ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం పోలీసులు “ఆపరేషన్ నైట్ సేఫ్టీ” పేరుతో విస్తృత తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, చెక్‌పోస్టులు, లాడ్జీలు, హోటళ్ల వద్ద వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులపై దృష్టి పెట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కట్టుదిట్టం చేస్తూ, ప్రజలు అనుమానాస్పద కదలికలు గమనిస్తే డయల్ 100, 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

1, ఆగ 2026

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ..   పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌
రాజకీయాలు

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

29, జులై 2026

నంద్యాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
జిల్లా వార్తలు

నంద్యాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

నంద్యాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వనగర్‌లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, అనుమానితులు, రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వారి ఇళ్లలో సోదాలు చేసి, ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రజలతో సమావేశం నిర్వహించి, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై వెంటనే పోలీసులకు లేదా టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

28, జులై 2026

నంద్యాల జిల్లాలో రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్
జిల్లా వార్తలు

నంద్యాల జిల్లాలో రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

నంద్యాల జిల్లాలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి పోలీస్ స్టేషన్‌లలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో వారికి సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ, మళ్లీ నేరాలకు పాల్పడితే PD Act, బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

27, జులై 2026

కడప జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
జిల్లా వార్తలు

కడప జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

కడప జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, చట్టవిరుద్ధ వ్యాపారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ స్మార్ట్ పోలీసింగ్ ద్వారా కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆధునిక సాంకేతికత, డేటా ఆధారిత పర్యవేక్షణ, ప్రత్యేక దళాల సమన్వయంతో నేర నియంత్రణ, ప్రజా సేవా ప్రమాణాల పెంపు, పోలీసు-ప్రజల విశ్వాస వాతావరణం బలోపేతంపై దృష్టి సారించినట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.

26, జులై 2026

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన రిమ్స్ పోలీసు అధికారులు
జిల్లా వార్తలు

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన రిమ్స్ పోలీసు అధికారులు

జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. సి.ఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేరప్రవృత్తి దుష్పరిణామాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల ప్రభావం గురించి అవగాహన కల్పించి, మార్పు దిశగా అడుగులు వేస్తే శాంతిభద్రతలు బలోపేతం అవుతాయని, మళ్లీ నేరాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

26, జులై 2026

పులివెందుల రూరల్ సర్కిల్‌లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
జిల్లా వార్తలు

పులివెందుల రూరల్ సర్కిల్‌లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

పులివెందుల రూరల్ సర్కిల్‌లో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు సి.ఐ శాంతిలాల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తూ, చట్టబద్ధ జీవన విధానానికి మళ్లించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

23, జులై 2026

బద్వేల్‌లో మహిళపై దాడి ఘటనపై నిరసన: ఎమ్మెల్యే సుధా
జిల్లా వార్తలు

బద్వేల్‌లో మహిళపై దాడి ఘటనపై నిరసన: ఎమ్మెల్యే సుధా

బద్వేల్‌లో మహిళపై దాడి ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. బద్వేల్ ఎమ్మెల్యే సుధా, టిడిపి నాయకులు మహిళలపై దాడులు, అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ, సంబంధిత నాయకులను వెంటనే అరెస్టు చేయాలని, హోంమినిస్టర్ జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

22, జులై 2026

దిష్టిబొమ్మలు తగలబెట్టినా నాకు నష్టం లేదు:  అంబటి రాంబాబు స్పందన
ఆంధ్రప్రదేశ్

దిష్టిబొమ్మలు తగలబెట్టినా నాకు నష్టం లేదు: అంబటి రాంబాబు స్పందన

ఎమ్మార్పీఎస్ నాయకులు తన దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసనలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ, తాను హోంమంత్రి వంగలపూడి అనితపై కులదూషణ చేయలేదని, పరుష పదజాలం ఉపయోగించలేదని స్పష్టం చేశారు. దిష్టిబొమ్మలు తగలబెట్టడం వల్ల తనకు ఎలాంటి నష్టం లేదని, అనితకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, అయితే తన వ్యాఖ్యల వల్ల మందకృష్ణ మాదిగ బాధపడి ఉంటే ఆయనకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

22, జులై 2026

కాకరోచ్ ‘సంసద్ చలో’ నిరసన.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
జాతీయం

కాకరోచ్ ‘సంసద్ చలో’ నిరసన.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ఢిల్లీ వేదికగా తీవ్ర కలకలం రేగింది. కాకరోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘సంసద్ చలో’ నిరసన ప్రదర్శన తీవ్ర హింసాత్మకంగా మారింది. జంతర్ మంతర్, జన్ పథ్, రైసీనా రోడ్ వంటి కీలక ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి.

21, జులై 2026

హోంగార్డుల ఉద్యోగ భద్రత కోసం కేంద్రానికి వినతి
తెలంగాణ

హోంగార్డుల ఉద్యోగ భద్రత కోసం కేంద్రానికి వినతి

తెలంగాణ రాష్ట్ర హోంగార్డుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి, దేశవ్యాప్తంగా హోంగార్డులకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించేందుకు చట్ట సవరణలు చేయాలని వినతిపత్రం సమర్పించారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి, హోంగార్డులకు స్థిరమైన సేవా నిబంధనలు, వేతనాలు, పదవీ భద్రత, సంక్షేమ పథకాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, 1946–47, 1962–63 నాటి హోంగార్డ్ చట్టాల్లో మార్పులు అవసరమని సంఘం పేర్కొంది.

13, జులై 2026

కడప తాలూకా పోలీస్ స్టేషన్ సీఐగా రాజేంద్రనాథ్ యాదవ్ బాధ్యతల స్వీకరణ
జిల్లా వార్తలు

కడప తాలూకా పోలీస్ స్టేషన్ సీఐగా రాజేంద్రనాథ్ యాదవ్ బాధ్యతల స్వీకరణ

కడప జిల్లా తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా రాజేంద్రనాథ్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. చట్టం, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నేరాల నియంత్రణ, ప్రజలతో అనుసంధానం బలోపేతం, పారదర్శకతతో పనిచేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

7, జులై 2026

మణిపూర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి
జాతీయం

మణిపూర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి

మణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. సోమవారం జరిగిన దాడిలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు అమరులయ్యారు. మరికొందరు గాయపడ్డారు.

6, జులై 2026

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి: బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు కలకలం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి: బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు కలకలం

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, వైసీపీ నేతలు, పోలీసులపై దాడులు హత్యాయత్న స్థాయిలో ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, రాజధాని సంబంధిత నిర్ణయాలు పారదర్శకంగా లేకపోవడం వల్ల ఉద్రిక్తతలు పెరిగి, ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

28, జూన్ 2026

అన్నమయ్య జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా యు. సదాశివయ్య బాధ్యతల స్వీకరణ
జిల్లా వార్తలు

అన్నమయ్య జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా యు. సదాశివయ్య బాధ్యతల స్వీకరణ

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో స్పెషల్ బ్రాంచ్ కొత్త సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా నియమితులైన యు. సదాశివయ్య బాధ్యతలు స్వీకరించి, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని మర్యాదపూర్వకంగా కలిశారు. స్పెషల్ బ్రాంచ్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమని ఎస్పీ సూచిస్తూ, అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా, ముందస్తు సమాచార సేకరణలో నిర్లక్ష్యం లేకుండా అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు.

25, జూన్ 2026

తాడిపత్రిలో జేసీ వర్గీయుల అరాచకాలకు వ్యతిరేకంగా వైసీపీ పోరుబాట
జిల్లా వార్తలు

తాడిపత్రిలో జేసీ వర్గీయుల అరాచకాలకు వ్యతిరేకంగా వైసీపీ పోరుబాట

తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయుల అరాచకాలు, దౌర్జన్యాలకు నిరసనగా వైయస్ఆర్‌సీపీ ఈ నెల 26న గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్షకు పిలుపునిచ్చింది. తాడిపత్రిలో శాంతిభద్రతలు క్షీణించాయని, గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నం, ప్రభుత్వ ఆసుపత్రిపై దాడి వంటి ఘటనలపై ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

24, జూన్ 2026

విద్యార్థినులపై ఆదిభట్ల సీఐ దౌర్జన్యం
తెలంగాణ

విద్యార్థినులపై ఆదిభట్ల సీఐ దౌర్జన్యం

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లోని న్యూ శ్రీ చైతన్య కాలేజీ ఎదుట ఒరిజినల్ ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థినులపై ఆదిభట్ల సీఐ లాఠీచార్జ్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థి, మహిళా సంఘాలు, మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఐని సస్పెండ్ చేయాలని, కాలేజీ యాజమాన్యం, సంబంధిత పోలీసు అధికారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

23, జూన్ 2026

అది క్రిమినల్స్ అదృష్టం: పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్

అది క్రిమినల్స్ అదృష్టం: పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేకపోవడం క్రిమినల్స్ అదృష్టమని వ్యాఖ్యానిస్తూ, ఇకపై గుండాలు, నేరగాళ్లపై కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. నేరస్తులను కుల కళ్లజోడుతో చూడకూడదని, కుల రాజకీయాలు సమాజాన్ని విభజిస్తున్నాయని విమర్శిస్తూ, బాధితులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని, జనసేన ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య ఉండి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

21, జూన్ 2026

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: రాచమల్లు శివప్రసాదరెడ్డి
జిల్లా వార్తలు

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: రాచమల్లు శివప్రసాదరెడ్డి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణించాయని, వరుసగా చోటుచేసుకున్న లాకప్‌ మరణాలు, ఆత్మహత్యలు దీనికి నిదర్శనమని అన్నారు. ఈ పరిస్థితికి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే రాజీనామా చేయాలని, సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజుతో పాటు బాధ్యులపై సీబీఐ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

21, జూన్ 2026

మేకప్‌పై రచ్చ.. శాంతిభద్రతలపై మౌనం! : హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
రాజకీయాలు

మేకప్‌పై రచ్చ.. శాంతిభద్రతలపై మౌనం! : హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..

హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల తీవ్ర స్థాయిలో స్పందించారు. హోంమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఆమె విమర్శించారు.

18, జూన్ 2026

మహిళా ద్వేషపూరిత వ్యాఖ్యలు వైకాపా నైజం
రాజకీయాలు

మహిళా ద్వేషపూరిత వ్యాఖ్యలు వైకాపా నైజం

హోంమంత్రి అనితపై వైకాపా నేతల అవమానకర, మహిళా ద్వేషపూరిత వ్యాఖ్యలు ఆ పార్టీ నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నాయని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. అనిత కష్టపడే, ధైర్యవంతమైన ప్రజానాయకురాలని, ఆమెపై వ్యక్తిగత దాడులతో వైకాపా మహిళల పట్ల అసమ్మానం, అసహనాన్ని చూపుతోందని పేర్కొంటూ, అనితతో పాటు ప్రతి మహిళ, ప్రతి దళితుడికి క్షమాపణ చెప్పాలని, ఇలాంటి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

17, జూన్ 2026

మద్యం మత్తులో వెటర్నరీ డాక్టర్‌పై కానిస్టేబుల్ దాడి
జిల్లా వార్తలు

మద్యం మత్తులో వెటర్నరీ డాక్టర్‌పై కానిస్టేబుల్ దాడి

తిరుపతి మండలం ఉప్పరపల్లిలోని మద్యం దుకాణంలో సోమవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు కానిస్టేబుల్ మద్యం మత్తులో తోటి స్నేహితుడైన వెటర్నరీ డాక్టర్‌పై దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

10, జూన్ 2026

బాధిత హోంగార్డుల కుటుంబాలకు అండగా అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ
జిల్లా వార్తలు

బాధిత హోంగార్డుల కుటుంబాలకు అండగా అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లిలో జరిగిన కార్యక్రమంలో విధి నిర్వహణలో మరణించిన ఐదుగురు హోంగార్డుల కుటుంబాలకు సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం చెక్కులను, పదవీ విరమణ పొందిన హోంగార్డు టి. శ్రీనివాసులుకు తోటి హోంగార్డులు విరాళంగా సేకరించిన రూ.2,23,650 చెక్కును అందజేశారు. హోంగార్డుల సేవలు అమూల్యమని, అవసర సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవడం పోలీస్ శాఖ బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters