బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#భారతదేశం

40 articles

వినియోగదారుల కోసం కొత్త  Airtel వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు
బిజినెస్

వినియోగదారుల కోసం కొత్త Airtel వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం 365 రోజుల వ్యాలిడిటీతో నాలుగు వార్షిక ప్లాన్‌లను అందిస్తోంది. కాల్స్ మాత్రమే అవసరమైన వారికి రూ.1,849, తక్కువ డేటా వినియోగించే వారికి రోజుకు 1GBతో రూ.2,249, స్ట్రీమింగ్, వీడియో కాల్స్ కోసం రోజుకు 2GBతో రూ.2,999, హెవీ డేటా యూజర్లకు రోజుకు 2.5GBతో రూ.3,999 ప్లాన్‌లు అందుబాటులో ఉండి, ఏడాది పాటు నిరంతర కాల్స్, డేటా, SMS సేవలను కల్పిస్తున్నాయి.

2, ఆగ 2026

హాలీవుడ్ చిత్రాలపై సెన్సార్ కత్తెర.. భారతీయ థియేటర్లలో కట్‌ల వేటు
సినిమా

హాలీవుడ్ చిత్రాలపై సెన్సార్ కత్తెర.. భారతీయ థియేటర్లలో కట్‌ల వేటు

భారతీయ సెన్సార్ బోర్డు హాలీవుడ్ చిత్రాల్లో హింస, ఆసభ్య సంభాషణలు, రొమాంటిక్ సన్నివేశాలపై కఠినంగా కత్తెర వేస్తోంది. స్పైడర్ - మ్యాన్: బ్రాండ్ న్యూ డే , అబ్సెషన్ , Disclosure Day, డెడ్ పూల్ & వుల్వరైన్, ఫాస్ట్ & ఫురిఎస్ వంటి చిత్రాల్లో పలు సన్నివేశాలు, పదాలను కట్ లేదా మ్యూట్ చేయగా, వయోపరిమితి రేటింగ్స్ ఉన్నప్పటికీ ఎందుకు ట్రిమ్ చేస్తున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వివాదాల మధ్య కూడా భారత్‌లో హాలీవుడ్ సినిమాల క్రేజ్, బాక్సాఫీస్ ఓపెనింగ్స్ మాత్రం తగ్గడం లేదు.

29, జులై 2026

స్పీడ్ పోస్ట్ సేవలకు కొత్త రేట్లు: లేఖలు, పార్శిల్‌లపై స్పష్టమైన మార్గదర్శకాలు
బిజినెస్

స్పీడ్ పోస్ట్ సేవలకు కొత్త రేట్లు: లేఖలు, పార్శిల్‌లపై స్పష్టమైన మార్గదర్శకాలు

భారత తపాలా శాఖ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చేలా ’24 స్పీడ్ పోస్ట్’, ’48 స్పీడ్ పోస్ట్’ సేవలకు కొత్త రేట్లు ప్రకటించింది. లేఖలుగా పరిగణించే వస్తువులు, పార్శిల్‌గా పరిగణించే వస్తువులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, బరువు, దూరాన్ని బట్టి రిటైల్, బల్క్ వినియోగదారుల కోసం వేర్వేరు చార్జీలు నిర్ణయించింది. వినియోగదారులు వస్తువు లేఖా, పార్శిల్ కేటగిరీలోదో ముందుగా నిర్ధారించుకుని సేవలను వినియోగించుకోవాలని సూచించింది.

28, జులై 2026

పాక్‌కు ఊహకందని రీతిలో బదులిస్తాం  : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
జాతీయం

పాక్‌కు ఊహకందని రీతిలో బదులిస్తాం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్ సెక్టార్‌లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారక స్థూకం వద్ద దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ధిరాజ్ సేత్ ఘనంగా నివాళులర్పించారు.

26, జులై 2026

భారత్‌లో తొలి స్వదేశీ 200 సీట్ల ప్రయాణికుల విమాన ప్రాజెక్టుకు శ్రీకారం
జాతీయం

భారత్‌లో తొలి స్వదేశీ 200 సీట్ల ప్రయాణికుల విమాన ప్రాజెక్టుకు శ్రీకారం

హంస ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ , ఆరున్నొవా ఇంజనీరింగ్ డివిజన్ కలిసి భారత తొలి స్వదేశీ 200 సీట్ల కమర్షియల్ ప్రయాణికుల విమాన అభివృద్ధికి ఫఱంబోరౌగ్ ఇంటర్నేషనల్ ఐర్షో -2026లో MoU కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంతో రూపకల్పన, ధృవీకరణ, తయారీతో పాటు దేశీయ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్, సరఫరా గొలుసు, సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధికి దృష్టి సారించి, భారత విమానయాన పరిశ్రమకు బలమైన పునాది వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

21, జులై 2026

ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ వినియోగంపై కొత్త నిబంధనలు
టెక్నాలజీ

ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ వినియోగంపై కొత్త నిబంధనలు

భారతి ఎయిర్‌టెల్ తన అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్‌ను పూర్తిగా వ్యక్తిగత వినియోగానికి మాత్రమే పరిమితం చేస్తూ, హాట్‌స్పాట్ ద్వారా షేర్ చేసే డేటాను సాధారణ రోజువారీ ప్లాన్ డేటాగా లెక్కించనున్నట్లు నిబంధనలు అప్‌డేట్ చేసింది. ప్రతి 30 రోజులకు 300GB ఫెయిర్ యూసేజ్ పరిమితి పెట్టి, దానిని మించి కమర్షియల్ వినియోగం గుర్తిస్తే కనెక్షన్ నిలిపివేయొచ్చని స్పష్టం చేసింది. పోస్ట్‌పెయిడ్ విభాగంలో రూ.549 ఇండివిడ్యువల్ ప్లాన్‌ను తొలగించడంతో, ఇప్పుడు కనిష్ఠంగా రూ.449 ప్లాన్ లేదా ఎక్కువ ప్రయోజనాల కోసం రూ.699 ఫ్యామిలీ ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

21, జులై 2026

తమిళనాడు దినోత్సవం: నంబర్‌ వన్‌గా నిలబెట్టేందుకు సీఎం విజయ్‌ సంకల్పం
తమిళనాడు

తమిళనాడు దినోత్సవం: నంబర్‌ వన్‌గా నిలబెట్టేందుకు సీఎం విజయ్‌ సంకల్పం

తమిళనాడు దినోత్సవం సందర్భంగా సీఎం విజయ్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, తమిళనాడును భారతదేశంలో అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మద్రాసు రాష్ట్రం ఏర్పడిన నవంబర్‌ 1, రాష్ట్రానికి తమిళనాడు అనే పేరు పెట్టిన జూలై 18 తేదీలను అధికారికంగా జరుపుకుంటామని తెలిపారు. మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ కూడా లండన్‌ నుంచి శుభాకాంక్షలు పంపించారు.

19, జులై 2026

కుడంకుళం అణు కేంద్రం డేటా లీక్?..   డార్క్ వెబ్‌లో బ్లూప్రింట్
జాతీయం

కుడంకుళం అణు కేంద్రం డేటా లీక్?.. డార్క్ వెబ్‌లో బ్లూప్రింట్

భారతదేశంలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన తమిళనాడులోని కుడంకుళం ప్లాంట్ బ్లూఫ్రింట్స్ డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది. రాన్సమ్‌వేర్ గ్రూప్ ‘ వరల్డ్ లీక్స్’ ఈ ఫైళ్లను డార్క్ వెబ్‌లో పోస్ట్ చేసినట్లు రాయిటర్స్ నివేదించింది.

15, జులై 2026

ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియాకు గాయాల బెడద..
క్రీడలు

ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియాకు గాయాల బెడద..

ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియాకు గాయాల బెడద తీవ్రంగా ఉంది. తొలి వన్డేలో శుభ్‌మన్‌ గిల్‌, గుర్నూర్‌ బ్రార్‌ గాయపడగా, శ్రేయస్‌ అయ్యర్‌ కూడా అసౌకర్యానికి గురయ్యాడు. రెండో వన్డేకు ముందు వీరి ఫిట్‌నెస్‌పై సందిగ్ధత నెలకొనగా, బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదిలా ఉండగా బుమ్రా బౌలింగ్‌లో మెరిసినా, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌లో విఫలమవడంతో వారి ఫామ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

15, జులై 2026

పారాక్వాట్ గడ్డిమందుపై దేశవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం
వ్యవసాయం

పారాక్వాట్ గడ్డిమందుపై దేశవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం

కేంద్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డిమందుపై దేశవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధిస్తూ జూలై 14 నుంచి అమల్లోకి వచ్చేలా ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. కీటకనాశన చట్టం 1968 ప్రకారం దిగుమతి, తయారీ, రవాణా, పంపిణీపై పూర్తి నిషేధం ఉండగా, కంపెనీల అభ్యంతరాల కోసం ఆగస్టు 13 వరకు గడువు ఇచ్చింది. పారాక్వాట్ వల్ల వేలాది మంది రైతులు మృతి చెందడం, దీనికి నిర్దిష్ట విరుగుడు లేకపోవడం వైద్యులు, నిపుణుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.

15, జులై 2026

దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీకి ఫార్చ్యూన్ ఇండియా గౌరవం
బిజినెస్

దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీకి ఫార్చ్యూన్ ఇండియా గౌరవం

ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, క్రీడలు, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆమె సేవలకు గుర్తింపుగా అమెరికాలో AAPI హ్యూమానిటరియాన్ అవార్డు, టాంపా నగర ‘Key to the City’ గౌరవాలు కూడా లభించాయి.

12, జులై 2026

98వ గ్రాండ్‌మాస్టర్ గా 17 ఏళ్ల అశ్వత్ ఎస్
క్రీడలు

98వ గ్రాండ్‌మాస్టర్ గా 17 ఏళ్ల అశ్వత్ ఎస్

తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల అశ్వత్ ఎస్ భారతదేశ 98వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించి దేశ చదరంగ చరిత్రలో కొత్త మైలురాయిని నమోదు చేశాడు. చిన్న వయసులోనే చదరంగంలో ప్రవేశించి, రాష్ట్ర స్థాయి అండర్-7 పోటీల్లో 9/9 పరిపూర్ణ స్కోరు సహా పలు విజయాలు సాధించిన అతడు, గతేడాది డిసెంబర్‌లో 2500 అంతర్జాతీయ రేటింగ్ మార్కును దాటుతూ అవసరమైన నార్మ్‌లను పూర్తి చేసి గ్రాండ్‌మాస్టర్ హోదా పొందడంతో భారత చదరంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు.

10, జులై 2026

గ్లోబల్ బ్రాండ్‌గా ‘మేక్ ఇన్ ఇండియా’ : ప్రధాని మోడీ
అంతర్జాతీయం

గ్లోబల్ బ్రాండ్‌గా ‘మేక్ ఇన్ ఇండియా’ : ప్రధాని మోడీ

గత 12 సంవత్సరాలుగా ‘మేక్ ఇన్ ఇండియా’’ ఒక గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగిందని ప్రధాని మోడీ అన్నారు. మెల్‌బోర్న్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.

9, జులై 2026

సింధు జలాల ఇవ్వకుంటే యుద్ధమే!  ..రంకెలేస్తున్న పాక్
అంతర్జాతీయం

సింధు జలాల ఇవ్వకుంటే యుద్ధమే! ..రంకెలేస్తున్న పాక్

సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, నీటి ప్రవాహాన్ని ఆపడం లేదా మళ్లించడం యుద్ధ చర్యగా పరిగణిస్తామని NSC, సైన్యం హెచ్చరిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఒప్పందం నిలిపివేత, సింధు బేసిన్‌లో భారత్ వేగంగా జలవిద్యుత్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తుండటం, వ్యవసాయం పూర్తిగా సింధు నదిపై ఆధారపడిన పాకిస్తాన్‌లో భయాందోళనలను మరింత పెంచుతోంది.

7, జులై 2026

₹80,000 లోపు బడ్జెట్‌లో బెస్ట్ గేమింగ్ లాప్‌టాప్స్
టెక్నాలజీ

₹80,000 లోపు బడ్జెట్‌లో బెస్ట్ గేమింగ్ లాప్‌టాప్స్

భారత మార్కెట్లో ₹80,000 లోపు బడ్జెట్‌లో RTX 3050 గ్రాఫిక్స్ కార్డ్, 144Hz డిస్‌ప్లే, 16GB ర్యామ్‌లతో Asus TUF Gaming A15, Acer Aspire 7, Lenovo LOQ, MSI Thin 15, Acer Aspire ALG వంటి గేమింగ్ లాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి 1080p సెట్టింగ్స్‌లో ఆధునిక గేమ్స్‌ను స్మూత్‌గా ఆడాలనుకునే గేమర్స్‌కు నిపుణులు ఉత్తమ ఎంపికలుగా సూచిస్తున్నారు.

7, జులై 2026

ప్లీజ్ మాకు సాయం చేయండి..  : భారత్‌ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీరీలు
అంతర్జాతీయం

ప్లీజ్ మాకు సాయం చేయండి.. : భారత్‌ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీరీలు

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీ్ర్(పీఓకే)లో భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ అణచివేతకు నిరసనగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. రోజురోజుకు ఈ ఉద్యమం తీవ్రమవుతోంది. 26 రోజులుగా ప్రజలు పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు.

7, జులై 2026

అవకాశాల కోసం అన్నింటికీ తలూపకండి… ‘కాదు’ చెప్పే ధైర్యం ఉండాలి: కాజల్‌
టాలీవుడ్

అవకాశాల కోసం అన్నింటికీ తలూపకండి… ‘కాదు’ చెప్పే ధైర్యం ఉండాలి: కాజల్‌

కాజల్‌ తన కొత్త చిత్రం ‘ది ఇండియా స్టోరీ’ కోసం చేసిన పరిశోధన వల్ల భారతదేశంలో ఆహార భద్రతపై తనకు అవగాహన పెరిగి, కుటుంబ జీవనశైలిలో మార్పులు వచ్చాయని తెలిపింది. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం అన్నింటికీ తలూపకుండా, అసౌకర్యం కలిగించే పాత్రలను తిరస్కరించే ధైర్యం ఉండాలని, ఆత్మగౌరవం, వ్యక్తిగత పరిమితులను కాపాడుకుంటూ కెరీర్‌ను నిర్మించుకోవాలని యువ నటీనటులకు సందేశం ఇచ్చింది.

5, జులై 2026

ఎనర్జీ డ్రింక్స్‌పై తప్పుడు లేబుల్స్‌: FSSAI నోటీసులు
బిజినెస్

ఎనర్జీ డ్రింక్స్‌పై తప్పుడు లేబుల్స్‌: FSSAI నోటీసులు

భారతదేశంలో విస్తృతంగా అమ్ముడవుతున్న Red Bull, PepsiCo, Sting, Campa, Hell Energy, Coca Cola వంటి ఆరు కంపెనీలకు తప్పుడు లేబులింగ్, ప్రమోషన్లపై FSSAI నోటీసులు జారీ చేసింది. ఎనర్జీ డ్రింక్స్‌కు ప్రత్యేక ప్రమాణాలు నోటిఫై చేయకపోయినా, ఆ పదాన్ని లేబుల్స్‌పై వాడుతూ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొంది. కంపెనీల వివరణల తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది.

3, జులై 2026

కరాచీ ఘటనపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్
అంతర్జాతీయం

కరాచీ ఘటనపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్

పాక్‌లోని కరాచీలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతీయ ఏజెంట్ల హస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారతదేశం తీవ్రంగా ఖండించింది.

29, జూన్ 2026

ఓపెన్‌ఏఐ ఇండియా ఎండీగా ప్రభ్‌జీత్‌ సింగ్‌
బిజినెస్

ఓపెన్‌ఏఐ ఇండియా ఎండీగా ప్రభ్‌జీత్‌ సింగ్‌

అమెరికా కృత్రిమ మేధ సంస్థ OpenAI, భారత కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు ఇండియా Managing Director‌గా ప్రభ్‌జీత్‌ సింగ్‌ను నియమించింది. సెప్టెంబర్‌ నుంచి బాధ్యతలు స్వీకరించే ఆయన వినియోగదారుల వృద్ధి, కంపెనీల ద్వారా ఏఐ సేవల వినియోగం, భాగస్వామ్యాలు, నియంత్రణ సంస్థలతో సమన్వయం వంటి విభాగాలను పర్యవేక్షిస్తారు. ఉబర్‌, McKinsey‌లో అనుభవం ఉన్న ప్రభ్‌జీత్‌ నియామకం భారత ఏఐ మార్కెట్‌లో OpenAI స్థాయిని పెంచుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

28, జూన్ 2026

ఆప్ఘనిస్తాన్‌లో భూకంపం.. జమ్ము కశ్మీర్ వరకు ప్రకంపనలు
అంతర్జాతీయం

ఆప్ఘనిస్తాన్‌లో భూకంపం.. జమ్ము కశ్మీర్ వరకు ప్రకంపనలు

ఆప్ఘనిస్తాన్‌లో శనివారం రాత్రి 5.7 తీవ్రతతో భూకంపం సంభవించగా, ప్రకంపనలు సరిహద్దు ప్రాంతాల నుంచి ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలకు, ముఖ్యంగా జమ్ము కశ్మీర్ వరకు నమోదయ్యాయి. కొన్నిచోట్ల భవనాలు స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు కానీ ఇప్పటివరకు పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు అధికారిక సమాచారం లేదు.

28, జూన్ 2026

భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని సనే తకైచి
అంతర్జాతీయం

భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని సనే తకైచి

జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ పర్యటనకు వస్తున్నారు. జూలై 1-3 తేదీల్లో భారతదేశంలో తొలి పర్యటనకు రానున్నారు. అయితే ముందుగా నిర్ణయించిన అస్సాం పర్యటనను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

24, జూన్ 2026

ఫోన్‌లో ఫుల్ 5G సిగ్నల్ కనిపిస్తున్నా నెట్ రాదా? కారణాలు ఇవే..
టెక్నాలజీ

ఫోన్‌లో ఫుల్ 5G సిగ్నల్ కనిపిస్తున్నా నెట్ రాదా? కారణాలు ఇవే..

ఫోన్‌లో ఫుల్ 5G సిగ్నల్ కనిపించినా నెట్ పనిచేయకపోవడానికి నెట్‌వర్క్ కంజెషన్, టెలికాం ఆపరేటర్ అకౌంట్ సెట్టింగ్స్ లోపాలు, డేటా లిమిట్ పూర్తవడం, తప్పు APN సెట్టింగ్స్, VPN లేదా కొన్ని యాప్‌ల బ్లాకింగ్ వంటి కారణాలు ఉంటాయి. ముందుగా ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్–ఆఫ్ చేయడం, ఫోన్ రీస్టార్ట్, VPN ఆఫ్ చేయడం, నెట్‌వర్క్ సెట్టింగ్స్ రీసెట్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్, APN తనిఖీ చేయాలి; సమస్య కొనసాగితే కస్టమర్ కేర్‌ను సంప్రదించడం ఉత్తమం.

23, జూన్ 2026

ఆధార్‌లో ఇమెయిల్ అప్‌డేట్‌కు కూడా ఉచిత సేవ
ఫీచర్ పేజీలు

ఆధార్‌లో ఇమెయిల్ అప్‌డేట్‌కు కూడా ఉచిత సేవ

జూలై 1 నుంచి mAadhaar యాప్ ద్వారా ఆధార్‌కు అనుసంధానమైన ఇమెయిల్ ఐడీని కూడా ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని UIDAI కల్పించింది. ఇప్పటి వరకు సేవా కేంద్రాల్లో రుసుము చెల్లించి చేయాల్సిన ఈ సేవ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉచితంగా లభించనుండగా, ఆధార్‌కు అనుసంధానమైన ఇమెయిల్, మొబైల్ నంబర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

22, జూన్ 2026

కిడ్నీ వ్యాధి: భారత్‌ ప్రపంచంలో రెండో స్థానం, ముందస్తు గుర్తింపే రక్షణ
ఆరోగ్యం

కిడ్నీ వ్యాధి: భారత్‌ ప్రపంచంలో రెండో స్థానం, ముందస్తు గుర్తింపే రక్షణ

భారత్‌లో కిడ్నీ వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతూ, ఎక్కువగా చివరి దశలోనే గుర్తించబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బాధితుల్లో భారత్ రెండో స్థానంలో ఉండగా, తెలంగాణలో దేశ సగటుతో పోలిస్తే కేసులు, మరణాలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్దానం ప్రాంతం వంటి హాట్‌స్పాట్‌లలో వేలాది మంది బాధపడుతుండగా, నిపుణులు క్రమం తప్పని పరీక్షలు, ఆరోగ్యకర జీవనశైలి, కఠిన నియంత్రణ చర్యలు అత్యవసరమని సూచిస్తున్నారు.

22, జూన్ 2026

దేశాన్ని కుదిపేసిన ‘రంగా–బిల్లా’ కేసు ఆధారంగా వెబ్ సిరీస్ ‘Raakh’
ఓటీటీ

దేశాన్ని కుదిపేసిన ‘రంగా–బిల్లా’ కేసు ఆధారంగా వెబ్ సిరీస్ ‘Raakh’

1978లో న్యూ ఢిల్లీలో జరిగిన గీతా, సంజయ్ చోప్రా అపహరణ–హత్య కేసు ఆధారంగా ‘Raakh’ వెబ్ సిరీస్ రూపొందుతోంది. దేశాన్ని కుదిపేసిన ఈ ‘రంగా–బిల్లా’ కేసు పిల్లల భద్రత, ప్రజా భద్రత, పోలీసింగ్, క్రిమినల్ న్యాయవ్యవస్థపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసి, ప్రజల దృష్టికోణాన్ని మార్చిన మలుపుగా నిలిచింది.

18, జూన్ 2026

హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
తెలంగాణ

హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీలో టెస్లా తన ఐదో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించి తాజా Model Y కార్లను ప్రదర్శనకు ఉంచింది. బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రత్యేక డెలివరీ, After-sales services కేంద్రాన్ని ఏర్పాటు చేసిన టెస్లా, రూ.50.89 లక్షల నుంచి ధరలు ప్రారంభమయ్యే కార్ల డెలివరీలను జూలై 2026 నుంచి ప్రారంభించనుంది. జూన్ 30లోపు బుకింగ్ చేసే కస్టమర్లకు ఉచిత హోమ్ ఛార్జింగ్ వాల్ కనెక్టర్ ఆఫర్‌తో నగర ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌కు కొత్త ఊపు రానుందని భావిస్తున్నారు.

18, జూన్ 2026

సీబీఎస్ఈ రీ-వెరిఫికేషన్ పిల్‌ ఢిల్లీ హైకోర్టు తిరస్కరణ
జాతీయం

సీబీఎస్ఈ రీ-వెరిఫికేషన్ పిల్‌ ఢిల్లీ హైకోర్టు తిరస్కరణ

సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ కోసం OSM పోర్టల్‌ను తక్షణం పునఃప్రారంభించాలంటూ NSUI దాఖలు చేసిన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ దశలో పోర్టల్ తెరిస్తే ఫలితాల ప్రక్రియ ఆలస్యం అవుతూ లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని కోర్టు పేర్కొంది. పోర్టల్ గడువులో పూర్తిస్థాయిలో పనిచేసిందని, ఎక్కువ మంది విద్యార్థులు విజయవంతంగా దరఖాస్తు చేశారని CBSE స్పష్టం చేసింది.

12, జూన్ 2026

భారత ఎండు మిర్చిపై చైనా నిషేధం…
వ్యవసాయం

భారత ఎండు మిర్చిపై చైనా నిషేధం…

చైనా ప్రభుత్వం భారత ఎండు మిర్చి దిగుమతులపై మిథామిడోపాస్ అనే హానికర రసాయనం ఆనవాళ్లను కారణంగా చూపుతూ నిషేధం విధించడంతో భారత ఎగుమతిదారులు, రైతులకు భారీ దెబ్బ తగిలింది. గత ఆర్థిక సంవత్సరంలో చైనాకు 2.36 లక్షల టన్నుల ఎండు మిర్చి ఎగుమతి కాగా, ప్రస్తుత ఆంక్షలతో గిట్టుబాటు ధరలు పడిపోవచ్చని, ప్రత్యామ్నాయ మార్కెట్లు, కఠిన నాణ్యతా నియంత్రణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

12, జూన్ 2026

6G లక్ష్యంగా భారత్‌.. కేంద్రం సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం
టెక్నాలజీ

6G లక్ష్యంగా భారత్‌.. కేంద్రం సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం

భారత్ 5G విస్తరణను పూర్తి చేసిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ 6G కోసం సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో విధాన రూపకల్పన, స్పెక్ట్రమ్ లైసెన్సింగ్, కృత్రిమ మేధస్సు వినియోగం, శాటిలైట్ కనెక్టివిటీ వంటి అంశాలపై చర్చలు జరపాలని భావిస్తున్నారు. 2030 నాటికి ప్రపంచ 6G మార్కెట్లో 10 శాతం వాటా సాధించడమే లక్ష్యంగా ఇండియా 6G పనిచేస్తోంది.

12, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters