బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#వేధింపుల

28 articles

బ్రిజ్ భూషణ్ సింగ్‌‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
క్రీడలు

బ్రిజ్ భూషణ్ సింగ్‌‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన కేసులో మాజీ బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు భారీ ఊరట లభించింది.

3, ఆగ 2026

సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
జాతీయం

సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

సహజీవనం అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సహజీవనంలో భాగస్వామిని వేధింపులకు గురి చేస్తే భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 498-ఏ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది.

3, ఆగ 2026

తల్లిదండ్రుల‌పై వేధింపులు – నంద్యాల కోర్టు యువ‌కుడికి జైలు శిక్ష
జిల్లా వార్తలు

తల్లిదండ్రుల‌పై వేధింపులు – నంద్యాల కోర్టు యువ‌కుడికి జైలు శిక్ష

నంద్యాల కోర్టు తల్లిదండ్రుల‌పై నిరంతరం వేధింపులకు పాల్పడిన బండి ఆత్మకూరు మండలం పార్నపల్లెకు చెందిన విజయవర్ధన్‌కు జైలు శిక్ష విధించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, ఆధారాలతో కోర్టులో హాజరుపరచగా, నిందితుడి దోషం నిర్ధారించబడింది. తల్లిదండ్రుల‌పై వేధింపుల కేసుల్లో జైలు శిక్షలు అరుదుగా ఉండే నేపథ్యంలో ఈ తీర్పు న్యాయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

31, జులై 2026

విద్యార్థులపై వేధింపులు ఆపాలి : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే
జాతీయం

విద్యార్థులపై వేధింపులు ఆపాలి : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే

జంతర్‌ మంతర్‌ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై వేధింపులు, పెల్లెట్‌ తుపాకుల వినియోగాన్ని తక్షణం ఆపాలని కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే డిమాండ్‌ చేశారు. విద్యార్థులు ఉగ్రవాదులు కాదని, వారి నిరసన హక్కు రాజ్యాంగబద్ధమని ఆయన పేర్కొంటూ, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని తన తల్లి అనితా దీప్కే కుటుంబంపై జరిగిన బెదిరింపులను ఉదాహరణగా ప్రస్తావించారు.

30, జులై 2026

కర్నూలులో విషాదం.. ఫైనాన్స్ వేధింపులు భరించలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం
నేరాలు

కర్నూలులో విషాదం.. ఫైనాన్స్ వేధింపులు భరించలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లాలో ఓ ఫైనాన్స్ సంస్థ వేధింపులు తట్టుకోలేక దంపతులు ఇద్దరు చిన్నారులతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

29, జులై 2026

గాంధీధామ్‌లో నేపాల్ మహిళ హత్య కలకలం
జాతీయం

గాంధీధామ్‌లో నేపాల్ మహిళ హత్య కలకలం

గుజరాత్‌లోని కచ్ జిల్లా గాంధీధామ్‌లో నేపాల్‌కు చెందిన హిందూ మహిళ సోనమ్ సునార్ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నేపాల్ నుంచి వచ్చిన సోనమ్, గాంధీధామ్‌లో నివసిస్తున్న సుల్తాన్ జుసాబ్ సుమ్రాను ప్రేమించి 2011లో వివాహం చేసుకుంది. వివాహం అనంతరం కొంతకాలం దంపతుల జీవితం సజావుగా సాగినప్పటికీ, తరువాత పరిస్థితులు మారాయి.

29, జులై 2026

పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
నేరాలు

పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

సహచర ట్రెనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదు నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

28, జులై 2026

ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌
నేరాలు

ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

27, జులై 2026

మణికొండలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. ఫ్యాకల్టీ వేధింపులపై సూసైడ్ నోట్ కలకలం
తెలంగాణ

మణికొండలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. ఫ్యాకల్టీ వేధింపులపై సూసైడ్ నోట్ కలకలం

హైదరాబాద్ మణికొండలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో బీటెక్ సెకండియర్ విద్యార్థిని శ్రేయ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో వాసవి ఇంజినీరింగ్ కాలేజీ ఫ్యాకల్టీ నిరంతర వేధింపులు, అవమానాలు భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనడంతో విద్యార్థి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

21, జులై 2026

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
నేరాలు

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన ఘటనలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడికి ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిస్తుంది.

20, జులై 2026

మద్యం వేధింపులు తట్టుకోలేక కొడుకును హతమార్చిన తల్లి
జిల్లా వార్తలు

మద్యం వేధింపులు తట్టుకోలేక కొడుకును హతమార్చిన తల్లి

అనంతపురం నగరంలో మద్యం వ్యసనంతో తల్లిదండ్రులను నిరంతరం వేధిస్తున్న సురేంద్ర ఆచారిని, ఆ వేధింపులు తట్టుకోలేక తల్లి సునీతమ్మ కత్తెరతో పొడిచి హతమార్చింది. సంఘటనపై మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, సునీతమ్మను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

15, జులై 2026

ప్రేమ వేధింపుల వివాదం: మాదాపూర్‌లో యువకుడి హత్య
నేరాలు

ప్రేమ వేధింపుల వివాదం: మాదాపూర్‌లో యువకుడి హత్య

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రేమ వేధింపుల వివాదం దారుణ హత్యకు దారితీసింది. మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫే ఎదుట భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కర్రలు, కత్తులతో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

15, జులై 2026

పల్నాడు జిల్లాలో విషాదం.. విగతజీవులుగా తల్లి, ఇద్దరు చిన్నారులు
నేరాలు

పల్నాడు జిల్లాలో విషాదం.. విగతజీవులుగా తల్లి, ఇద్దరు చిన్నారులు

కుటుంబ కలహాలు, అదనపు కట్నం వేధింపులు ఓ నిండు సంసారంలో ఘోర విషాదాన్ని నింపాయి. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో ఇంట్లో తల్లితో పాటు ఇద్దరు పసిపిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.

14, జులై 2026

‘నా చావుకు అతడే కారణం’.. మంచిర్యాల యువతి ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ కీలక ఆధారం
నేరాలు

‘నా చావుకు అతడే కారణం’.. మంచిర్యాల యువతి ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ కీలక ఆధారం

మంచిర్యాల జిల్లాలో జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన బీ ఫార్మసీ చదివిన గోషిక మాధవి (26) ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌లో Singareni ఉద్యోగి గోనె వెంకటేష్ వేధింపులే తన బలవన్మరణానికి కారణమని పేర్కొనడంతో, కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

14, జులై 2026

అందంగా లేవని వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
జిల్లా వార్తలు

అందంగా లేవని వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

బి.కోడూరు మండలంలోని ఐత్రంపేట గ్రామానికి చెందిన సిద్దు అనూష (24) భర్త తేలూరు సాయినాథ్‌రెడ్డి, అత్తమామలు, బంధువుల శారీరక, మానసిక వేధింపులు, రూపురేఖలు, ఆరోగ్యంపై అవమానకర వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 5న ఆత్మహత్యకు పాల్పడింది. అనూష తండ్రి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి, భర్త సాయినాథ్‌రెడ్డి, మామ వెంకట శేషారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపగా, మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

14, జులై 2026

అదనపు వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
జిల్లా వార్తలు

అదనపు వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అన్నమయ్య జిల్లా బి.కోడూరు మండలం ఐత్రంపేట గ్రామానికి చెందిన సిద్దు అనూష (24) అదనపు వరకట్న వేధింపులను తట్టుకోలేక ఇంట్లో ఒంటరిగా ఉండగా విష ద్రావకం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త పేరూరు సాయినాథ్‌రెడ్డి, అతని తల్లిదండ్రుల వరకట్న వేధింపులపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బి.కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

6, జులై 2026

ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై లైంగిక యాడ్స్‌ .. మెటాకు కేంద్రం నోటీసులు
నేరాలు

ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై లైంగిక యాడ్స్‌ .. మెటాకు కేంద్రం నోటీసులు

ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై లైంగిక కంటెంట్‌ను ప్రోత్సహించే యాడ్స్‌పై కేంద్రం తీవ్రంగా స్పందించి, మెటాకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. బీబీసీ కథనంలో టెలిగ్రామ్ అక్రమ ఛానళ్లకు లింకులు ఉన్నట్టు బయటపడగా, మెటా ఇప్పటికే 40 లక్షల ఖాతాలను తొలగించామని తెలిపింది. ఇదే సమయంలో వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ ఆన్‌లైన్ మోసాలకు దారి తీసే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తూ, చర్చలు పూర్తయ్యే వరకు ఆ ఫీచర్ అమలు చేయొద్దని ఆదేశించింది.

4, జులై 2026

ఏపీలో అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్
రాజకీయాలు

ఏపీలో అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదులపై పెరుగుతున్న దాడులు, వేధింపుల నేపథ్యంలో వారి భద్రత కోసం ప్రత్యేక అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పనకు కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘యువగళం’ హామీల అమలు భాగంగా ఈ చట్టంపై ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేశ్, మంత్రి ఫరూక్‌లు న్యాయవాదుల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ, ముసాయిదా సిద్ధమైన తర్వాత న్యాయవాదుల సంఘాల సూచనలు తీసుకుని తుది రూపం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

1, జులై 2026

ఫింగర్‌ ప్రింట్‌ విభాగం ఎస్‌ఐపై వరకట్నం వేధింపుల కేసు
జిల్లా వార్తలు

ఫింగర్‌ ప్రింట్‌ విభాగం ఎస్‌ఐపై వరకట్నం వేధింపుల కేసు

నంద్యాల జిల్లా ఫింగర్‌ ప్రింట్‌ విభాగం ఎస్‌ఐ ఇండ్ల భరత్‌కుమార్‌పై వరకట్నం వేధింపుల కేసు ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైంది. భార్య ప్రియాంక ఫిర్యాదు, పెద్దమనుషుల పంచాయతీలు, ఇరుపక్షాల వాంగ్మూలాలు, వరకట్నం డిమాండ్‌కు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉద్యోగంలో ఉన్న పోలీసు అధికారిపై ఇలాంటి కేసు నమోదవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

30, జూన్ 2026

డోన్‌లో వైయ‌స్‌ఆర్‌సీపీ బీఎల్ఏపై దాడి.. కలకలం
జిల్లా వార్తలు

డోన్‌లో వైయ‌స్‌ఆర్‌సీపీ బీఎల్ఏపై దాడి.. కలకలం

నంద్యాల జిల్లా డోన్ మండలం కనపకుంట గ్రామంలో వైయ‌స్‌ఆర్‌సీపీ బూత్ లెవల్ ఏజెంట్ చాకలి భరత్‌పై కులం పేరుతో దూషణలు, ఇంటిపై దాడి యత్నం జరగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో భరత్ కుమారుడు చాకలి వెంకటేష్ తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రజక సమాజం, వైయ‌స్‌ఆర్‌సీపీ రజక విభాగం నాయకులు డోన్ డీఎస్పీకి వినతిపత్రం అందజేసి నిందితులపై కఠిన చర్యలు, బాధితులకు న్యాయం కోరారు.

24, జూన్ 2026

తాడిపత్రిలో జేసీ వర్గీయుల అరాచకాలకు వ్యతిరేకంగా వైసీపీ పోరుబాట
జిల్లా వార్తలు

తాడిపత్రిలో జేసీ వర్గీయుల అరాచకాలకు వ్యతిరేకంగా వైసీపీ పోరుబాట

తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయుల అరాచకాలు, దౌర్జన్యాలకు నిరసనగా వైయస్ఆర్‌సీపీ ఈ నెల 26న గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్షకు పిలుపునిచ్చింది. తాడిపత్రిలో శాంతిభద్రతలు క్షీణించాయని, గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నం, ప్రభుత్వ ఆసుపత్రిపై దాడి వంటి ఘటనలపై ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

24, జూన్ 2026

పోలీస్ వేధింపులపై సీబీఐ దర్యాప్తు డిమాండ్
జిల్లా వార్తలు

పోలీస్ వేధింపులపై సీబీఐ దర్యాప్తు డిమాండ్

కర్నూలు జిల్లా బదెనేహళ్ గ్రామంలో మాల గంగమ్మ కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆమె మృతి పోలీసుల వేధింపుల వల్ల జరిగిందని ఆరోపించారు. గంగమ్మ కొడుకు ఆచూకీ కోసం కోర్టు మెట్లెక్కిన కుటుంబంపై పోలీసులు కక్ష సాధించారని, ఇటీవలి పోలీసు వేధింపుల మరణాలపై స్వతంత్ర సంస్థ, ముఖ్యంగా CBI ద్వారా సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

24, జూన్ 2026

పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు చర్యలు
జిల్లా వార్తలు

పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు చర్యలు

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం 2013లో అమల్లోకి వచ్చిన పోష్ యాక్ట్ అమలును కట్టుదిట్టం చేస్తోంది. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అంతర్గత, స్థానిక ఫిర్యాదుల కమిటీల ఏర్పాటు, అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేధింపులకు గురైన మహిళలు కార్యాలయ కమిటీ, She Box, 181, 112 ద్వారా ఫిర్యాదులు చేయాలని మహిళా సంఘాలు పిలుపునిస్తున్నాయి.

20, జూన్ 2026

సినిమాల్లో అవకాశాల పేరుతో..   యువ నటికీ క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌ వల
నేరాలు

సినిమాల్లో అవకాశాల పేరుతో.. యువ నటికీ క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌ వల

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో సినిమాల్లో అవకాశాల పేరుతో ఒక యువ నటి లైంగిక వేధింపులకు గురైన ఘటనపై క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదైంది. మంచి పాత్రలు, పెద్ద సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని నమ్మబలికి, పారితోషికం కూడా ఇవ్వకుండా చివరికి నిర్మాత కార్యాలయానికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని నటి ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, కాల్ వివరాలు, వైద్య నివేదికలు పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

15, జూన్ 2026

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
జాతీయం

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయని, బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని, దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై వాడుతున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇండియా బ్లాక్ నేతల ఢిల్లీ సమావేశంలో ఆయన దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ఎంఎస్ఎమ్ఈ సంక్షోభం, పరీక్షల వైఫల్యాలు, ఓటు హక్కు కోల్పోతున్న ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రతిపక్షం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

8, జూన్ 2026

కోలివింగ్ హాస్టల్‌లో యువతి ఆత్మహత్య … ప్రియుడు సాయి కుమార్ అరెస్ట్
తెలంగాణ

కోలివింగ్ హాస్టల్‌లో యువతి ఆత్మహత్య … ప్రియుడు సాయి కుమార్ అరెస్ట్

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎలైట్ కోలివింగ్ హాస్టల్‌లో నివసిస్తున్న మొల్లి దుర్గ ఐదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెపై ప్రియుడు, డెలివరీ ఎగ్జిక్యూటివ్ సాయి కుమార్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించగా, వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, సీసీ కెమెరా దృశ్యాలు, కాల్ డేటా తదితరాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

7, జూన్ 2026

కర్నూలులో వీఆర్వో ఆత్మహత్య.. జిల్లాలో కలకలం!
జిల్లా వార్తలు

కర్నూలులో వీఆర్వో ఆత్మహత్య.. జిల్లాలో కలకలం!

కర్నూలు వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో జిల్లాలో కలకలం రేగింది. ఆయన రాసినట్లు చెప్పబడుతున్న సూసైడ్ నోట్‌లో కొందరు రెవెన్యూ అధికారుల ఒత్తిడే కారణమై ఉన్నట్టు సమాచారం. మృతదేహంతో కలెక్టర్ కార్యాలయం ఎదుట కుటుంబసభ్యులు, ఉద్యోగులు ఆందోళనకు దిగగా, సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

6, జూన్ 2026

నీరజ్ దూబేపై దాడి.. త్విశా శర్మ కేసులో  ప్రధాన సాక్షి!
జాతీయం

నీరజ్ దూబేపై దాడి.. త్విశా శర్మ కేసులో ప్రధాన సాక్షి!

భోపాల్: నటి త్విశా శర్మ కేసులో కీలక సాక్షిగా ఉన్న నీరజ్ దూబేపై దాడి జరిగింది. నిందితుడు సమర్థ్ సింగ్ స్నేహితులు నీరజ్‌పై దాడి చేసినట్లు సమాచారం. మే 30న జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters