బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#భరోసా

25 articles

ప్రొద్దుటూరులో పేదలకు సీఎం ఆర్థిక భరోసా
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో పేదలకు సీఎం ఆర్థిక భరోసా

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పించే కార్యక్రమం కొనసాగుతోంది. 30వ విడతగా 53 మంది లబ్ధిదారులకు 52.62 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయగా, ఇప్పటి వరకు మొత్తం 1,355 మందికి సుమారు 11.87 కోట్ల రూపాయలు అందించారు. పేదలకు మెరుగైన వైద్యం, వైద్య ఖర్చుల భారం తగ్గించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు.

8, ఆగ 2026

రైతు హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబాటు: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
జిల్లా వార్తలు

రైతు హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబాటు: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఓడి చెరువు మండలంలో 2,237 మంది రైతులకు ఫోటోతో పాటు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసి, రైతు భూ హక్కులకు కూటమి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తోందని తెలిపారు. పుట్టపర్తిలో 5వ తరం ఫైటర్ జెట్ పరిశ్రమ, ఆమడ గూరు మండలంలో భారీ Reliance Solar ప్రాజెక్ట్, ఓడి చెరువులో మరో Solar ప్రాజెక్ట్ ద్వారా నియోజవర్గం పరిశ్రమల కేంద్రంగా, ఉపాధి హబ్‌గా మారే అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

6, ఆగ 2026

మంత్రులు వెనకబడిపోతున్నారు.. : ఏపీ కేబినెట్‌ భేటీలో సీఎం.. పలు కీలక నిర్ణయాలు
రాజకీయాలు

మంత్రులు వెనకబడిపోతున్నారు.. : ఏపీ కేబినెట్‌ భేటీలో సీఎం.. పలు కీలక నిర్ణయాలు

ఏపీ మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,120 పోస్టుల భర్తీకి సంబంధించి కేబినెట్ ఆమోదం కోసం వచ్చిన ప్రతిపాదనను మరోసారి అధ్యయనం చేయాలని ఆదేశించారు. సుమారు మూడు గంటలపాటు సమావేశం కొనసాగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

23, జులై 2026

ఆగస్టు 7 నుంచి ‘నేతన్న భరోసా’ పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

ఆగస్టు 7 నుంచి ‘నేతన్న భరోసా’ పథకం ప్రారంభం

ఆగస్టు 7 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ‘నేతన్న భరోసా’ పథకం ప్రారంభమవుతోంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కార్మికుల కుటుంబానికి రూ.25 వేల ప్రత్యక్ష ఆర్థికసాయం అందించనున్నారు. చేనేత రంగం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రూ.250 కోట్లు కేటాయించిన ఈ పథకం అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ లబ్ధిదారుల గుర్తింపు, జాబితా తయారీ పనులు ప్రభుత్వం చేపడుతోంది.

16, జులై 2026

సింగరేణిని కేసీఆర్ ఓటు బ్యాంకుగా చూశారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ

సింగరేణిని కేసీఆర్ ఓటు బ్యాంకుగా చూశారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సింగరేణిని అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ఆరోపించారు. సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్ర కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

13, జులై 2026

రైతు భరోసా నిధుల తుది విడత విడుదలకు సిద్ధం
తెలంగాణ

రైతు భరోసా నిధుల తుది విడత విడుదలకు సిద్ధం

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల తుది విడతగా రూ.1,009 కోట్లను ఈరోజు విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయంగా ఇప్పటివరకు మొత్తం 74 లక్షల మంది రైతులకు, 1.45 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి నిధులు చేరగా, సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఖాతాలకు కూడా త్వరలోనే నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

10, జులై 2026

ఉల్లి రైతులకు ఊరటగా కేంద్ర నిర్ణయం : కనీస మద్దతు ధర పెంపు
వ్యవసాయం

ఉల్లి రైతులకు ఊరటగా కేంద్ర నిర్ణయం : కనీస మద్దతు ధర పెంపు

ఉల్లి బఫర్ స్టాక్ కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను క్వింటాల్‌కు 13 శాతం పెంచి రూ.1,875 నుంచి రూ.2,125కు పెంచింది. ఈ సీజన్‌లో ఇది ఐదోసారి చేసిన పెంపు కాగా, ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో రైతులకు కొంత ఊరట కలిగించడంతో పాటు మార్కెట్ ధరలను సమతుల్యం చేయడంలో ఈ నిర్ణయం దోహదం చేస్తుందని రైతులు భావిస్తున్నారు.

4, జులై 2026

జూలై 1 నుంచి 7,792 మందికి కొత్త పింఛన్లు
ఆంధ్రప్రదేశ్

జూలై 1 నుంచి 7,792 మందికి కొత్త పింఛన్లు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను జూలై 1 నుంచి పంపిణీ చేయడానికి ప్రభుత్వం రూ. 2,711 కోట్లను విడుదల చేసి, మొత్తం 62,19,648 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించనుంది. అదనంగా స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా గుర్తించిన 7,792 మందికి నెలకు రూ. 4,000 చొప్పున పింఛన్లు ఇవ్వడానికి రూ. 3.12 కోట్లను కేటాయించగా, మరో రెండు నెలల్లో వితంతు పింఛన్లు కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

29, జూన్ 2026

వెలిగొండ ప్రాజెక్టు రైతులకు భరోసా: చంద్రబాబు
రాజకీయాలు

వెలిగొండ ప్రాజెక్టు రైతులకు భరోసా: చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులు, రైతులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు, పునరావాసం ప్రక్రియకు వేగం చేకూర్చేందుకు ఒక్క రోజులోనే 2,351 మందికి రూ.300 కోట్ల ఆర్ అండ్ ఆర్ నిధులు అందజేశారు. గత ప్రభుత్వ కాలంలో ఎదుర్కొన్న వేధింపులను గుర్తుచేసుకున్న నిర్వాసితులు, ఇప్పుడు తమ పిల్లల చదువు, భవిష్యత్తుపై భరోసా కలిగిందని భావిస్తూ, ఎవరికీ నష్టం లేకుండా న్యాయం చేస్తానని ఇచ్చిన ముఖ్యమంత్రి హామీపై నమ్మకం వ్యక్తం చేశారు.

28, జూన్ 2026

సాత్విక్ సాయిరాజ్‌ను అభినందించిన నారా లోకేష్
క్రీడలు

సాత్విక్ సాయిరాజ్‌ను అభినందించిన నారా లోకేష్

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్‌ను ఉండవల్లి నివాసంలో కలిసి నారా లోకేష్ అభినందించి, అంతర్జాతీయ వేదికపై మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సాత్విక్ ప్రదర్శన ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమై, యువతకు ప్రేరణగా నిలుస్తోందని రాజకీయ, క్రీడా వర్గాలు అభిప్రాయపడుతూ, రాష్ట్రంలో క్రీడా వసతుల అభివృద్ధి అవసరాన్ని రేఖాంకితం చేశాయి.

25, జూన్ 2026

11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం
ఆంధ్రప్రదేశ్

11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ 2004కు ముందు సేవలో చేరిన సుమారు 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పెట్టుబడుల పెంపు, ఉపాధి అవకాశాల సృష్టి, పరిశ్రమలు, ఐటీ, పర్యాటక రంగాల అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి, సుమారు 34 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

24, జూన్ 2026

భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం – తహసీల్దార్ భరోసా
జిల్లా వార్తలు

భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం – తహసీల్దార్ భరోసా

వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలంలో భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ కృషి చేస్తుందని తహసీల్దార్ రవీంద్ర రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తెలిపారు. భూ హక్కుల పత్రాలు, సరిహద్దు వివాదాలు, వారసత్వ హక్కులు, రికార్డు సవరణలపై వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సిబ్బందికి ఆదేశించారు.

22, జూన్ 2026

రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం.. ప్రతి విషయంలోనూ మోసమే
రాజకీయాలు

రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం.. ప్రతి విషయంలోనూ మోసమే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై ఉన్న ప్రేమ కేవలం బూటకమని, ఆయన పాలనలో రైతులకు మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే మిగిలాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

21, జూన్ 2026

‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ వివరాలు
ఆంధ్రప్రదేశ్

‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ వివరాలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ కింద అర్హులైన గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మొదటి కాన్పు సమయంలో రెండు విడతలుగా మొత్తం రూ.5,000, రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే ఒకే విడతలో రూ.6,000 నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. 19 ఏళ్లు పైబడిన, వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న మహిళలు అవసరమైన పత్రాలతో అంగన్‌వాడీ, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా బిడ్డ పుట్టిన 270 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి.

21, జూన్ 2026

‘నేతన్నకు భరోసా’త్వరలో..
రాజకీయాలు

‘నేతన్నకు భరోసా’త్వరలో..

రాష్ట్రంలో  చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే ‘నేతన్నకు భరోసా’ పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.25వేల చొప్పున అందిస్తామన్నారు.

21, జూన్ 2026

రేపే ఫాదర్స్ డే: కుటుంబ బాధ్యతలు మోసే నాన్న కోసం ప్రత్యేక రోజు:
ఆదివారం మాగజైన్

రేపే ఫాదర్స్ డే: కుటుంబ బాధ్యతలు మోసే నాన్న కోసం ప్రత్యేక రోజు:

ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం జరుపుకునే ఫాదర్స్ డే సందర్భంగా తండ్రుల ప్రేమ, త్యాగాలు, కుటుంబానికి ఇచ్చే అండను ప్రపంచవ్యాప్తంగా స్మరించుకుంటారు. తండ్రి మొదటి హీరో, రక్షకుడు, గురువు, స్నేహితుడిగా పిల్లల జీవితంలో కీలక పాత్ర పోషిస్తాడనే భావనతో, ఈ రోజున ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరచాలని కుటుంబ సలహాదారులు సూచిస్తున్నారు.

20, జూన్ 2026

రైతుల అభివృద్ధి, కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే పార్థసారథి
జిల్లా వార్తలు

రైతుల అభివృద్ధి, కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే పార్థసారథి

కర్నూలు జిల్లా దాణాపురం గ్రామంలో జరిగిన వ్యవసాయ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొని, రైతులతో కలిసి విత్తనాలు నాటి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతుల అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, సూపర్ సిక్స్ హామీలలో భాగంగా పెట్టుబడి సాయం, మద్దతు ధర, పంటల కొనుగోలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

18, జూన్ 2026

ఈ నెల 30న రైతు భరోసా నిధుల విడుదలకు సిద్ధం
తెలంగాణ

ఈ నెల 30న రైతు భరోసా నిధుల విడుదలకు సిద్ధం

ఈ నెల 30న వానాకాలం పంటల కోసం రైతు భరోసా నిధులను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా మధిరలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులను నేరుగా జమ చేయనున్నారు. పంట సాగు ప్రారంభ దశలోనే నగదు అందించి అప్పుల భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు తెలిపారు.

18, జూన్ 2026

చిత్తూరు పరిసరాల్లో జోరుగా జూదం
జిల్లా వార్తలు

చిత్తూరు పరిసరాల్లో జోరుగా జూదం

చిత్తూరు నగర శివారు, సమీప మండలాల్లో జూద స్థావరాలు వేగంగా పెరుగుతున్నాయి. నిర్వాహకులు వాహనాలు, నగదుకు భరోసా ఇస్తూ సుదూర ప్రాంతాల నుంచి జూదరులను ఆకర్షిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జూదం జరుగుతోందని సమాచారం ఉన్నా పోలీసులు పెద్దగా స్పందించడంలేదని విమర్శలు వస్తుండగా, ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు.

18, జూన్ 2026

అభిమాని కోరిక నెరవేర్చిన పవన్‌ కల్యాణ్‌ : కుటుంబానికి భరోసా!
తెలంగాణ

అభిమాని కోరిక నెరవేర్చిన పవన్‌ కల్యాణ్‌ : కుటుంబానికి భరోసా!

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బుధవారం ఉదయం హనుమకొండ విచ్చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్‌(17) అనే బాలుడిని పరామర్శించారు.

17, జూన్ 2026

గోల్డ్ లోన్‌ బారం?.. బంగారం వేలం కాకుండా కాపాడే సులభమైన మార్గాలు
బిజినెస్

గోల్డ్ లోన్‌ బారం?.. బంగారం వేలం కాకుండా కాపాడే సులభమైన మార్గాలు

గోల్డ్ లోన్ తీసుకునే ముందు అధిక వడ్డీ వసూలు చేసే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకన్నా ప్రభుత్వ రంగ బ్యాంకులు, సహకార బ్యాంకులను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద మొత్తం కోసం ఎదురుచూడకుండా పాక్షిక చెల్లింపులు చేస్తూ, కనీసం వడ్డీని గడువులోపు చెల్లించడం, రోజువారీ చిన్న పొదుపులను లోన్‌కు మళ్లించడం, ఆడంబర ఖర్చులను తగ్గించడం ద్వారా బంగారం వేలానికి వెళ్లకుండా కాపాడుకోవచ్చని వారు చెబుతున్నారు.

16, జూన్ 2026

చిన్నారుల చూపునకు విటమిన్‌ ఎ ద్రవంతో భరోసా
జిల్లా వార్తలు

చిన్నారుల చూపునకు విటమిన్‌ ఎ ద్రవంతో భరోసా

వైఎస్సార్‌ కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలల తరబడి లభ్యం కాని విటమిన్‌ ఎ ద్రవం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. జిల్లాకు 2,830 సీసాలు చేరడంతో ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేస్తుండగా, 9 నెలల నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా తాపించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు సమీప ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకాల రోజుల్లో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా డీఐఓ జె.ప్రవీణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

13, జూన్ 2026

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ : పరిష్కారానికి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ : పరిష్కారానికి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భూ వివాదాలు, పింఛన్లు, గృహాలు, విద్య, ఆరోగ్యం, రహదారులు, తాగునీటి సమస్యలు వంటి అంశాలపై వచ్చిన వినతులను విభాగాల వారీగా వర్గీకరించి, ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

6, జూన్ 2026

బీపీటీ సోనాతో  ఎకరాకు 40–45 బస్తాలు… విత్తన వరితో అదనపు ఆదాయం
జిల్లా వార్తలు

బీపీటీ సోనాతో ఎకరాకు 40–45 బస్తాలు… విత్తన వరితో అదనపు ఆదాయం

కణేకల్లు మండలంలో సుమారు 200 మంది రైతులు బాపట్ల జిల్లా జంగమేశ్వరపురం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ‘బీపీటీ సోనా 5204’ మూల విత్తనాన్ని కొనుగోలు చేసి విత్తన వరి సాగు చేసి మంచి లాభాలు పొందుతున్నారు. సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యం ఇస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించడంతో ఎకరాకు 40–45 బస్తాల దిగుబడి వస్తుండగా, ప్రతి 75 కిలోల సంచిని రూ.2500కి అమ్ముకుని సాధారణ వరితో పోలిస్తే ఎక్కువ ఆదాయం పొందుతూ ఇతర మండలాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

6, జూన్ 2026

ఇంధన పోదుపు అందరి భాద్యత : కలెక్టర్
జిల్లా వార్తలు

ఇంధన పోదుపు అందరి భాద్యత : కలెక్టర్

పుట్టపర్తి : ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన ఎలక్ట్రికల్‌ బైక్‌పై ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరయ్యారు.

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters