బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పాకిస్థాన్‌

32 articles

వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన పాకిస్థాన్‌
క్రీడలు

వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన పాకిస్థాన్‌

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్‌ వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ శతకంతో పాక్‌ 43 పరుగుల ఆధిక్యం సాధించగా, సాజిద్‌ ఖాన్‌, అలీ ఉస్మాన్‌ తలా నాలుగు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 117 పరుగులకు ఆలౌట్‌ చేశారు. 75 పరుగుల లక్ష్యాన్ని షఫీక్‌, బాబర్‌ అజామ్‌ అజేయ ఇన్నింగ్స్‌తో సులభంగా ఛేదించగా, షఫీక్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

6, ఆగ 2026

పాకిస్థాన్‌లో LeT ఉగ్రవాదుల వరుస హత్యలు… 30 మందికి పైగా మృతి అంగీకరించిన రిజ్వాన్ హనీఫ్
జాతీయం

పాకిస్థాన్‌లో LeT ఉగ్రవాదుల వరుస హత్యలు… 30 మందికి పైగా మృతి అంగీకరించిన రిజ్వాన్ హనీఫ్

పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తొయిబా’ (LeT) అంతర్గత వర్గాల నుంచి కీలక సమాచారం బయటపడింది. గత నాలుగేళ్లలో, అంటే 2020 నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్‌లోని వివిధ ప్రధాన నగరాల్లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని లష్కరే తొయిబా సీనియర్ ఆపరేటివ్ రిజ్వాన్ హనీఫ్ బహిరంగంగా అంగీకరించాడు.

5, ఆగ 2026

అమెరికా–ఇరాన్ చర్చల్లో గల్ఫ్ దేశాల ప్రాధాన్యం, పాకిస్థాన్‌కు దౌత్యపరమైన షాక్
అంతర్జాతీయం

అమెరికా–ఇరాన్ చర్చల్లో గల్ఫ్ దేశాల ప్రాధాన్యం, పాకిస్థాన్‌కు దౌత్యపరమైన షాక్

అమెరికా–ఇరాన్ చర్చల పునఃప్రారంభంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ కీలక మధ్యవర్తులుగా ఎదుగుతుండగా, పాకిస్థాన్ పాత్రపై అనుమానాలు పెరుగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షల సడలింపుపై చర్చలు కొనసాగుతున్న ఈ సమయంలో ట్రంప్ ప్రసంగంలో పాకిస్థాన్ పేరు లేకపోవడం ఆ దేశానికి దౌత్యపరమైన ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

5, ఆగ 2026

స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రకటించిన బలూచిస్థాన్‌
అంతర్జాతీయం

స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రకటించిన బలూచిస్థాన్‌

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రాంతానికి చెందిన ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్‌’ ఉద్యమం ఆగస్టు 11ను స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలు ఈ రోజున స్వతంత్ర బలూచిస్థాన్‌ జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చింది. 1947 ఆగస్టు 11న ‘కలాత్’ సంస్థానం స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న చారిత్రక సంఘటనను ఆధారంగా తీసుకుని, పాకిస్థాన్‌ ఆక్రమణ, మైనార్టీలపై దాడులు, ప్రాంతీయ అస్థిరతకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని అంతర్జాతీయ స్థాయిలో బలపరచాలని బలూచ్ నాయకులు ప్రయత్నిస్తున్నారు.

5, ఆగ 2026

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?
జాతీయం

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?

పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమిమ్ మండల్ అనే ఉగ్రవాద అనుమానితుడిని తూర్పు బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు.

2, ఆగ 2026

ఉగ్రకుట్ర భగ్నం.. జైషే మహమ్మద్ కీలక పాత్రధారి అరెస్ట్
జాతీయం

ఉగ్రకుట్ర భగ్నం.. జైషే మహమ్మద్ కీలక పాత్రధారి అరెస్ట్

పశ్చిమ బెంగాల్ పోలీసు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఇటీవలే అరెస్టైన జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ హమీమ్ మోండల్ స్నేహితురాలు అర్పిత సర్కార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

1, ఆగ 2026

భారత ప్రధాని మోడీకి పాకిస్థాన్ ఆహ్వానం?
అంతర్జాతీయం

భారత ప్రధాని మోడీకి పాకిస్థాన్ ఆహ్వానం?

2027లో ఇస్లామాబాద్‌లో జరగనున్న SCO శిఖరాగ్ర సమావేశానికి సభ్యదేశాలన్నింటికీ ఆహ్వానాలు పంపాల్సిన నిబంధనల ప్రకారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆహ్వానం పంపనున్నట్లు పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ వెల్లడించింది. మనీలాలో ఆసియాన్‌ సమావేశాల సందర్భంగా భారత–పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రుల ద్వైపాక్షిక భేటీపై ఇప్పటివరకు భారత్‌ నుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదని ఆ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.

31, జులై 2026

పీఓకే నిరసనకారులు భారత్‌ వంటి శత్రువులే.. వారిని చంపడం తప్పులేదు..: పాక్‌ మంత్రి
అంతర్జాతీయం

పీఓకే నిరసనకారులు భారత్‌ వంటి శత్రువులే.. వారిని చంపడం తప్పులేదు..: పాక్‌ మంత్రి

పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మరోసారి భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన చేసేవారు భారత్‌ వంటి శత్రువులేనని ప్రేలాపనలు చేశారు.

29, జులై 2026

వెస్టిండీస్ ఘన విజయం..  పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్
క్రీడలు

వెస్టిండీస్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్

టరౌబాలో జరిగిన తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ పాకిస్థాన్‌పై 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జస్టిన్ గ్రీవ్స్, జేడెన్ సీల్స్ బౌలింగ్ మెరుపులతో పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే కుప్పకూలింది. ఈ ఫలితంతో WTC 2025-27 పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ 8వ స్థానానికి ఎగబాకగా, పాకిస్థాన్ చివరి స్థానానికి జారిపోగా, దాని అవకాశాలు దాదాపు చీకట్లో కలిసినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

29, జులై 2026

జస్టిన్ గ్రీవ్స్ చారిత్రాత్మక స్పెల్‌.. పాకిస్థాన్‌పై వెస్టిండీస్‌కు కీలక ఆధిక్యం
క్రీడలు

జస్టిన్ గ్రీవ్స్ చారిత్రాత్మక స్పెల్‌.. పాకిస్థాన్‌పై వెస్టిండీస్‌కు కీలక ఆధిక్యం

పాకిస్థాన్‌పై జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ పేసర్ జస్టిన్ గ్రీవ్స్ చారిత్రాత్మక స్పెల్‌తో మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. వరుసగా ఐదు మెయిడెన్ ఓవర్లలో ఐదు వికెట్లు తీసి, టెస్టు క్రికెట్‌లో ఒక్క పరుగు ఇవ్వకుండా ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 155 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతుండగా, నాలుగో రోజు ఆటలో బ్యాటర్ల ప్రదర్శనపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.

28, జులై 2026

ఇరాన్‌పై దాడులు.. చర్చలపై ఆసక్తి లేదన్న ట్రంప్
అంతర్జాతీయం

ఇరాన్‌పై దాడులు.. చర్చలపై ఆసక్తి లేదన్న ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా సైన్యం వరుసగా 11వ రాత్రి కూడా వైమానిక దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరాటం కోసం ఇరు దేశాలు దాడులకు దిగుతున్నాయి.

22, జులై 2026

సింధు జలాల మధ్యవర్తిత్వ ఖర్చులన్నీ పాకిస్థాన్ భారం
అంతర్జాతీయం

సింధు జలాల మధ్యవర్తిత్వ ఖర్చులన్నీ పాకిస్థాన్ భారం

సింధు జలాల ఒప్పందంపై పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో కొనసాగుతున్న మధ్యవర్తిత్వ విచారణలో భారత్ పాల్గొనకపోవడంతో, ఇప్పటివరకు 6 లక్షల డాలర్లకు పైగా సహా మొత్తం ఖర్చును పాకిస్థానే భరిస్తోంది. కిషన్‌గంగా, రాట్లే ప్రాజెక్టులు ఒప్పందానికి విరుద్ధమని పాకిస్థాన్ వాదిస్తుండగా, న్యూట్రల్ ఎక్స్‌పర్ట్ ద్వారానే సాంకేతిక అంశాలు పరిశీలించాలనీ, ఈ ట్రైబ్యునల్ చట్టవిరుద్ధమనీ భారత్ స్పష్టం చేసింది.

17, జులై 2026

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్‌
జాతీయం

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్‌

దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS) భగ్నం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైష్‌ ఏ మహ్మద్‌ (JeM)తో సంబంధాలు ఉన్న ఐదుగురిని అరెస్ట్‌ చేసింది.

17, జులై 2026

పాకిస్థాన్ బన్ను జిల్లాలో ఉగ్రవాదుల దాడి కలకలం
అంతర్జాతీయం

పాకిస్థాన్ బన్ను జిల్లాలో ఉగ్రవాదుల దాడి కలకలం

పాకిస్థాన్ కైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్ను జిల్లా మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 14 మంది పోలీసులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్ ప్రకటించగా, ఘటన తర్వాత ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొని, భద్రతా దళాలు ముట్టడి చేసి శోధన చర్యలను కఠినతరం చేశాయి.

16, జులై 2026

పాకిస్థాన్‌లో బోయింగ్‌ 737 కార్గో విమానం మిస్సింగ్‌
అంతర్జాతీయం

పాకిస్థాన్‌లో బోయింగ్‌ 737 కార్గో విమానం మిస్సింగ్‌

యూఏఈలోని షార్జా నుంచి కరాచీకి వస్తున్నKE2 ఎయిర్వేస్ కు చెందిన బోయింగ్‌ 737 కార్గో విమానం పాకిస్థాన్‌ గగనతలంలో రాడార్‌ నుంచి అదృశ్యమైంది. బలోచిస్థాన్‌ ఒర్మారా సమీపంలో అరేబియా సముద్రం పైభాగంలో చివరిసారిగా గుర్తించిన ఈ విమానంలో ఉన్న ఐదుగురు సిబ్బంది ఆచూకీ కోసం నౌకలు, హెలికాప్టర్లు సహా విస్తృత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

8, జులై 2026

ఇండోనేసియాకు భారత ‘బ్రహ్మాస్త్రం’ బ్రహ్మోస్‌.. మోదీ పర్యటనలో కీలక రక్షణ ఒప్పందం
అంతర్జాతీయం

ఇండోనేసియాకు భారత ‘బ్రహ్మాస్త్రం’ బ్రహ్మోస్‌.. మోదీ పర్యటనలో కీలక రక్షణ ఒప్పందం

భారత్‌ రూపొందించిన బ్రహ్మోస్‌, అస్త్ర క్షిపణుల కొనుగోలుకు ఇండోనేసియా అంగీకరించగా, జకార్తాలో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో సమావేశంలో కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. క్రిటికల్‌ మినరల్స్‌, సముద్ర భద్రత, సబాంగ్‌ పోర్ట్‌ అభివృద్ధి, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల తయారీ వంటి రంగాల్లో సహకారానికి ఒప్పందాలు కుదిరి, ద్వైపాక్షిక సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశించాయి.

7, జులై 2026

పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై దాడి.. :  30 మంది భద్రతా సిబ్బంది హతం..
అంతర్జాతీయం

పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై దాడి.. : 30 మంది భద్రతా సిబ్బంది హతం..

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. గ్వాదర్ జిల్లాలోని జివానీ ప్రాంతం పాన్వాన్‌లో ఉన్న పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై శుక్రవారం సాయంత్రం దాడికి పాల్పడినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించింది.

4, జులై 2026

సిందూర్‌లో అమరుల జాబితా.. : అధికారికంగా ప్రకటించిన కేంద్రం
జాతీయం

సిందూర్‌లో అమరుల జాబితా.. : అధికారికంగా ప్రకటించిన కేంద్రం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై జరిపిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో మన దేశం కొంతమంది వీరజవాన్లను కోల్పోయింది. దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన ఆ అమరవీరుల పేర్లను కేంద్రం ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది.

26, జూన్ 2026

మహిళల ప్రపంచ కప్‌లో భారత్‌కు కీలక దశ
క్రీడలు

మహిళల ప్రపంచ కప్‌లో భారత్‌కు కీలక దశ

మహిళల ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత టీమ్‌ఇండియాకు బంగ్లాదేశ్‌పై గురువారం జరిగే మ్యాచ్‌ కీలకంగా మారింది. గ్రూప్‌ Aలో భారత్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లకు చెరో 4 పాయింట్లు ఉన్నప్పటికీ, నెట్‌ రన్‌రేట్‌లో భారత్‌ ముందంజలో ఉంది. బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాపై మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే సెమీఫైనల్‌ దాదాపు ఖాయం కానుండగా, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌ మూడు విభాగాల్లోనూ భారత్‌ మెరుగైన ప్రదర్శన అవసరం ఉంది.

24, జూన్ 2026

పాక్‌పై భారత్‌ మరోసారి ఆధిపత్యం
క్రీడలు

పాక్‌పై భారత్‌ మరోసారి ఆధిపత్యం

లండన్‌లో జరిగిన FIH Pro Hockey League మ్యాచ్‌లో భారత్‌ 4-3 తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించి దశాబ్దంగా కొనసాగుతున్న ఆధిపత్యాన్ని మరింత బలపరచుకుంది. ప్రారంభంలో వెనుకబడిన టీమ్‌ ఇండియా రెండో క్వార్టర్‌ నుంచి దాడులను వేగవంతం చేసి వరుస గోల్స్‌తో 4-1 ఆధిక్యంలోకి వెళ్లి, చివర్లో పాకిస్థాన్‌ ప్రతిఘటనను తట్టుకుని గెలుపును సొంతం చేసుకుంది.

24, జూన్ 2026

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు అసలు సవాల్
క్రికెట్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు అసలు సవాల్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్–1లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌కు ఆదివారం మాంచెస్టర్‌లో దక్షిణాఫ్రికా జట్టుతో మ్యాచ్ అసలు సవాలుగా మారింది. ఆస్ట్రేలియా ముందంజ ఖాయమనే నేపథ్యంలో, భారత్–దక్షిణాఫ్రికా పోరులో గెలిచే జట్టే రెండో సెమీఫైనల్‌ బెర్త్‌కు ప్రధాన పోటీదారిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

21, జూన్ 2026

మహిళల టీ20లో   పాకిస్థాన్‌కు వరుసగా మూడో ఓటమి
క్రీడలు

మహిళల టీ20లో పాకిస్థాన్‌కు వరుసగా మూడో ఓటమి

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో పాకిస్థాన్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. సౌథాంప్టన్‌లో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 23 పరుగుల తేడాతో గెలిచి పాకిస్థాన్‌ పరాజయ పరంపరను కొనసాగించింది. షోర్నా అక్తర్‌, నిగర్‌ సుల్తానా రాణించగా, నహిదా అక్తర్‌, షంజిదా అక్తర్‌ మేఘ్లా చెరో మూడు వికెట్లు తీసి పాకిస్థాన్‌ మధ్యవరుసను కూలదోసి, ఆ జట్టు సెమీఫైనల్‌ ఆశలను క్లిష్టంలోకి నెట్టారు.

21, జూన్ 2026

దక్షిణాఫ్రికా బోణీ.. పాకిస్థాన్‌పై కీలక విజయం
క్రికెట్

దక్షిణాఫ్రికా బోణీ.. పాకిస్థాన్‌పై కీలక విజయం

బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌పై 2 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది. ఫాతిమా సనా అజేయ 55, 3 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసినా, అనె డెర్క్‌సన్‌ 52, నదైన్‌ డిక్లెర్క్‌ అజేయ 37 పరుగులతో సఫారీ జట్టును గెలిపించారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా గ్రూప్‌–1లో అవకాశాలను సజీవంగా ఉంచుకోగా, పాకిస్థాన్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది.

19, జూన్ 2026

బంగాళాఖాతంపై పాక్‌ కన్ను..
జాతీయం

బంగాళాఖాతంపై పాక్‌ కన్ను..

పాకిస్థాన్‌ నేవీ చైనా నుంచి హంగోర్‌ శ్రేణి జలాంతర్గాములను తీసుకుని, వాటిని బంగాళాఖాతంలో మోహరించే యోచనలో ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 1971 యుద్ధం తర్వాత ఆ ప్రాంతం నుంచి దూరంగా ఉన్న పాక్‌ ఇప్పుడు కొత్త సబ్‌మెరైన్లతో అరేబియా సముద్రాన్ని దాటి తన సామర్థ్యాన్ని విస్తరించాలనుకుంటుండగా, వ్యూహాత్మకంగా కీలకమైన బంగాళాఖాతంలో ఈ కదలికలు భారత్‌కు చికాకులు తెచ్చే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

18, జూన్ 2026

నెదర్లాండ్స్‌పై రెండో పోరు.. భారీ విజయమే లక్ష్యం
క్రికెట్

నెదర్లాండ్స్‌పై రెండో పోరు.. భారీ విజయమే లక్ష్యం

మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించిన భారత జట్టు, రెండో గ్రూప్–1 మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను భారీ తేడాతో ఓడించాలనే లక్ష్యంతో సిద్ధమవుతోంది. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో లోపాలు ఉన్నప్పటికీ బౌలింగ్‌ బలంగా ఉండటంతో, ఈ మ్యాచ్‌లో నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుని దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో కీలక పోరులకు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని జట్టు భావిస్తోంది.

17, జూన్ 2026

పాక్‌పై దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్
క్రీడలు

పాక్‌పై దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియా పాకిస్థాన్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది విషయం తెలిసిందే. కేవలం 10 పరుగులకే 5 వికెట్లు తీసిన దీప్తి శర్మ, మహిళల టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా (166 వికెట్లు) కొత్త రికార్డు నెలకొల్పింది. 36 పరుగులతో మెరిసిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, మహిళల టీ20 ప్రపంచ కప్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా (732 పరుగులు) నిలిచింది.

15, జూన్ 2026

స్పిన్‌తో పాక్ ను చిత్తుచేశారు
క్రీడలు

స్పిన్‌తో పాక్ ను చిత్తుచేశారు

మాంచెస్టర్‌లో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ పాకిస్థాన్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, రిచా ఘోష్‌ రాణించగా, పాకిస్థాన్‌ 171 లక్ష్యానికి దూరంగా 106 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ 5 వికెట్లతో కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శన చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకోగా, హర్మన్‌ప్రీత్‌, మంధానలు పలు రికార్డులు తిరగరాశారు.

15, జూన్ 2026

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం..
క్రికెట్

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం..

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌–పాకిస్థాన్‌ తొలి మ్యాచ్‌పై హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ స్పందిస్తూ, తమ దృష్టి పూర్తిగా ఆటపైనే ఉందని, కరచాలనం వంటి ఇతర అంశాలపై చర్చించాలనే ఉద్దేశం లేదని తెలిపింది. భారత్‌–పాకిస్థాన్‌ మ్యాచ్‌ కావడంతో ఒత్తిడి సహజమేనని అంగీకరించిన ఆమె, ఇలాంటి పెద్ద మ్యాచ్‌లో ఆడే అదృష్టం దక్కిందని, శాతవంతు కృషితో విజయం కోసం పోరాడతామని చెప్పింది.

14, జూన్ 2026

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026: పాకిస్థాన్‌పై ఘన ఆరంభం లక్ష్యంగా టీమ్‌ ఇండియా
క్రికెట్

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026: పాకిస్థాన్‌పై ఘన ఆరంభం లక్ష్యంగా టీమ్‌ ఇండియా

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌ తన తొలి మ్యాచ్‌ను నేడు బర్మింగ్‌హామ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతూ, గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ విజయానంతరం ఇప్పుడు టీ20 కిరీటంపై దృష్టి సారించింది. స్మృతి, షెఫాలి, దీప్తి, రేణుకలతో బలమైన భారత్‌కు, స్పిన్‌ బౌలింగ్‌ బలంగా ఉన్న పాకిస్థాన్‌ సవాల్‌గా నిలవనుంది.

14, జూన్ 2026

పాక్‌పై తొలి మ్యాచ్‌ నుంచే నిర్భయంగా ఆడతాం: హర్మన్‌ప్రీత్
క్రికెట్

పాక్‌పై తొలి మ్యాచ్‌ నుంచే నిర్భయంగా ఆడతాం: హర్మన్‌ప్రీత్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో జూన్‌ 14న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైందని కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. వార్మప్‌ మ్యాచ్‌ల్లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకుంటూ, బర్మింగ్‌హామ్‌లో జరిగే ఈ హై వోల్టేజ్‌ పోరులో నిర్భయంగా, దూకుడుగా ఆడి విజయం సాధించడం ద్వారా తొలి టైటిల్‌ దిశగా బలమైన ఆరంభం చేయాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

11, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters