బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సుప్రీంకోర్టు

37 articles

జాతీయ క్రీడా పురస్కారాలు 2025: ఖేల్‌రత్న ఖాళీగా.. 17 మందికి అర్జున అవార్డులు
క్రీడలు

జాతీయ క్రీడా పురస్కారాలు 2025: ఖేల్‌రత్న ఖాళీగా.. 17 మందికి అర్జున అవార్డులు

కేంద్రం 2025 జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటిస్తూ, 17 మంది క్రీడాకారులను అర్జున అవార్డులకు ఎంపిక చేసింది. అయితే ఈసారి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాన్ని ఎవరికీ ఇవ్వకూడదని ఎంపిక కమిటీ నిర్ణయించగా, హార్దిక్ సింగ్ పేరును పరిశీలించినప్పటికీ చివరికి ఖాళీగా ఉంచింది. ఈ నిర్ణయంపై క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తుండగా, ఎంపికైన క్రీడాకారుల కుటుంబాలు, కోచ్‌లు, అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

18, ఆగ 2026

కావేరీ జలాల వివాదం..సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్
తమిళనాడు

కావేరీ జలాల వివాదం..సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్

కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ నీటిలో తమ వాటాను విడుదల చేయడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసింది.

3, ఆగ 2026

సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
జాతీయం

సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

సహజీవనం అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సహజీవనంలో భాగస్వామిని వేధింపులకు గురి చేస్తే భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 498-ఏ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది.

3, ఆగ 2026

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు :  బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జాతీయం

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు : బిల్లుకు లోక్‌సభ ఆమోదం

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, రామమందిర విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది.

3, ఆగ 2026

కొలీజియం నిర్ణయాలపై సుప్రీం జడ్జి కీలక వ్యాఖ్యలు
జాతీయం

కొలీజియం నిర్ణయాలపై సుప్రీం జడ్జి కీలక వ్యాఖ్యలు

న్యాయమూర్తులను నియమించే 'కొలీజియం' వ్యవస్థ నిర్ణయాల్లో పారదర్శకత లోపిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొలీజియం తీసుకునే నిర్ణయాల వెనుక గల కారణాలను బహిరంగపరచకపోవడం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని అన్నారు.

1, ఆగ 2026

ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై తీర్పు రిజర్వ్‌
జాతీయం

ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై తీర్పు రిజర్వ్‌

ప్రధాన ఎన్నికల కమిషనర్‌, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన 2023 చట్టాన్ని సవాలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వాదనలు పూర్తిచేసి తీర్పును రిజర్వులో ఉంచి, అంశాన్ని ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి పంపాలని సిఫారసు చేసింది. ఎంపిక ప్యానెల్‌లో ప్రధాని ఆధిక్యం ఉందన్న అభ్యంతరాలను కేంద్రం తరఫున Solicitor General తుషార్‌ మెహతా ఖండిస్తూ, ఇది ప్రజాస్వామ్యంపై అవిశ్వాసం చూపడమేనని వాదించారు.

31, జులై 2026

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్
జాతీయం

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్

ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించినట్లు ఆరోపణల వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

30, జులై 2026

మన్మోహన్ సింగ్‌కు కోల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు భారీ ఊరట
జాతీయం

మన్మోహన్ సింగ్‌కు కోల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు భారీ ఊరట

కోల్ స్కామ్‌లో నమోదైన క్రిమినల్ కేసు నుంచి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టు పూర్తిస్థాయి ఊరట కల్పించింది. సీబీఐ క్లోజర్ రిపోర్ట్‌ను ఆమోదిస్తూ, 2015లో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లు, అప్పటి తీర్పును రద్దు చేసి విచారణను ముగించింది. యూపీఏ కాలం నాటి ఈ పెద్ద కేసులో ఆయనపై నేరాభియోగాలకు బలమైన ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.

29, జులై 2026

పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జాతీయం

పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

సుప్రీంకోర్టు ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్‌లు ప్రారంభించి తర్వాత పోస్ట్-ఫాక్టో అనుమతులు ఇచ్చే విధానాన్ని నిలువరించింది. 2021లో కేంద్రం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండమ్‌ను చట్టవిరుద్ధమని కొట్టి, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 3 ప్రకారం గెజెట్ నోటిఫికేషన్ ద్వారానే ఇలాంటి మార్పులు చేయాలని స్పష్టం చేసింది. అయితే 2017 నోటిఫికేషన్, 2021 OM కింద ఇప్పటికే ఇచ్చిన అనుమతులను కొనసాగనిచ్చి, కొత్త దరఖాస్తులు స్వీకరించరాదని తీర్పు ఇచ్చింది.

29, జులై 2026

అయోధ్య కేసులో .. రెండు వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు
జాతీయం

అయోధ్య కేసులో .. రెండు వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలి: సుప్రీంకోర్టు

అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణల సంబంధిత కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా చేపట్టేందుకు సిట్‌లో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది.

27, జులై 2026

మత మార్పిడి, ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత
జాతీయం

మత మార్పిడి, ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత

మత మార్పిడి చేసిన షెడ్యూల్డ్ కులాల ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు మార్చి 2026లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాల నుంచి క్రైస్తవం లేదా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా కొనసాగదని, తిరిగి పూర్వ మతంలో చేరి మూడు నిర్దిష్ట షరతులు నెరవేర్చినప్పుడే ఎస్సీ హోదా పునరుద్ధరణ సాధ్యమని ధర్మాసనం తేల్చింది.

27, జులై 2026

నీట్-యుజీ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
జాతీయం

నీట్-యుజీ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

నీట్-యుజీ ప్రశ్నపత్ర లీకేజీపై సుప్రీంకోర్టు కేంద్రం, NTAపై తీవ్రంగా ప్రశ్నిస్తూ తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత సంస్కరణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. డిజిటల్ మౌలిక వసతులు, భద్రత, పారదర్శకత, పరీక్షా కేంద్రాల ఎంపిక నుంచి ప్రశ్నపత్రాల రవాణా వరకు ప్రతి దశలో తీసుకుంటున్న చర్యల పురోగతిని అఫిడవిట్ రూపంలో వివరించాలని సూచించింది.

24, జులై 2026

ఈ తరానికి ఓపిక తక్కువ.. :  కీలక కేసులో సుప్రీం వ్యాఖ్యలు
జాతీయం

ఈ తరానికి ఓపిక తక్కువ.. : కీలక కేసులో సుప్రీం వ్యాఖ్యలు

సమాజంలో వస్తోన్న మార్పుల కారణంగానే ఈ మధ్య కాలంలో ‘హనీమూన్‌ హత్య’ లాంటి కేసులు వెలుగుచూస్తున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ తరం వాళ్లకు జ్ఞానం పెరుగుతున్నప్పటికీ.. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదని పేర్కొంది.

23, జులై 2026

ఢిల్లీలో ఆందోళనలు: 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత
జాతీయం

ఢిల్లీలో ఆందోళనలు: 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత

ఢిల్లీలో యువత నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాలతో లోక్ కళ్యాణ్ మార్గ్ , రాజీవ్ చౌక్ , Supreme Court సహా 16 మెట్రో స్టేషన్లు తాత్కాలికంగా మూసివేశారు, కీలక ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. జంతర్‌మంతర్‌లో విద్యార్థుల నిరసనలపై సుమోటో విచారణ కోరిన పిటిషన్‌తో పాటు, పోలీసుల దౌర్జన్యంపై మరో పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించి, ఇతర చట్టపర న్యాయ మార్గాలను ఆశ్రయించాలని సూచించింది.

22, జులై 2026

పార్లమెంట్ మార్చ్ విద్యార్థి నిరసనలపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
జాతీయం

పార్లమెంట్ మార్చ్ విద్యార్థి నిరసనలపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

సుప్రీంకోర్టు, పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనలపై పోలీసుల చర్యలపై అత్యవసర విచారణ కోరిన పిటిషన్‌ను తిరస్కరించింది. సీజేఐ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, వీడియోలు చూడడానికి సమయం లేదని, కోర్టు సమయాన్ని వృథా చేయకూడదని స్పష్టం చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలపై జోక్యం చేసుకోవాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.

22, జులై 2026

మతం మారితే ఎస్సీ హోదా రద్దు.. రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
జాతీయం

మతం మారితే ఎస్సీ హోదా రద్దు.. రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

మతం మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదన్న తన గత తీర్పుపై వచ్చిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బాపట్ల జిల్లా చింతాడ ఆనంద్‌ కేసు నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, మతం మారిన తర్వాత ఎస్సీగా రాజ్యాంగ పరిరక్షణలు, ప్రత్యేక హక్కులు కొనసాగవని స్పష్టం చేసిన మార్చి 24 తీర్పు యథాతథంగా అమల్లో ఉండనుంది.

19, జులై 2026

9వ తరగతిలో మూడో భాష పెట్టొద్దు: సుప్రీంకోర్టు
జాతీయం

9వ తరగతిలో మూడో భాష పెట్టొద్దు: సుప్రీంకోర్టు

సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై విచారణలో సుప్రీంకోర్టు తొమ్మిదో తరగతిలో మూడో భాష ప్రవేశపెట్టడం విద్యార్థులకు అదనపు భారమని సూచించింది. కొత్త భాషను నేర్పాలనుకుంటే ఐదో లేదా ఆరో తరగతి నుంచే ప్రారంభించాలని, విద్యార్థుల మానసిక ఒత్తిడి, విద్యా భారం అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

16, జులై 2026

సుప్రీంకోర్టులో అనుచిత ప్రవర్తన.. న్యాయశాస్త్ర విద్యార్థుల అరెస్టు
నేరాలు

సుప్రీంకోర్టులో అనుచిత ప్రవర్తన.. న్యాయశాస్త్ర విద్యార్థుల అరెస్టు

సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ఇద్దరు న్యాయ విద్యార్థులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

15, జులై 2026

సాయికృష్ణ కేసు.. 23కి వాయిదా వేసిన సుప్రీం
నేరాలు

సాయికృష్ణ కేసు.. 23కి వాయిదా వేసిన సుప్రీం

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగింది.

15, జులై 2026

విమాన ఛార్జీల దోపిడీపై సుప్రీంకోర్టు సీరియస్‌
జాతీయం

విమాన ఛార్జీల దోపిడీపై సుప్రీంకోర్టు సీరియస్‌

దేశంలో పెరుగుతున్న విమాన ఛార్జీల దోపిడీపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి, కొత్త విమానయాన నిబంధనల వివరాలను రెండు వారాల్లో సీల్డ్ కవర్‌లో సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రయాణికుల హక్కులు, ఛార్జీల విధానం, పారదర్శకతపై రూపుదిద్దుకుంటున్న నిబంధనల ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండగా, కేసు విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.

14, జులై 2026

పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
జాతీయం

పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు

పోక్సో చట్టం దుర్వినియోగంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. యుక్తవయసులో ఉన్న అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుని ఇంటి నుంచి వెళ్లిపోతే ప్రతి కేసును పోక్సో కేసుగా పరిగణించడం సరైన విధానం కాదని పేర్కొంది.

13, జులై 2026

గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు స్టే
తమిళనాడు

గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు స్టే

తమిళనాడులో బక్రీద్ సందర్భంగా గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్ర చట్టాలు అనుమతించిన వధను పూర్తిగా నిషేధించడం చట్టబద్ధం కాదని తమిళనాడు ప్రభుత్వం వాదించగా, హైకోర్టు ఆదేశాలు ప్రస్తుత చట్టాలకు విరుద్ధమా అనే అంశంపై సుప్రీంకోర్టు ప్రాథమికంగా పరిశీలించి, ఆ ఉత్తర్వులను సవరించాల్సిన అవసరం ఉందని సూచించింది.

13, జులై 2026

వేసవి విరామం ముగిసిన సుప్రీంకోర్టు… నేటి నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు
జాతీయం

వేసవి విరామం ముగిసిన సుప్రీంకోర్టు… నేటి నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు

వేసవి విరామం అనంతరం ఢిల్లీలోని సుప్రీంకోర్టు నేటి నుంచి అన్ని బెంచీలతో పూర్తిస్థాయి విచారణలను పునఃప్రారంభిస్తోంది. ఇప్పటివరకు అత్యవసర కేసులకే పరిమితమైన కార్యకలాపాల స్థానంలో, పౌర, క్రిమినల్, రాజ్యాంగ, పరిపాలనా తదితర విభాగాల కేసులు సాధారణ జాబితా ప్రకారం విచారణకు రానుండగా, వాయిదా పడిన పిటిషన్ల పరిష్కార ప్రక్రియ వేగం పడే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

13, జులై 2026

సాయి కృష్ణ కేసులో సుప్రీంకోర్టుకు సిట్‌..
ఆంధ్రప్రదేశ్

సాయి కృష్ణ కేసులో సుప్రీంకోర్టుకు సిట్‌..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

9, జులై 2026

సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టులో ఊరట
తమిళనాడు

సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టులో ఊరట

కరూర్‌ తొక్కిసలాట ఘటనపై బహిరంగ ప్రకటనలు చేయకుండా తమిళనాడు సీఎం విజయ్, మంత్రి ఆధవ్ అర్జున, TVK నేతలను నిరోధించాలని కోరుతూ DMK జనరల్ సెక్రటరీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకోకుండా తిరస్కరించింది. దీంతో DMK తరఫు న్యాయవాదులు అప్లికేషన్‌ను ఉపసంహరించుకోగా, ఈ నిర్ణయంతో సీఎం విజయ్, TVK నేతలకు తాత్కాలిక ఊరట లభించినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

7, జులై 2026

ఈ20 ఫలితాలు వచ్చే ఏడాదే    : సుప్రీంకు వెల్లడించిన కేంద్రం
జాతీయం

ఈ20 ఫలితాలు వచ్చే ఏడాదే : సుప్రీంకు వెల్లడించిన కేంద్రం

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ బ్లెండింగ్‌ కార్యక్రమం ఇంకా ప్రయగాత్మక దశలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దాని ఫలితాలు వచ్చే ఏడాదికల్లా వెల్లడి అవుతాయని తెలిపింది.

30, జూన్ 2026

అయోధ్య కేసు తక్షణ విచారణకు ‘సుప్రీం’ నిరాకరణ
జాతీయం

అయోధ్య కేసు తక్షణ విచారణకు ‘సుప్రీం’ నిరాకరణ

అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల చోరీకి గురయ్యాయంటూ దాఖలైన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.

29, జూన్ 2026

వీధి కుక్కల బెడదపై మద్రాస్ హైకోర్టు సీరియస్
తమిళనాడు

వీధి కుక్కల బెడదపై మద్రాస్ హైకోర్టు సీరియస్

తమిళనాడు, పుదుచ్చేరిలో వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును పరిశీలించేందుకు మద్రాస్ హైకోర్టు సువో మోటు ప్రజాహిత వ్యాజ్యాన్ని నమోదు చేసింది. Animal Husbandry, Health, Municipal Administration శాఖల ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చిన ఈ కేసు విచారణను జూన్ 22, 2026న ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అర్వింద్ ధర్మాధికారి ధర్మాసనం చేపడుతుంది.

21, జూన్ 2026

నీట్‌ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌ : నిలిపివేత పిటీషన్లు కొట్టేసిన సుప్రీం
జాతీయం

నీట్‌ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌ : నిలిపివేత పిటీషన్లు కొట్టేసిన సుప్రీం

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ పరీక్షను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో జూన్‌ 21న పరీక్ష యథాతథంగా కొనసాగనుంది.

19, జూన్ 2026

నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
జాతీయం

నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

నీట్‌ యూజీ–2026 పరీక్షను రద్దు చేసి దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష (రీ–ఎగ్జామ్‌) నిర్వహించాలన్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జూలై నెలకు వాయిదా వేసింది. జూన్‌ 21న జరగాల్సిన రీ–ఎగ్జామ్‌ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వు లు ఇచ్చేందుకు నిరాకరించింది.

18, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters