రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప: జిల్లాలో 2026 ఏప్రిల్ నెలలో నిర్వహించిన సీఎస్ఐ ఎస్సీ గ్రంథాలయ పరీక్ష 73వ బ్యాచ్కు సంబంధించిన ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు విడుదల చేసినట్లు జిల్లా విద్యా శాఖాధికారి షంషుద్దీన్ తెలిపారు.
ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BSE AP) అధికారిక వెబ్సైట్ ద్వారా పరిశీలించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పరీక్షా ఫలితాలు అభ్యర్థులు సులభంగా చూసుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో వివరించారు.
ఫలితాలతోపాటు అభ్యర్థులకు అవసరమైన ఇతర వివరాలను కూడా అదే వెబ్సైట్లో పొందుపరిచినట్లు షంషుద్దీన్ తెలిపారు. అభ్యర్థులు తమ నమోదు సంఖ్యల ద్వారా లాగిన్ అయి వ్యక్తిగత ఫలితాలు, మార్కుల వివరాలు, తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.
సంబంధిత అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఫలితాలను పరిశీలించాలని, ఏవైనా సందేహాలు ఉన్న పక్షంలో జిల్లా విద్యా కార్యాలయాన్ని సంప్రదించాలని డీఈవో సూచించారు. పరీక్షా ఫలితాల విడుదలతో గ్రంథాలయ పరీక్ష 73వ బ్యాచ్కు సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు.













