ప్రొద్దుటూరు మండలం నరసింహపురం గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని రూరల్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అక్రమంగా జూదం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి పేక ముక్కలు, రూ.4,550 నగదు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ వంటి చట్ట విరుద్ధ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు నిర్వహించినా, వాటిలో పాల్గొన్నా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.