బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఆర్థిక వ్యవస్థ

47 articles

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగిస్తున్న బీజేపీ: సీపీఐ విమర్శ
జిల్లా వార్తలు

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగిస్తున్న బీజేపీ: సీపీఐ విమర్శ

ప్రొద్దుటూరులో CPI నేత గాలి చంద్ర, BJP ప్రభుత్వం ప్రజల ఆస్తైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తోందని విమర్శించారు. RSS అనుబంధ వ్యక్తులను కీలక రంగాల్లో నియమిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టామని, సెప్టెంబర్ 1న "చలో Delhi" కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

11, ఆగ 2026

ఎగువ బలిజపల్లిలో చెరువు అభివృద్ధి పనులకు ప్రారంభం
జిల్లా వార్తలు

ఎగువ బలిజపల్లిలో చెరువు అభివృద్ధి పనులకు ప్రారంభం

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం ఎగువ బలిజపల్లిలో చెరువు అభివృద్ధి పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ, కుమారుడు శ్ నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభించారు. చెరువు పునరుద్ధరణతో సాగునీటి సౌకర్యం మెరుగై, నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, పంటల విస్తీర్ణం, వరుస పంటల సాగు సాధ్యమవుతుందని స్థానికులు భావిస్తున్నారు. గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు.

1, ఆగ 2026

ఇండియాలో 8-12% వ్యవసాయేతర ఉద్యోగాలపై జెన్AI ప్రభావం: గోల్డ్మన్ సాచ్స్  నివేదిక
జాతీయం

ఇండియాలో 8-12% వ్యవసాయేతర ఉద్యోగాలపై జెన్AI ప్రభావం: గోల్డ్మన్ సాచ్స్ నివేదిక

గోల్డ్మన్ సాచ్స్ నివేదిక ప్రకారం జెన్AI ప్రభావంతో INDలో వ్యవసాయేతర రంగాల్లో 8-12% ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, సేవా రంగాల్లో 42-48% ఉద్యోగుల పనిని ఇది సులభతరం చేయనుంది. టెలికం, కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ రంగాల్లో ప్రత్యక్ష ప్రభావం ఎక్కువగా ఉండగా, నైపుణ్యాలను అప్‌డేట్ చేసుకుంటే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయని నివేదికలో విశ్లేషించింది.

30, జులై 2026

పసిడి ధరలు యూటర్న్‌.. : స్వల్ప పెరుగుదల..
బిజినెస్

పసిడి ధరలు యూటర్న్‌.. : స్వల్ప పెరుగుదల..

గత రెండ్రోజుల తగ్గుదల తర్వాత గురువారం బంగారం ధరలు మళ్లీ పెరిగి వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేశాయి. హైదరాబాద్‌, విజయవాడతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,44,330కు, 22 క్యారెట్ల ధర రూ.1,32,300కు చేరగా, నిపుణులు అంతర్జాతీయ మార్కెట్‌ ఒడిదుడుకులు, డాలర్‌ మారకం విలువ, వడ్డీ రేట్ల అనిశ్చితి ప్రభావం కారణమని చెబుతున్నారు.

30, జులై 2026

వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
జిల్లా వార్తలు

వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాజీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, వారి హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, రోడ్ల పరిస్థితి అధ్వాన్నమై అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందని, తల్లికి వందనం పథకం విద్యార్థులకూ కుటుంబాలకూ ఉపయోగపడుతోందని తెలిపారు. రైతులు వర్షాధార పంటలు సాగు చేయాలని, ఎరువుల నల్లబజారును అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని సూచించారు.

23, జులై 2026

ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ ఆహ్వానించిన ఆర్‌బీఐ
బిజినెస్

ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ ఆహ్వానించిన ఆర్‌బీఐ

భారత్‌లో కరెన్సీ వ్యవస్థలో మరో కీలక మార్పుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా తయారీ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ గ్లోబల్ టెండర్ జారీ చేసింది.

18, జులై 2026

త్వరలో పాలిమర్‌ నోట్లు.. పైలట్‌ ప్రాజెక్ట్‌కు ఆర్‌బీఐ సన్నాహాలు!
బిజినెస్

త్వరలో పాలిమర్‌ నోట్లు.. పైలట్‌ ప్రాజెక్ట్‌కు ఆర్‌బీఐ సన్నాహాలు!

మార్కెట్‌లోకి త్వరలో పాలిమర్‌ నోట్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. కొత్త తరహా కరెన్సీని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది.

17, జులై 2026

పశ్చిమాసియా యుద్ధం: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరిక
జాతీయం

పశ్చిమాసియా యుద్ధం: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరిక

Reserve Bank of India గవర్నర్ సంజయ్ మల్హోత్రా పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ, రూపాయి స్థిరంగా ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల వల్ల ముడి చమురు ధరలు, సరఫరా గొలుసులు, ద్రవ్యోల్బణంపై ఒత్తిళ్లు పెరిగే ప్రమాదం ఉందని, అవసరమైతే ఆర్బీఐ తగిన ద్రవ్య విధాన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

17, జులై 2026

చమురు మంటలు.. నష్టాల్లో సూచీలు
బిజినెస్

చమురు మంటలు.. నష్టాల్లో సూచీలు

పశ్చిమాసియాలో జియోపాలిటికల్‌ ఉద్రిక్తతలు, హర్మూజ్‌ సముద్రప్రాంతంలో వాణిజ్య నౌకపై IRGC దాడి, ముడి చమురు ధరల ఒక్కసారిగా పెరుగుదలతో గ్లోబల్‌ ఎనర్జీ మార్కెట్లు కుదేలయ్యాయి. దీనితో బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు నాలుగు శాతం ఎగసి, చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల కరెన్సీలు, స్టాక్‌ మార్కెట్లపై ఒత్తిడి పెరిగి, భారత మార్కెట్లలో సెన్సెక్స్‌, నిఫ్టీ పతనమయ్యాయి.

13, జులై 2026

హైదరాబాద్ కు  మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు :  ప్రకటించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
తెలంగాణ

హైదరాబాద్ కు మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు : ప్రకటించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

హైదరాబాదీలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గుడ్‌న్యూస్ చెప్పారు. హైదరాబాద్‌ను దేశంలో కీలక హైస్పీడ్ రైలు (బుల్లెట్ ట్రైన్) హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

12, జులై 2026

పెట్రో ధరలు ఇప్పుడే తగ్గించలేము : కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ
బిజినెస్

పెట్రో ధరలు ఇప్పుడే తగ్గించలేము : కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ

ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇప్పటికీ పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ అన్నారు.

2, జులై 2026

ఏఐ సామ్రాజ్యం రూ. 450 లక్షల కోట్ల వ్యాపారం
టెక్నాలజీ

ఏఐ సామ్రాజ్యం రూ. 450 లక్షల కోట్ల వ్యాపారం

కృత్రిమ మేధస్సు ఆధారిత ఎకానమీ వచ్చే పదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లకు, అంటే సుమారు రూ. 450 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తయారీ నుంచి వైద్యం, ఫైనాన్స్‌, వ్యవసాయం, రక్షణ వరకు అన్ని రంగాల్లో ఏఐ వెన్నెముకగా మారుతూ, చిప్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, క్లౌడ్‌, ఫౌండేషన్‌ మోడళ్లు, అప్లికేషన్లు, స్వతంత్ర వ్యవస్థలు అనే ఆరు ప్రధాన విభాగాలుగా విస్తరిస్తోంది.

28, జూన్ 2026

ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం
అంతర్జాతీయం

ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం

సముద్ర పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది.

28, జూన్ 2026

ప్రభుత్వాల విధానాలపై సిపిఐ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
జిల్లా వార్తలు

ప్రభుత్వాల విధానాలపై సిపిఐ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. రైతు సమస్యలు, ప్రభుత్వ రంగ సంస్థల బలహీనపరిచే చర్యలు, ఓటర్ల తొలగింపు, RTC ప్రైవేటీకరణ, ప్రాంతీయ అసమతుల అభివృద్ధి అంశాలపై పోరాటాన్ని ముమ్మరం చేస్తామని, జూన్ 30న విజయవాడ లో జరగనున్న రైతుల "చలో విజయవాడ" కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.

25, జూన్ 2026

మహిళలను మోసం చేస్తున్న బాబు సర్కార్
రాజకీయాలు

మహిళలను మోసం చేస్తున్న బాబు సర్కార్

టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆరోపించారు.

25, జూన్ 2026

2035 నాటికి 10 GW అణు విద్యుత్‌ లక్ష్యం  : గౌతమ్‌ అదానీ
బిజినెస్

2035 నాటికి 10 GW అణు విద్యుత్‌ లక్ష్యం : గౌతమ్‌ అదానీ

దేశీయ ఇంధన అవసరాలు తీర్చడమే లక్ష్యంగా 2035 నాటికి 10 గిగావాట్ల అణుశక్తి (GW) సామర్థ్యాన్ని సాధించాలని అదానీ గ్రూప్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam adani) వెల్లడించారు.

24, జూన్ 2026

తగ్గిన బంగారం ధరలు.. కనిష్ఠానికి చమురు
బిజినెస్

తగ్గిన బంగారం ధరలు.. కనిష్ఠానికి చమురు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర (Oil Prices) నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. అటు బంగారం (Gold Rates), వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

24, జూన్ 2026

జూన్ 2026లో FD వడ్డీ రేట్ల సవరణలు
బిజినెస్

జూన్ 2026లో FD వడ్డీ రేట్ల సవరణలు

RBI రెపో రేటు 5.25 శాతంపై స్థిరంగా ఉన్నప్పటికీ, జూన్ 2026లో Yes Bank, DCB Bank, Union Bank of India, Punjab National Bankలు తమ FD వడ్డీ రేట్లను సవరించాయి. సాధారణ ఖాతాదారులకు గరిష్టంగా 7.5 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం వరకు వడ్డీ లభించేలా మార్పులు జరిగాయి. పెట్టుబడి పెట్టే ముందు తాజా రేట్ల కోసం సంబంధిత బ్యాంక్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.

23, జూన్ 2026

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం : మంత్రి లోకేశ్
రాజకీయాలు

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం : మంత్రి లోకేశ్

2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే సీఎం చంద్రబాబు నాయుడి ప్రధాన లక్ష్యం అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోందన్నారు.

22, జూన్ 2026

గ్రహాంతర ప్రయాణం సాధ్యమేనా? మానవ జాతి ఎక్సోప్లానెట్లను చేరగలదా?
టెక్నాలజీ

గ్రహాంతర ప్రయాణం సాధ్యమేనా? మానవ జాతి ఎక్సోప్లానెట్లను చేరగలదా?

గ్రహాంతర ప్రయాణం సాంకేతికంగా ఇప్పటికీ అత్యంత క్లిష్టమైన సవాలుగానే ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. Proxima Centauri వంటి సమీప నక్షత్రాన్ని చేరాలంటే ప్రస్తుత రాకెట్ సాంకేతికతతో వేల సంవత్సరాలు పడుతుందని లెక్కలు చెబుతున్నాయి. అందుకే ఇప్పటికైతే మానవుల బదులు రోబోటిక్ ప్రోబ్స్, అధునాతన ప్రొపల్షన్ పద్ధతులపై పరిశోధనలు కొనసాగుతుండగా, నిజమైన మానవ గ్రహాంతర ప్రయాణం భవిష్యత్తు సాంకేతిక పురోగతిపైనే ఆధారపడి ఉంది.

22, జూన్ 2026

భారత్‌తో యుద్ధానికైనా రెడీ..  : పాక్ మంత్రి సంచలన ప్రకటన
అంతర్జాతీయం

భారత్‌తో యుద్ధానికైనా రెడీ.. : పాక్ మంత్రి సంచలన ప్రకటన

భారత్–పాకిస్తాన్ మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ చేసిన తాజా వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య కొత్త రాజకీయ, దౌత్య ఉద్రిక్తతలకు దారితీశాయి. సింధూ జలాల విషయంలో పాకిస్తాన్ హక్కులను దెబ్బతీసే ఏ చర్యనైనా తమ దేశం సహించదని, అవసరమైతే భారత్‌తో యుద్ధానికైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

22, జూన్ 2026

వచ్చే వారం స్టాక్ మార్కెట్‌కు ఒక రోజు సెలవు
బిజినెస్

వచ్చే వారం స్టాక్ మార్కెట్‌కు ఒక రోజు సెలవు

వచ్చే వారం National Stock Exchange, Bombay Stock Exchange లలో ఒక రోజు ట్రేడింగ్ సెలవు ఉండగా, ఆ రోజున ఈక్విటీ, డెరివేటివ్స్, SLB వంటి అన్ని విభాగాల్లో లావాదేవీలు నిలిచిపోతాయి. సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే ట్రేడింగ్‌లో ఈ ఒక్క సెలవు కారణంగా పెట్టుబడిదారులు, ట్రేడర్లు తమ Delivery కొనుగోళ్లు, Short-term ట్రేడింగ్, Futures & Options పొజిషన్ల ప్రణాళికలను సవరించుకోవాల్సి ఉంటుంది.

21, జూన్ 2026

ముడి చమురు ధరలు తగ్గినా.. ఇంధన ధరలు తగ్గవు: కేంద్రం స్పష్టం
బిజినెస్

ముడి చమురు ధరలు తగ్గినా.. ఇంధన ధరలు తగ్గవు: కేంద్రం స్పష్టం

అమెరికా–ఇరాన్‌ ఒప్పందంతో ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, భారత్‌లో ఇంధన ధరలను వెంటనే తగ్గించే పరిస్థితి లేదని కేంద్రం స్పష్టం చేసింది. హర్మూజ్‌ జలసంధిలో రవాణా రద్దీ, పశ్చిమాసియా యుద్ధం సమయంలో చమురు కంపెనీలు చవిచూసిన నష్టాలు, కేంద్రం కోల్పోయిన ఆదాయం వంటి అంశాల వల్ల తక్షణ తగ్గింపు సాధ్యం కాదని సహాయ మంత్రి సురేశ్‌ గోపీ తెలిపారు.

18, జూన్ 2026

హర్మూజ్‌ అణ్వాయుధం కంటే శక్తిమంతం
అంతర్జాతీయం

హర్మూజ్‌ అణ్వాయుధం కంటే శక్తిమంతం

హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ నియంత్రణ గణనీయంగా పెరిగి, దాన్ని మూసివేసే స్థాయికి చేరుకుందని అమెరికా ఇంటెలిజెన్స్‌ అంచనా వేసినట్టు మీడియా వెల్లడించింది. ఈ ఆధిపత్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అణ్వాయుధం కంటే ఎక్కువ వ్యూహాత్మక ప్రభావం చూపగలదని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఇరాన్‌తో జరుగుతున్న ఒప్పంద చర్చల్లో హర్మూజ్‌ అంశం కేంద్రంగా మారగా, ఉపాధ్యక్షుడు JD Vance అణ్వాయుధ నిరోధం, జలసంధి తెరవుదల తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

17, జూన్ 2026

ఆక్వా ఫీడ్ ధరలపై వైఎస్ జగన్ అల్టిమేటం
రాజకీయాలు

ఆక్వా ఫీడ్ ధరలపై వైఎస్ జగన్ అల్టిమేటం

ఆక్వా ఫీడ్ ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే తీవ్ర ఉద్యమానికి దిగేందుకు సిద్ధమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి. ఆక్వా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైందని, చిన్న, మధ్య తరహా రైతులకు నష్టం కలగకుండా ఫీడ్ ధరలను నియంత్రించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.

16, జూన్ 2026

అమెరికా–ఇరాన్ అవగాహనకు మోదీ స్వాగతం : ఎక్స్‌ ఖాతాలో పోస్టు
అంతర్జాతీయం

అమెరికా–ఇరాన్ అవగాహనకు మోదీ స్వాగతం : ఎక్స్‌ ఖాతాలో పోస్టు

అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన కీలక అవగాహనను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై, వాణిజ్య మార్గాలపై, అనేక దేశాల్లో ప్రాణనష్టంపై తీవ్ర ప్రభావం చూపాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమలైతే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొని, ముఖ్యంగా హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా సజావుగా సాగి భారత్ వంటి దేశాలకు ఊరట కలుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

15, జూన్ 2026

అమెరికా–ఇరాన్‌ శాంతి ఒప్పందం… హోర్ముజ్‌ జలసంధి తెరుచుకోనుంది
అంతర్జాతీయం

అమెరికా–ఇరాన్‌ శాంతి ఒప్పందం… హోర్ముజ్‌ జలసంధి తెరుచుకోనుంది

అమెరికా–ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఘరీబా బాదీ ప్రకటించారు. దీంతో హోర్ముజ్‌ జలసంధి నిర్బంధం లేకుండా తెరుచుకోనుండగా, ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని అమెరికా సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఒప్పందం గల్ఫ్‌ చమురు రవాణా, పశ్చిమాసియా రాజకీయ–ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

15, జూన్ 2026

రష్యా నుంచి చమురు దిగుమతుల్లో భారత్‌కు రెండో స్థానం కొనసాగింపు
బిజినెస్

రష్యా నుంచి చమురు దిగుమతుల్లో భారత్‌కు రెండో స్థానం కొనసాగింపు

సీఆర్ఈఏ నివేదిక ప్రకారం మేలో భారత్ రష్యా నుంచి 5.8 బిలియన్ యూరోల విలువైన ఇంధనాలను దిగుమతి చేసుకుని, రష్యా ఇంధనాల ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా తన స్థానాన్ని కొనసాగించింది. వీటిలో 83 శాతం క్రూడ్ ఆయిల్‌దే కాగా, మేలో రష్యా క్రూడ్ దిగుమతులు 21 శాతం పెరిగి, ఆసియా మార్కెట్లలో రష్యా చమురుపై పెరుగుతున్న డిమాండ్ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.

14, జూన్ 2026

మీ డబ్బు ఎన్నేళ్లలో మూడింతలు అవుతుందో 114 రూల్‌తో లెక్కించొచ్చు
బిజినెస్

మీ డబ్బు ఎన్నేళ్లలో మూడింతలు అవుతుందో 114 రూల్‌తో లెక్కించొచ్చు

డబ్బు భవిష్యత్‌ విలువను సులభంగా అంచనా వేసేందుకు 114, 72 రూల్స్‌ ఉపయోగపడతాయి. 114ను వార్షిక వడ్డీ రేటుతో భాగిస్తే పెట్టుబడి మూడింతలు కావడానికి పట్టే సుమారు సంవత్సరాలు, 72ను వడ్డీ రేటుతో భాగిస్తే రెట్టింపు కావడానికి పట్టే కాలం తెలుస్తుంది. అయితే ఇవి కేవలం సులభ అంచనాలకే పరిమితమై, అసలు లాభం పెట్టుబడి విధానం, పన్నులు, ఛార్జీలపై ఆధారపడి ఉంటుంది.

13, జూన్ 2026

అమెరికా గొప్ప వలసదారుల్లో 27 మంది భారతీయులు
బిజినెస్

అమెరికా గొప్ప వలసదారుల్లో 27 మంది భారతీయులు

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని, ఆ దేశ అభివృద్ధికి విశేషంగా తోడ్పడిన 250 మంది ప్రభావశీల వలసదారుల జాబితాను Forbes విడుదల చేసింది. ఇందులో 27 మంది భారత సంతతి వ్యక్తులు ఉండగా, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఇంద్రా నూయి, అభిజిత్ బెనర్జీ, అరవింద్ కృష్ణ వంటి ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. వలస విధానాలపై చర్చలు ముదురుతున్న వేళ, అమెరికా వ్యాపార, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో భారతీయుల పెరుగుతున్న ప్రభావాన్ని ఈ జాబితా ప్రతిబింబిస్తోంది.

12, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters