బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#వ్యవస్థను

34 articles

UPI లావాదేవీలపై ఛార్జీల ఆలోచనపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యలు
బిజినెస్

UPI లావాదేవీలపై ఛార్జీల ఆలోచనపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యలు

RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యలతో UPI లావాదేవీలపై ఛార్జీల అంశం మరోసారి చర్చకు వచ్చింది. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను దీర్ఘకాలం కొనసాగించాలంటే సాంకేతిక మౌలిక వసతుల ఖర్చును ఎవరో భరించాల్సిందేనని ఆయన సూచించగా, రెండు వేల రూపాయలకుపైగా ఉన్న వ్యాపార UPI లావాదేవీలపై MDR విధించే అవకాశంపై ఆర్థిక, బ్యాంకింగ్ వర్గాలు పరిశీలిస్తున్నాయి.

6, ఆగ 2026

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
జిల్లా వార్తలు

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలలో భారీ అవినీతి, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను దెబ్బతీస్తోందని విమర్శించిన ఆయన, ఆగస్టు 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, 10న నియోజకవర్గ స్థాయిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి డీఎస్సీ అవకతవకలపై పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.

5, ఆగ 2026

విద్యను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు చర్యలు – సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

విద్యను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు చర్యలు – సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను విద్యాపరంగా దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడ్జెట్‌లో విద్యకు 9 శాతం నిధులు కేటాయించడం తమ సంకల్పానికి నిదర్శనమని తెలిపారు. పిల్లల భవిష్యత్తు, నైపుణ్యాలు, భాషా సామర్థ్యాల పెంపుపై దృష్టి సారిస్తూ ఉపాధ్యాయులకు విదేశీ శిక్షణ, క్లస్టర్ స్థాయి విద్యా ప్రణాళికలు చేపడతామని చెప్పారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతాననే ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు.

30, జులై 2026

జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ: రాష్ట్ర అధికార ప్రతినిధుల వ్యవస్థ రద్దు
ఆంధ్రప్రదేశ్

జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ: రాష్ట్ర అధికార ప్రతినిధుల వ్యవస్థ రద్దు

జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రతినిధుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, ప్రస్తుతం ఉన్న 26 మంది ప్రతినిధుల బాధ్యతలను తక్షణం నిలిపివేశారు. కొత్త కమిటీలు ప్రకటించే వరకు టెలివిజన్ డిబేట్లు, మీడియా చర్చల్లో పార్టీ తరఫున ఎవరూ పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేయగా, త్వరలో కొత్త అధికార ప్రతినిధుల జాబితా వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.

29, జులై 2026

జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి స్మార్ట్ కిచెన్లతో కొత్త శకం
జిల్లా వార్తలు

జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి స్మార్ట్ కిచెన్లతో కొత్త శకం

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని దేశానికి ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో స్మార్ట్ కిచెన్ వ్యవస్థను దశలవారీగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 20 స్మార్ట్ కిచెన్లు పనిచేస్తుండగా, త్వరలో మరో 13 ప్రారంభం కానున్నాయి. పలు పాఠశాలల్లో ఆహార తయారీ, పరిశుభ్రత, నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

29, జులై 2026

విద్యార్థినుల భద్రతకు డ్రోన్ల నిఘా: ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు
జిల్లా వార్తలు

విద్యార్థినుల భద్రతకు డ్రోన్ల నిఘా: ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు

అన్నమయ్య జిల్లాలో విద్యార్థినుల భద్రత కోసం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలపై పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా చేపట్టారు. శక్తి బృందాలు, బ్లూ కోల్ట్స్ సంయుక్తంగా స్కూల్ జోన్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో నిఘా నిర్వహిస్తూ ఆకతాయిలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

29, జులై 2026

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం
జాతీయం

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం

దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా మరో వీడియో రిలీజ్ చేశారు.

26, జులై 2026

డ్రగ్స్ నిర్మూలనపై సీఎం రేవంత్ సమీక్షా సమావేశం
తెలంగాణ

డ్రగ్స్ నిర్మూలనపై సీఎం రేవంత్ సమీక్షా సమావేశం

మాదక ద్రవ్యాల నిర్మూలనపై సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రభుత్వం డ్రగ్స్ నిరోధంపై అత్యంత సీరియస్‌గా ఉందని స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్‌కు సంబంధించి ఏ ఘటన జరిగినా యాజమాన్యాన్నే పూర్తిగా బాధ్యులుగా పరిగణించే విధంగా వ్యవస్థను రూపొందించాలని, త్రీ-స్టెప్ యాక్షన్ ప్లాన్, డీ-అడిక్షన్ సెంటర్లు, గోప్య ఫిర్యాదు వ్యవస్థలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

25, జులై 2026

వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
జిల్లా వార్తలు

వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాజీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, వారి హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, రోడ్ల పరిస్థితి అధ్వాన్నమై అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందని, తల్లికి వందనం పథకం విద్యార్థులకూ కుటుంబాలకూ ఉపయోగపడుతోందని తెలిపారు. రైతులు వర్షాధార పంటలు సాగు చేయాలని, ఎరువుల నల్లబజారును అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని సూచించారు.

23, జులై 2026

ఢిల్లీలో లాఠీఛార్జ్‌ ఘటనకు స్పందించిన సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
సినిమా

ఢిల్లీలో లాఠీఛార్జ్‌ ఘటనకు స్పందించిన సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్

పేపర్ లీక్ నిరసనల సందర్భంగా ఢిల్లీలో జరిగిన లాఠీఛార్జ్‌పై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇది శాంతియుతంగా సాగుతున్న ఉద్యమానికి హింసాత్మక మలుపు తిప్పిందని వ్యాఖ్యానించారు. పేపర్ లీక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే తీవ్రమైన సమస్య అని, మెరుగైన విద్యావ్యవస్థ కోసం దేశ యువత కలిసికట్టుగా పోరాడటం, తల్లిదండ్రుల అండతో చదువుకు పెరుగుతున్న ప్రాధాన్యత సానుకూల పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.

23, జులై 2026

శ్రీశైలం దేవస్థానంలో దర్శన విధానాల్లో కీలక మార్పులు
జిల్లా వార్తలు

శ్రీశైలం దేవస్థానంలో దర్శన విధానాల్లో కీలక మార్పులు

శ్రీశైలం దేవస్థానం దర్శన విధానాల్లో కీలక మార్పులు చేసి, సెలవు రోజుల్లో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించేలా కొత్త వ్యవస్థను అమలు చేసింది. ఉదయం అలంకార దర్శనం ద్వారా సాధారణ భక్తులకు సేవలు అందించగా, ఉదయం నేరుగా వచ్చే వీఐపీలకు, సాయంత్రం సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులకు మాత్రమే స్పర్శదర్శనం కల్పిస్తున్నారు. ఈ మార్పులతో భక్తులకు మెరుగైన సేవలు, సంతృప్తికర దర్శనం అందుతున్నట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.

18, జులై 2026

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్ధం
జాతీయం

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్ధం

హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో నేడు జింద్–సోనిపత్ మధ్య నడిచే దేశ తొలి హైడ్రోజన్ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 10 కోచ్‌లతో నడిచే ఈ పర్యావరణహిత రైలు ద్వారా డీజిల్‌పై ఆధారాన్ని తగ్గించి, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.

17, జులై 2026

తెలంగాణలోత్వరలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణ

తెలంగాణలోత్వరలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం పాత కాగితం రేషన్ కార్డులకు బదులుగా పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనుంది. తొలి దశలో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియను దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఆధార్ అనుసంధానం, క్యూఆర్ కోడ్, భద్రతా లక్షణాలతో నకిలీ కార్డులు, డూప్లికేట్ లబ్ధిదారుల సమస్యలను తగ్గించి పేద కుటుంబాలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.

14, జులై 2026

బనగానపల్లె నియోజకవర్గంలో రూ.2,000 కోట్ల అభివృద్ధి పనులు
జిల్లా వార్తలు

బనగానపల్లె నియోజకవర్గంలో రూ.2,000 కోట్ల అభివృద్ధి పనులు

హైకోర్టు అడ్వకేట్, టిడిపి నాయకుడు అలీ హుస్సేన్ ప్రకారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత బనగానపల్లె నియోజకవర్గంలో దాదాపు రూ.2,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ విస్తరణ, బైపాస్ రోడ్డు, యాగంటి దేవస్థానంలో పర్యాటక వసతులు, పంచాయతీరాజ్, RWS, రోడ్లు, జాతీయ రహదారులు తదితర శాఖల ద్వారా భారీ నిధులు మంజూరై పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

14, జులై 2026

విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ
జాతీయం

విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ

భారత్‌లో విద్యా వ్యవస్థ మోసపూరితంగా మారిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్య పేరిట జరుగుతోన్న దోపిడీని నిలువరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

13, జులై 2026

పారదర్శక పరిపాలన కోసం పూర్తి స్థాయి డిజిటలైజేషన్‌
తెలంగాణ

పారదర్శక పరిపాలన కోసం పూర్తి స్థాయి డిజిటలైజేషన్‌

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిపాలనలో పారదర్శకత కోసం పూర్తి స్థాయి డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు, జీతాలు, బ్యాంకు ఖాతాలను డిజిటలైజ్ చేసి ప్రతి నెల 1 నుంచి 5వ తేదీ లోగా జీతాలు చెల్లించేలా వ్యవస్థను రూపకల్పన చేయాలని సూచిస్తూ, అక్రమాలు చేసే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

7, జులై 2026

జూలై 17న దేశపు తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం
జాతీయం

జూలై 17న దేశపు తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం

జూలై 17న దేశంలో తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రయోగాత్మకంగా ఒక నిర్దిష్ట మార్గంలో ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ వినియోగంతో కార్బన్ ఉద్గారాలు తగ్గి, పర్యావరణహిత రవాణా వ్యవస్థకు ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

7, జులై 2026

తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదుల దందా బహిర్గతం
జిల్లా వార్తలు

తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదుల దందా బహిర్గతం

తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదులు బుక్ చేసి, భక్తులకు రూ.2 వేల నుండి రూ.3 వేలకు అమ్ముతున్న ముఠాను TTD విజిలెన్స్, పోలీసులు పట్టుకుని నలుగురిని అరెస్ట్ చేసి 12 నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాపై లోతుగా విచారణ కొనసాగిస్తూ, భక్తులు తప్పనిసరిగా TTD అధికారిక మార్గాల ద్వారానే గదులు బుక్ చేసుకోవాలని, మధ్యవర్తుల ద్వారా అధిక ధరలు చెల్లించవద్దని అధికారులు హెచ్చరించారు.

5, జులై 2026

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు! : రూ.14,115 కోట్లతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం
రాజకీయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు! : రూ.14,115 కోట్లతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం

ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయాలని సంకల్పించింది.

1, జులై 2026

పుట్టపర్తిలో వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
జిల్లా వార్తలు

పుట్టపర్తిలో వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లపై వ్యవసాయ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, సబ్సిడీ వేరుశనగ విత్తనాలు, ఎరువులు సమయానికి, తగిన మోతాదులో రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ముందస్తు ప్రణాళిక, పారదర్శక పంపిణీ, గ్రామ స్థాయిలో సమస్యల గుర్తింపు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తూ, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.

30, జూన్ 2026

ప్రభుత్వ సేవలు మరింత సులభతరం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ప్రభుత్వ సేవలు మరింత సులభతరం : సీఎం చంద్రబాబు

ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్‌ సెంటర్‌ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు.

29, జూన్ 2026

ఏఐ సామ్రాజ్యం రూ. 450 లక్షల కోట్ల వ్యాపారం
టెక్నాలజీ

ఏఐ సామ్రాజ్యం రూ. 450 లక్షల కోట్ల వ్యాపారం

కృత్రిమ మేధస్సు ఆధారిత ఎకానమీ వచ్చే పదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లకు, అంటే సుమారు రూ. 450 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తయారీ నుంచి వైద్యం, ఫైనాన్స్‌, వ్యవసాయం, రక్షణ వరకు అన్ని రంగాల్లో ఏఐ వెన్నెముకగా మారుతూ, చిప్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, క్లౌడ్‌, ఫౌండేషన్‌ మోడళ్లు, అప్లికేషన్లు, స్వతంత్ర వ్యవస్థలు అనే ఆరు ప్రధాన విభాగాలుగా విస్తరిస్తోంది.

28, జూన్ 2026

ఆర్టీజీఎస్‌పై మంత్రి నారా లోకేష్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్

ఆర్టీజీఎస్‌పై మంత్రి నారా లోకేష్ సమీక్ష

మంత్రి నారా లోకేష్ సచివాలయంలో ఆర్టీజీఎస్, డేటాలేక్ పనితీరును సమీక్షించి, అన్ని పనులను జూలై నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డుల సేవలను సులభతరం చేసి, డిజిటల్ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా ఆయన ఆదేశించారు.

26, జూన్ 2026

పోలీసులు బాబు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
జిల్లా వార్తలు

పోలీసులు బాబు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్రంలో పోలీసులు N. చంద్రబాబు నాయుడు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని, జగ్గయ్యపేట లాకప్ మృతి ఘటనలో చట్టపరమైన విధానాలు పాటించకుండా సాయికృష్ణను హింసించి చంపారని ఆరోపించారు. సీసీ ఫుటేజ్ మాయం చేయడం ద్వారా నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని, ఒక్క CI నాగరాజు పై కేసు సరిపోదని, మొత్తం ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు కోసం కేసును CBIకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

25, జూన్ 2026

తిరుమలలో అర్ధరాత్రి ఆక్టోపస్ మాక్ డ్రిల్‌ కలకలం
జిల్లా వార్తలు

తిరుమలలో అర్ధరాత్రి ఆక్టోపస్ మాక్ డ్రిల్‌ కలకలం

తిరుమలలో భక్తుల రద్దీ మధ్య PAC 5 ప్రాంతంలో ఆక్టోపస్ దళాలు అర్ధరాత్రి భారీ మాక్ డ్రిల్ నిర్వహించగా, కొంతసేపు భక్తుల్లో ఉత్కంఠ నెలకొంది. ఉగ్రదాడి, బంధీల రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందన సామర్థ్యాన్ని పరీక్షించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. భక్తుల భద్రతే ప్రాధాన్యమని, అందుకే ఇలాంటి విన్యాసాలు కొనసాగుతున్నాయని టిటిడి స్పష్టం చేసింది.

24, జూన్ 2026

వాట్సాప్‌లోనే మార్కుల మెమోలు, హాల్‌టికెట్లు: తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్‌లో డిజిటల్ అడుగు
తెలంగాణ

వాట్సాప్‌లోనే మార్కుల మెమోలు, హాల్‌టికెట్లు: తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్‌లో డిజిటల్ అడుగు

తెలంగాణ ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ సేవలను WhatsApp ద్వారా అందించే డిజిటల్ వ్యవస్థను ప్రారంభించింది. దీనితో రాష్ట్రంలోని సుమారు 18 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రగతి నివేదికలు, హాల్‌టికెట్లు, మార్కుల మెమోలు, పాత SSC మెమోలు, బోనఫైడ్, బదిలీ సర్టిఫికెట్లు, పరీక్షల ఫలితాలు వంటి సేవలను మొబైల్‌లోనే పొందగలరు. తదుపరి దశలో యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు, హాజరు, స్కాలర్‌షిప్‌లు, మధ్యాహ్న భోజన పథకం వివరాలు వంటి మరిన్ని సేవలను కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌కు అనుసంధానించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

20, జూన్ 2026

ప్రపంచాన్ని భయపెడుతున్న ఎల్‌ నినో : కరువు పరిస్థితులు తప్పవా?
వ్యవసాయం

ప్రపంచాన్ని భయపెడుతున్న ఎల్‌ నినో : కరువు పరిస్థితులు తప్పవా?

ప్రపంచ వాతావరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే ఎల్‌ నినో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈసారి ఇది సాధారణ ఎల్‌నినో కాదని, గతంలో నమోదైన అత్యంత శక్తివంతమైన ఘటనల్లో ఒకటిగా మారే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

18, జూన్ 2026

మంగళగిరి–తాడేపల్లి యూజీడీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి–తాడేపల్లి యూజీడీ ప్రాజెక్టుకు శంకుస్థాపన

మంగళగిరి–తాడేపల్లి యూజీడీ ప్రాజెక్టు మొదటి దశ పనులకు మంత్రి నారా లోకేష్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో రూ.1,167.50 కోట్ల వ్యయంతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను దశలవారీగా ఏర్పాటు చేసి, మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

17, జూన్ 2026

హర్మూజ్‌ అణ్వాయుధం కంటే శక్తిమంతం
అంతర్జాతీయం

హర్మూజ్‌ అణ్వాయుధం కంటే శక్తిమంతం

హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ నియంత్రణ గణనీయంగా పెరిగి, దాన్ని మూసివేసే స్థాయికి చేరుకుందని అమెరికా ఇంటెలిజెన్స్‌ అంచనా వేసినట్టు మీడియా వెల్లడించింది. ఈ ఆధిపత్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అణ్వాయుధం కంటే ఎక్కువ వ్యూహాత్మక ప్రభావం చూపగలదని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఇరాన్‌తో జరుగుతున్న ఒప్పంద చర్చల్లో హర్మూజ్‌ అంశం కేంద్రంగా మారగా, ఉపాధ్యక్షుడు JD Vance అణ్వాయుధ నిరోధం, జలసంధి తెరవుదల తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

17, జూన్ 2026

శత్రు బాలిస్టిక్‌ క్షిపణులకు చెక్‌ – బీఎండీ ఫేజ్‌–2 పరీక్ష విజయవంతం
జాతీయం

శత్రు బాలిస్టిక్‌ క్షిపణులకు చెక్‌ – బీఎండీ ఫేజ్‌–2 పరీక్ష విజయవంతం

శత్రుదేశాలు ప్రయోగించిన బాలిస్టిక్‌ ఖండాంతర క్షిపణులను 5వేల కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకొని ధ్వంసం చేసే ‘బాలిస్టిక్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ (బీఎండీ) ఫేజ్‌-2’ వ్యవస్థను మన డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. డీఆర్‌డీవో పరీక్షించినవాటిలో రెండు తదుపరి తరం ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులు ఉండగా.. మరొకటి నేవల్‌ యాంటీ షిప్‌ క్షిపణి. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి జూన్‌ 10, 11 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించారు.

14, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters