బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రెండేళ్లు

32 articles

ప్రొద్దుటూరు లో కాలువలపై అక్రమ కట్టడాలే కారణమా?
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు లో కాలువలపై అక్రమ కట్టడాలే కారణమా?

కడప జిల్లా ప్రొద్దుటూరులో చిన్నపాటి వర్షం పడినా ప్రధాన రహదారులు చెరువుల్లా నీటమునిగిపోవడం స్థానికులకు తలనొప్పిగా మారింది. వైఎంఆర్ కాలనీ సహా పలుచోట్ల మున్సిపల్ కాలువలపై శాశ్వత అక్రమ కట్టడాలు, పూడికలు తొలగించకపోవడం వల్ల పారిశుద్ధ పనులు సక్రమంగా సాగడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్త కమిషనర్ Thodika Srinivas Vishwanath ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి సమస్యను పరిష్కరిస్తారా అన్నది ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

8, ఆగ 2026

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి నగరపాలక సంస్థ ముందడుగు
జిల్లా వార్తలు

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి నగరపాలక సంస్థ ముందడుగు

నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సబ్బులు, ఆయిల్‌ల పంపిణీతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత సామగ్రి, వేతన ఖాతాల మార్పు, ప్రమాద బీమా వంటి అంశాల్లో పురోగతి సాధించింది. మొత్తం 1,055 మంది కార్మికుల కోసం రూ.72 లక్షలతో పరిశుభ్రత సామగ్రి కొనుగోలు చేసి పంపిణీ చేయడంతో పాటు, పారిశుద్ధ్య పనితీరు మెరుగుపర్చేందుకు చెత్త బిన్లు, వీల్‌బారోలు, ఇతర పనిముట్లను అందుబాటులోకి తీసుకువచ్చి, వేతన ఖాతాలను Axis Bank‌కు మార్చి ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది.

8, ఆగ 2026

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు

అమరావతిలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ విజయాన్ని నిలబెట్టే దిశగా 45 రోజుల ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలు, యువత సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీ తప్పుదారి పట్టించే ప్రయత్నాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

26, జులై 2026

ఆరోగ్య కారణాలతో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ రాజీనామా
అంతర్జాతీయం

ఆరోగ్య కారణాలతో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ రాజీనామా

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ ఆరోగ్య కారణాలతో, పదవీకాలం ముగియడానికి రెండేళ్లు మిగిలి ఉండగానే రాజీనామా చేశారు. ఆయన లండన్‌లో ఉన్నప్పుడు మాజీ ప్రధాని షేక్ హసీనాతో జరిగినట్లు ప్రచారంలో ఉన్న ఫోన్ సంభాషణ, దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు కూడా ఈ నిర్ణయానికి నేపథ్యంగా చర్చించబడుతున్నాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నిక వరకు పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు.

25, జులై 2026

పాలసీలు రూపొందించడం సులభమే..   అమలే అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

పాలసీలు రూపొందించడం సులభమే.. అమలే అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు

2019-2024 మధ్య ఏపీలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ఆ ఐదేళ్లూ విధ్వంసం జరిగిందన్నారు.

14, జులై 2026

జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో బరిలోకి సాత్విక్‌-చిరాగ్‌ జంట
క్రీడలు

జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో బరిలోకి సాత్విక్‌-చిరాగ్‌ జంట

జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జంట గాయం నుంచి తిరిగి బరిలోకి దిగుతూ ఫార్మ్‌ సాధించాలనే లక్ష్యంతో తొలి రౌండ్లో డెన్మార్క్‌ జంట డానియెల్‌-మాడ్స్‌ను ఎదుర్కోనుంది. ఈ టోర్నీలో P.V. సింధు, ఉన్నతి హోదా,లక్ష్య సేన్ ,ఆయుష్ శెట్టి తో పాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధృవ్ కపిల- తానిషా ,రుత్విక -రోహన్ జంటలు కూడా భారత తరఫున పోటీపడనుండగా, దేశవ్యాప్తంగా అభిమానులు వారి ప్రదర్శనపై దృష్టి పెట్టారు.

14, జులై 2026

ఎన్‌నినోపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. : మంత్రి నాదెండ్ల మనోహర్
రాజకీయాలు

ఎన్‌నినోపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. : మంత్రి నాదెండ్ల మనోహర్

గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలను అమలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తోందని తెలిపారు.

9, జులై 2026

ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
జిల్లా వార్తలు

ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

భూ మండలపురం గ్రామంలో భర్త సుబ్రహ్మణ్యం వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆవేదనతో భార్య దివ్య ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి, తానూ తాగడంతో విషాదం చోటుచేసుకుంది. హర్షిత్‌, గీత మృతి చెందగా, దివ్య పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

6, జులై 2026

రుషికొండ భవనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్

రుషికొండ భవనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మించిన పర్యాటక భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన ఈ భవనాలను లీజుకు కేటాయించాలని నిర్ణయించిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ఆసక్తి వ్యక్తీకరణ (EOI) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

3, జులై 2026

‘కల్కి 2898ఏడీ’లో బుజ్జి పాత్రకు ఆ తిరస్కారమే కారణం: కీర్తి సురేశ్‌
సినిమా

‘కల్కి 2898ఏడీ’లో బుజ్జి పాత్రకు ఆ తిరస్కారమే కారణం: కీర్తి సురేశ్‌

‘కల్కి 2898ఏడీ’ విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బుజ్జి పాత్రకు స్వరం అందించిన కీర్తి సురేశ్‌ తన అనుభవాలు పంచుకుంది. మొదట నాగ్‌ అశ్విన్‌ ఇచ్చిన మరో పాత్రపై నమ్మకం లేక తిరస్కరించగా, ఆ తర్వాత బుజ్జి పాత్ర ఆఫర్‌ రావడం తనకు అదృష్టంగా మారిందని తెలిపింది. కేవలం స్వరం ద్వారా చేసిన ఈ పాత్రే తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని ఆమె పేర్కొంది.

28, జూన్ 2026

అది క్రిమినల్స్ అదృష్టం: పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్

అది క్రిమినల్స్ అదృష్టం: పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేకపోవడం క్రిమినల్స్ అదృష్టమని వ్యాఖ్యానిస్తూ, ఇకపై గుండాలు, నేరగాళ్లపై కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. నేరస్తులను కుల కళ్లజోడుతో చూడకూడదని, కుల రాజకీయాలు సమాజాన్ని విభజిస్తున్నాయని విమర్శిస్తూ, బాధితులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని, జనసేన ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య ఉండి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

21, జూన్ 2026

జిల్లాకు రూ.1.07 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు : మంత్రి ఎస్. సవిత
జిల్లా వార్తలు

జిల్లాకు రూ.1.07 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు : మంత్రి ఎస్. సవిత

రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనిస్తూ కడపను పునరుత్పాదక ఇంధన, పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఎస్. సవిత తెలిపారు. సుమారు 4,500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు, రూ.1.07 లక్షల కోట్ల పెట్టుబడులు, 500 కిలోమీటర్ల రహదారి అభివృద్ధితో పాటు నాడు-నేడు ద్వారా పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదల, యువతకు నైపుణ్య శిక్షణ, స్థానిక ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఆమె పేర్కొన్నారు.

19, జూన్ 2026

కూటమి ప్రభుత్వంపై వైకాపా తప్పుడు ప్రచారం: ఎంపీ, ఎమ్మెల్యేల విమర్శలు
జిల్లా వార్తలు

కూటమి ప్రభుత్వంపై వైకాపా తప్పుడు ప్రచారం: ఎంపీ, ఎమ్మెల్యేల విమర్శలు

నంద్యాలలో జరిగిన ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ సభలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు వివరించారు. ఈ పథకాలు చూసి ఓర్చుకోలేక వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని వారు ఆరోపిస్తూ, అమరావతి అభివృద్ధి, రైతు సంక్షేమం, రాయలసీమ పురోగతికి కూటమి కట్టుబడి ఉందని, కేంద్ర–రాష్ట్రాల సమన్వయంతో పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు.

18, జూన్ 2026

అభివృద్ధిపై వైకాపాతో చర్చకు సిద్ధం: మంత్రి సవిత
జిల్లా వార్తలు

అభివృద్ధిపై వైకాపాతో చర్చకు సిద్ధం: మంత్రి సవిత

మంత్రి సవిత పుట్టపర్తిలో జరిగిన విజయోత్సవ సభలో వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నాయకుల విమర్శలను ఖండిస్తూ, రాష్ట్రంలో రెండేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడులు, పరిశ్రమలు, హార్టికల్చర్‌ హబ్‌, ఆరోగ్యశ్రీ వ్యయాలతో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చేందుకు కృషి చేస్తోందని మంత్రి సవిత, మంత్రి సత్యకుమార్‌యాదవ్ పేర్కొన్నారు.

17, జూన్ 2026

హోం మంత్రి అనితపై వ్యక్తిత్వ హననానికి వైసీపీ దిగజారింది: జగన్ పై రవికుమార్ ఫైర్
ఆంధ్రప్రదేశ్

హోం మంత్రి అనితపై వ్యక్తిత్వ హననానికి వైసీపీ దిగజారింది: జగన్ పై రవికుమార్ ఫైర్

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై మహిళల పట్ల అవమానకర వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హోం మంత్రి అనితను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిత్వ హననానికి దిగజారుతున్నారని, మహిళలను కించపరిచే వైఖరి కొనసాగితే వైసీపీకి భవిష్యత్తులో రాజకీయ నష్టం తప్పదని హెచ్చరించారు.

17, జూన్ 2026

రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ నిర‌స‌న‌ల హోరు
రాజకీయాలు

రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ నిర‌స‌న‌ల హోరు

రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్‌ఆర్‌సీపీ చేపట్టిన “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిరసన కార్యక్రమాలు 175 నియోజకవర్గాలన్నింటిలో ఉధృతంగా జరిగాయి. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువత, డీఎస్సీ బాధితులు పాల్గొన్న ఈ ర్యాలీల్లో ఇంధన, నిత్యావసర ధరల పెరుగుదల, డీఎస్సీ–2025 అక్రమాలు, నిరుద్యోగం వంటి సమస్యలపై నినాదాలు చేస్తూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించారు.

12, జూన్ 2026

రప్పా..రప్పా అంటే చూస్తూ ఊరు కుంటామా? : మంత్రి నారా లోకేశ్‌
రాజకీయాలు

రప్పా..రప్పా అంటే చూస్తూ ఊరు కుంటామా? : మంత్రి నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే ప్రజలకు నిజమైన స్వేచ్ఛను అందించిందని మంత్రి నారా లోకేశ్‌ దామినేడులో జరిగిన బహిరంగ సభలో తెలిపారు. గత ప్రభుత్వంలో అరాచకాలు, హత్యలు, దాడులు, దళితులపై దౌర్జన్యాలు జరిగాయని, ప్రస్తుత పాలనలో చట్టవ్యవస్థ పటిష్ఠంగా ఉందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలను నెరవేర్చుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్నామని, రాయలసీమ అభివృద్ధిలో ఎన్టీఆర్‌, చంద్రబాబు పాత్ర విశేషమని లోకేశ్‌ పేర్కొన్నారు.

12, జూన్ 2026

ప్రతి హామీకి  కట్టుబడి ఉన్నాం : డిప్యూటీ సీఎం పవన్‌
రాజకీయాలు

ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం : డిప్యూటీ సీఎం పవన్‌

ప్రజల తీర్పు చరిత్ర సృష్టించిందని, కూటమి అధికారం కోసం కాదు బాధ్యత కోసం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. జనసేనకు కేటాయించిన 21 స్థానాలన్నింటిలో విజయం ప్రజల నమ్మకానికి నిదర్శనమని, ఎన్నికల హామీల అమలు, పంచాయతీరాజ్‌ బలోపేతంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని దామినేడులో జరిగిన బహిరంగ సభలో చెప్పారు.

12, జూన్ 2026

కేంద్ర సహకారంతో స్వర్ణాంధ్రే లక్ష్యం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కేంద్ర సహకారంతో స్వర్ణాంధ్రే లక్ష్యం : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో చీకటి పాలన ముగిసి ప్రజాపాలన ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తిరుపతిలో జరిగిన సభలో పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని, వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ ఇప్పుడు అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టే పనిలో ఉన్నామని తెలిపారు. రాయలసీమలో స్టీల్ ప్లాంట్, బుల్లెట్ ఫ్యాక్టరీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల ద్వారా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

12, జూన్ 2026

పులివెందులలో భారీ ర్యాలీ… చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం
జిల్లా వార్తలు

పులివెందులలో భారీ ర్యాలీ… చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం

పులివెందులలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వైయస్ జయమ్మ విగ్రహానికి నివాళులర్పించి, పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి నేతృత్వంలో సాగిన ఈ ర్యాలీ స్థానిక రాజకీయ వాతావరణానికి చైతన్యం తీసుకువచ్చిందని వర్గాలు పేర్కొంటూ, కార్యక్రమం శాంతియుతంగా ముగిసిందని తెలిపారు.

12, జూన్ 2026

కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు : ప్రజలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
రాజకీయాలు

కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు : ప్రజలకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ప్రధాని నరేంద్ర మోదీకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం వదిలిన సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, కేంద్ర సహకారం, పవన్ కల్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలకు ప్రజల మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు.

12, జూన్ 2026

తిరుపతిలో రాజకీయ వేడి: వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ.. ఎన్డీయే విజయోత్సవ సభ
రాజకీయాలు

తిరుపతిలో రాజకీయ వేడి: వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ.. ఎన్డీయే విజయోత్సవ సభ

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇవాళ రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు వైఎస్సార్‌సీపీ ‘‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’’ పేరుతో భారీ నిరసన ర్యాలీకి, మరోవైపు ఎన్డీయే దామినీడులో విజయోత్సవ సభకు ఏర్పాట్లు చేసింది. రెండు కార్యక్రమాలు ఒకే రోజున, ఒకే నియోజకవర్గంలో ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై భారీ పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టింది.

12, జూన్ 2026

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్‌ : తాడిపత్రిలో ఉద్రిక్తత
రాజకీయాలు

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్‌ : తాడిపత్రిలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ ఆధ్వర్యంలో జరగాల్సిన ‘వెన్నుపోటు రెండేళ్లు’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి అనంతపురానికి తరలించగా, వైసీపీ, టీడీపీలు పోటాపోటీగా కార్యక్రమాలు ప్రకటించడంతో శాంతిభద్రతల దృష్ట్యా పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

12, జూన్ 2026

వచ్చే 24 నెలలు రాజకీయాలకు బ్రేక్ : సీఎం రేవంత్ సందేశం
తెలంగాణ

వచ్చే 24 నెలలు రాజకీయాలకు బ్రేక్ : సీఎం రేవంత్ సందేశం

సైబరాబాద్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 1.34 కోట్ల మందికి మౌలిక వసతులు కల్పించేందుకు మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే 24 నెలలు రాజకీయాలకు పక్కనబెట్టి రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని, కేసీఆర్ పదేళ్ల పాలన, మోదీ పన్నెండేళ్ల పాలన, తమ 30 నెలల పాలనపై తులనాత్మక చర్చకు సిద్ధమని పేర్కొన్నారు.

9, జూన్ 2026

తిరుపతి ‘సంక్షేమం’ సభ వాయిదా
రాజకీయాలు

తిరుపతి ‘సంక్షేమం’ సభ వాయిదా

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మృతి, పలువురు గాయపడటంతో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జూన్ 9న తిరుపతిలో జరగాల్సిన ‘సంక్షేమం’ విజయోత్సవ బహిరంగ సభను వాయిదా వేసింది. ఇలాంటి విషాద సమయంలో సభ నిర్వహించడం సముచితం కాదని భావించిన సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ తదితర కూటమి నేతలు చర్చించి, కొత్త తేదీని తరువాత ప్రకటించాలని నిర్ణయించారు.

8, జూన్ 2026

ఢిల్లీకి సీఎం బాబు, డిప్యూటీ సీఎం పవన్
రాజకీయాలు

ఢిల్లీకి సీఎం బాబు, డిప్యూటీ సీఎం పవన్

జూన్ 10న ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, కేంద్రం–రాష్ట్రాల సమన్వయం, ఎన్డీఏ భవిష్యత్తు వ్యూహాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధులు, రాష్ట్ర విభజన హామీల అమలు వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

8, జూన్ 2026

సర్కార్ విజయాలు ప్రజల్లోకి.. జూన్ 9న తిరుపతి లో బహిరంగసభ..
రాజకీయాలు

సర్కార్ విజయాలు ప్రజల్లోకి.. జూన్ 9న తిరుపతి లో బహిరంగసభ..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు, కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ 12 ఏళ్లు పూర్తికావస్తున్న నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కూటమి నేతలకు సూచించారు. జూన్ 9న తిరుపతి, 12న అమరావతి, 15న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు సమాధానంగా సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.

7, జూన్ 2026

రెండేళ్ల విజయాలపై ప్రజల్లోకి..  ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పనకు ఎన్డీఏ నేతల భేటీ
రాజకీయాలు

రెండేళ్ల విజయాలపై ప్రజల్లోకి.. ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పనకు ఎన్డీఏ నేతల భేటీ

రాష్ట్రంలో రెండేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విజయాలు, సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా చేర్చేందుకు చేపట్టే కార్యక్రమాలపై కార్యాచరణ ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశమయ్యారు. జిల్లాల, నియోజకవర్గాల స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, సభలు నిర్వహించే అంశంపై చర్చించి, తేదీలు, ప్రదేశాలు, రూపరేఖలపై సమగ్ర ప్రణాళికకు ఈ భేటీ దోహదపడినట్లు వర్గాలు తెలిపాయి.

4, జూన్ 2026

ప్రొద్దుటూరులో “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమం

ప్రొద్దుటూరులో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృత నిరసన నిర్వహించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు, ముఖ్యంగా మేనిఫెస్టోలోని వాగ్దానాలు, “సూపర్ సిక్స్” అమలు చేయలేదని ఆరోపిస్తూ మేనిఫెస్టో ప్రతులు, హామీ బాండ్ పత్రాలను చించివేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

4, జూన్ 2026

గొడ్డలి పార్టీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు: మంత్రి అచ్చెన్నాయుడు
రాజకీయాలు

గొడ్డలి పార్టీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు: మంత్రి అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, వైసీపీ పాలనను ప్రజావ్యతిరేకం, రాక్షస పాలనగా అభివర్ణిస్తూ 2024 ఎన్నికల్లో ప్రజలు గొడ్డలి పార్టీ రాజకీయాలకు చరమగీతం పాడారని అన్నారు. జగన్ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిందని, రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లి అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపిస్తూ, ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters